22, జులై 2020, బుధవారం

వ్యాపారస్థులలో చాలామంది కరొన బారిన పడుతున్నారు

ముఖ్యముగా వ్యాపారస్థులలో చాలామంది కరొన బారిన పడుతున్నారు. కొంతమంది మరణిస్తున్నారు..

అందుకు ప్రధాన కారణాలు:

1) వ్యాపారస్తులు షాప్ లో  ఉన్నపుడు మాస్కులు పెట్టుకోకపోవడం, లేదా చెమట  వల్ల పెట్టుకున్న  మాస్కులు తరచుగా తీస్తూ ఉండటం,
2) మాస్కును తరచుగా తాకడం,
3) మాస్కును తాకినా వెంటనె శానిటైజ్ చేసుకోకపోవడం,
4) డబ్బులను తీసుకున్న వెంటనే శానిటైజ్ చేసుకోక పోవడం,
5) డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మిని అంటించి నోటితో తడిచేసుకోవడం,
6) మన షాపులు దగ్గర కస్టమర్లు డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యకపోవడం,
 7) వివిద రకాలైన కస్టమర్లు మాన షాపులకి మాస్కులు లెకుండా రావడం వారిని మనం వారించకపోవడం,
8) ప్రతి కస్టమర్ శానిటైజ్ చేసుకునే ఏర్పాట్లు చెయ్యక పోవడం,
9) కరోనా గురించి అవగాహన  ఉన్న అది మనకి రాదులే అని  నిర్లక్ష్యం వహించడం,
10) కరోనా మానవూరిలో లెదు కదా అనో తక్కువగ ఉందనో అనుకోవడవం,
11) సరుకుల కొనుగోలు దగ్గర సొషల్ డిస్టన్స్ లేకపోవడం, డబ్బులు ఇచ్చిపుచ్చుకొనేదగ్గర డబ్బులు నొటితో తాకడం. కొన్న వాటిని పాసెంజర్ ఆటోలో తరలించడం వాటిలో ప్రయాణించడం..

మనకి బ్రతకడానికి డబ్బులుకావాలి.. మందులు లేని జబ్బులు తెచ్చే డబ్బులు వద్దు..!!

మన అజాగ్రత్త మొత్తమ్ మన కుటుంబానికి ప్రమాదంగా మారుతుంది గురుతుంచుకోండి.

కామెంట్‌లు లేవు: