15, ఆగస్టు 2021, ఆదివారం

చీమల పుట్టలోకి

 చీమల పుట్టలోకి పాములు దూరాయి" స్వాతంత్రోద్యమ సంగ్రామమనే చీమల పుట్టలోకి పాములు దూరాయి..

దేశానికి స్వాతంత్య్రం రావటానికి కారణం ఎవరు అని ప్రశ్న అడిగిన మరుక్షణం, ఏ ఒక్కరి పేరు మాత్రమే చెప్పారు అంటే అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు..

నాతరానికి అసలు ఏమి తెలుసు..

స్వాతంత్రోద్యమ సంగ్రామాన్ని రాజకీయంగా తొలి మలుపు తిప్పిన కురువృద్దుడు దాదాబాయి నౌరోజీ గోప్పతనాన్ని దాచిపెట్టేసారు ..

దేశం కోసం 19 ఏళ్ళకే ఉరితాడు కు వేలాడిన ఖదీరాం బోస్ బోసు తల నాకు కనిపించనివ్వలేదు..

"నాకు మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రన్నీ ఇస్తాను" అన్న సుభాష్ చంద్రబోస్ పిలుపును జాతికి వినపడనివ్వలేదు.. పాతిక సంవత్సారాలు కూడా నిండని భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ల ఉరి తాడుని ముద్దాడిన సంఘటన నాకు తెలియనివ్వలేదు..

చంద్రశేఖర్ ఆజాద్ మీస కట్టు పౌరుషాన్ని అవహేళన చేసారు.. భారతీయుడి పగ అంటే తాచుపాము పగ అని నిరూపించిన ఉద్దావ్ సింగ్ ని ఊసే లేదు..

ప్రజాస్వామ్య హక్కులనే కాలరాసే మీకు "స్వాతంత్య్రం నా జన్మ హక్కు" అని నినదించిన బాలగంగాధర్ తిలక్ ఎలా కనిపిస్తాడు.. లాటి దెబ్బల గాయాలు తో చావుని కౌగిలించుకున్న లాలా లజిపతిరాయ్ ఎక్కడ!!

ముక్కలవ్వబోతున్న దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఊసెక్కడ

అగ్ని పర్వతం అల్లూరి జాడే లేదు..

ఇలా ఎంతమంది మహనీయుల కోసం చెప్పిన ఒకరు మిగిలిపోతూనే ఉంటారు..

ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎంతో మంది బలిదానల తో ముందుకు నడిచిన ఈ స్వాతంత్య్రం సంగ్రామం ఒక చీమల పుట్ట, త్వరలోనే ఆ చీమల చేతి కే ఆ పుట్ట రాబోతుంది..

విష సర్పాలను ప్రజలు గుర్తించే రోజులు త్వరలోనే రానున్నాయ్..అప్పుడు ప్రతీ భారతీయుడు తమ జాతి ఔన్నత్యాన్ని గుర్తించటం తో పాటు భారత్ మాతాకీ జై అని ఎందుకు అనాలి లాంటి ప్రశ్నలకు ఆస్కారమివ్వడు.. ప్రతీ ఒక్కరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. 

కామెంట్‌లు లేవు: