1, జులై 2023, శనివారం

వ్యాసోచ్ఛిష్టమ్

 '. 

వెంకటేశ్వర స్వామికి 'బీబీ నాంచారి' అనే ముస్లిమ్ భార్య ఉందని ఎలా కట్టుకథలు ప్రచారం చేశారో, అయ్యప్ప స్వామికి 'వావర్' అనే ముస్లిమ్ కు ఎలా సంబంధం అంటగట్టి ప్రచారం చేస్తున్నారో... హిందూ దేవాలయాలను దురాక్రమించి ఎలా దర్గాలు కట్టారో... అలాగే... అచ్చం అలాగే సాయిబును సాయిబాబాగా మార్చి, హిందువులకు అంటగట్టి ఇప్పుడు వ్యాసునికి సంబంధించిన గురుపౌర్ణమిని సాయిబాబాకు చేసేస్తున్నారు!


వ్యాసపౌర్ణమి లేదా గురుపౌర్ణమి అనగా ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పర్వదినం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి.


చాలా మంది తెలియక ఎలా పడితే ఆలా ఎవరికి పడితే వారికి పూజ చేస్తున్నారు. అసలు గురు పూజ మొదట ఎవరికీ చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని పెద్దలు ఒక పద్ధతిని తీసుకొని వచ్చారు.


అదే వ్యాస పౌర్ణమి నాడు జగద్గురువులైన వేదవ్యాసుల వారికి చేసే గురు పూజ.


సాధారణంగా గురుస్వరూపాలకి ఆరాధన ప్రక్రియ లేదు కానీ ఏ మహాపురుషుడి వలన వేద విభాగం జరిగిందో, సమస్త వాఙ్మయం భూమిమీదకు వచ్చిందో అట్టి జగద్గువులైన వేదవ్యాసులవారికి శిష్యులు మరియు మిగతా గురు పరంపర అంతా కలిసి ఒకరోజు కృతజ్ఞతగా పూజ చేస్తారు. అదే గురు పౌర్ణమి. పువ్వు జ్ఞానానికి గుర్తు. కాబట్టి అటువంటి జ్ఞానం మనందరికీ కలగాలని ఆరోజున శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోని, వ్యాసుల వారి ఫోటోని కానీ లేదా వ్యాస పాదుకల దగ్గర శిష్యులు, మిగతా గురుపరంపర ఒక్కో పువ్వుని సమర్పిస్తారు.


వేద వ్యాస మహర్షుల వారు మన జాతికి చేసిన సేవ అంతా యింతా కాదు. కలియుగంలో వేదాన్ని పూర్తిగా చదవలేరని, కనీసం అర్ధం కూడా చేసుకోలేని రోజులు వస్తాయని భవిష్యద్దర్శనం చేసి, ఒక వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి, అవి కూడా పఠనం చేయలేక పోతారేమోనని అష్టాదశ పురాణాలను పంచి పెట్టారు. పంచమ వేదమైన మహాభారత ఇతిహాస గ్రంధాన్ని ఇచ్చి ఒక్కొక్క వేదాన్ని ఒక్కో శిష్యుడి ద్వారా ప్రచారంఁగావించి, పురాణాలను సూత మహర్షుల చేత ప్రచారం చేయించారు.


ఒకవేళ కలియుగంలో ఈ గ్రంథాలను కూడా మనుషులు అర్ధం చేసుకోఁగలరో లేదో అన్న దూరదృష్టితో సమస్త వేద, పురాణ, ఉపనిషత్తుల యొక్క సారాంశమైన శ్రీకృష్ణ భగవానుడి కథలను, హరి నామ వైభవాన్ని శ్రీమద్భాగవతంలో నిక్షిప్తం చేసి ఎప్పుడు భక్తితత్పరతతో ఉండే తన కుమారుడైన శుకమహర్షుల వారి చేత ప్రచారంఁగావింపఁజేసి సమస్త మానవాళిని ఉద్ధరించిన మహాపురుషుడు వ్యాస మహర్షి.


వ్యాస మహర్షుల వారు ఇచ్చిన వాఙ్మయం ఆధారం చేసుకొని తర్వాతి కాలంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, అన్నమాచార్య, రామదాస, మహర్షులవంటి మహాత్ములు గురుపరంపరగా భగవానుడి యొక్క కథలను, గుణవిశేషాలను శిష్యులకి ప్రచారం గావించి సనాతన ధర్మాన్ని మానవాళికి అందించారు. నేటికీ మన గురువులచే అందిపుచ్చుకుంటున్నాము. 


"సమస్త వాఙ్మయం వ్యాసోచ్ఛిష్టమ్" అంటారు పెద్దలు. అంటే ఎవరు ఏ వాఙ్మయాన్ని చెప్పినా, అది వ్యాసులవారు ఏది చెప్పారో దాని నుంచే చెప్పబడింది తప్ప వేరుగా ఏది లేదు అని. అంత గొప్ప వాఙ్మయాన్ని ఇచ్చారు. మనకి ఇంతటి భక్తి, జ్ఞాన బోధనలు చేసి, గురు పరంపరను తీసుకొని వచ్చి సనాతన ధర్మాన్ని ప్రచారంగావించిన అటువంటి మహాపురుషుడికి గురుపౌర్ణమి రోజున పూజ చేసుకోవడం మన అదృష్టం.


అలాంటి గొప్ప అదృష్టాన్ని అందిపుచ్చుకోకుండా మన పురాతనమైన సంస్కృతిని వేదాలను అపహస్యం చేస్తూ మన వేద పండితులను గురువర్యులను పక్కన పెట్టి, ముస్లిం బాబాలను సాయిబులను గురువులను చేస్తున్నాము. 


మన భారత దేశ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాము. 

మన  వేలితో మన కంటినే పొడుచుకుని గుడ్డివాళ్లం అవుతున్నాం. ఇక నుంచైనా మారుద్దాం. మన ధర్మాన్ని సంస్కృతి ని వేదాలను మనకు అందించిన గురువులను గుర్తించి వారిని గౌరవించి మన సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకుందాం.


శ్రీమన్నారాయణుడి అంశావతారమైన వ్యాస మహర్షుల వారిని గురు పౌర్ణమి రోజున స్మరించినందువలన మన పాపరాశి దగ్దమైపోతుంది.

 - శ్రీ గురుభ్యోనమః

Vinod Kumar Varma గారి ఫేస్ బుక్ పోస్ట్ నుంచి సేకరణ.

కామెంట్‌లు లేవు: