రామాయణమ్ 338
...
శాంతించండి,మీరంతా కాస్త ప్రశాంతముగా ఆలోచించండి !
.
నాయనలారా ! ఏదేని ఒక కార్యమును సామ,దాన,భేదములను మూడు ఉపాయముల ద్వారా సాధించలేనప్పుడు మాత్రమే దండోపాయముమునకు పూనుకొనవలెను.
.
ఏమరపాటుగా ఉన్నవారు
ఇంకొక శత్రువుచేత ఆక్రమింపబడినవారు
దైవము ప్రతికూలముగా ఉన్నవారు
ఇలాంటి వారివిషయములో బాగా పరీక్షించి పరాక్రమము ప్రదర్శించినచో అది సఫలమగును.
.
ఆ రాముడు బలవంతుడు ,ఏమరుపాటులేనివాడు,జయించవలెనన్న పట్టుదలతోఉన్నవాడు,ఆయన కోపమును జయించినవాడు ,ఎదిరింపశక్యము కాని వాడు మహాబలవంతుడు !! ఆయనను ఏవిధముగా ఎదిరింపగలమని అనుకొను చున్నారు ?
.
అసలు అంతకుమునుపు ఎవడైనా సముద్రమును దాటివచ్చి లంక చేరగలిగినాడా ?..హనుమంతుడు వచ్చి సీతాదేవిని చూసి మాటలాడి ,లంకను తగులపెట్టి తిరిగి వెళ్ళిపోయినాడు . అసలు ఇటువంటి సంఘటన జరుగ గలదు అని మనము ఎప్పుడైనా కలలోనైనా ఊహించినామా?
.
రాక్షసరాజు జనస్థానమునుండి రాముని భార్యను అపహరించినాడు రాముడు ఏ అపరాధము చేసినాడని సీత అపహరణకు గురి అయినది ? మనకు రాముడి వలనజరిగిన అపకారమేదైనా ఉన్నదా?
.
మన ఖరుడిని చంపినాడు అని అందురేమో !! స్వీయరక్షణ ఏ ప్రాణి చేయకుండును ? మితిమీరి ప్రవర్తించిన ఖరుని రాముడు చంపినాడు అందులో దోషమేమున్నది ?
.
సీత మన లంకకు వినాశ హేతువు ! తీసుకొని వచ్చిన ఆమెను మరల వెనుకకు పంపివేయవలెను ! అనవసర కలహముల వలన ఏమి ప్రయోజనము ?
...అనుచూ విభీషణుడు ప్రసంగింస్తూనే ఉన్నాడు.
.
NB
.
కామందక నీతి అని ఒక నీతి ఉన్నది !ఎప్పుడు శత్రువుపై దండెత్తవచ్చును ..దీనిని
Political Strategies, Corporate wars కు కూడా అన్వయించుకొనవచ్చును.
.
శత్రవు బాలుడైనప్పుడు
శత్రువు వృద్ధుడైనప్పుడు
దీర్ఘరోగి
జ్ఞాతులచే వెలివేయబడ్డవాడు
పిరికివాడు
పిరికి పరిజనము ఉన్నప్పుడు
లోభము కలవాడైనప్పుడు
ప్రజలయొక్క ప్రేమ కోల్పోయినప్పుడు
....ఇంకా వున్నాయి..అవి రేపు
.
వూటుకూరు జానకిరామారావు
.
.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి