18, అక్టోబర్ 2020, ఆదివారం

కృపా వలంబనకరి

 🕉️భిక్షామ్ దేహి కృపా వలంబనకరి మతాన్నపూర్ణేశ్వరి🕉️ 🙏👉అందరికి నమస్కారం   ఇవాళ అన్నపూర్ణాదేవి

గురించి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం 

🕉️ శ్లో||వామే మాణిక్యపాత్రం మధురసభరితం బిభ్రతీం పాణిపద్మే

దివ్యైరన్నైః ప్రపూర్ణాం ద్రుతమణివలయే దక్షిణే రత్నదర్వీమ్

రత్నాంగీం పీనతుంగ స్తనభరనమితాం తారా!రోపసేవ్యాం

వందేపూర్ణేం దుబింబ ప్రతిభట వదినా మంబి కామన్నపూర్ణామ్.

 👉 నవరాత్ర పూజావిధానం ప్రకారం రెండవ "రోజైన విదియనాడు శ్రీ

అన్నపూర్ణాదేవిని పూజిస్తారు.

 సమస్త ప్రాణికోటికి #వనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్నారు. పార్వతీదేవి సృష్టిం చిన ఒక సంఘటన వలన పరమశివునికి ఎక్కడ భిక్ష దోరకని

సందర్భాన అన్నపూర్ణాదేవి రసపాత్రతో దర్శ నమిస్తుం ది. ఆది$క్షువైన ఈశ్వరునికి భిక్ష

పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. 

 శిష్యులతో కాశీ క్షేత్రమును దర్శిం చిన వ్యాసునికి ఏడురోజుల పాటు ఎక్కడ భిక్ష

దోరకలేదు. దాంతో క్షుద్భాధ భరించలేక వ్యాసుడు తన చేతిలోని కమండలంలోని ఉదకాన్ని

దక్షిణ హస్తం లో పోసుకుని కాశీ నగరాన్ని శపించేందుకు పూనుకుంటాడు.

వెంటనే అన్నపూర్ణాదేవి వృద్ధ వనిత రూపంలో వచ్చి అతనిని వారించి "నీ ఆగ్రహం

ముక్కంటికి ఇంకా కోపం తెప్పించిందా? ఆయినా నీవు క్షుద్బాధతో వున్నావు. నా ఇంటికి రా

మంచి ఆతిథ్యాన్ని ఇస్తాను" అన్నది. అనంతరం వ్యాసుడు శిష్యులతో సహా గంగానదిలో

స్నానం ముగించి 'జనానికి వస్తాడు. కమ్మని 'జనాన్ని శిష్యులంతా ఆరగించారు. 

అప్పుడు వ్యాసుడు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఈరూపంలో వచ్చి తన క్షుద్బాధను, కోపాన్ని

చల్లబరిచి కడుపునింపిందని గ్రహించి, తల్లిని అనుగ్రహించమని ప్రార్థిస్తూవుండగా కాశీ

విశ్వేశ్వరుడు వచ్చి వ్యాసుని కా)పట్నం వదలి పొమ్మని శపిస్తాడు.

 అనంతరం అన్నపూర్ణాదేవి కటాక్షం తో దక్షిణ కాశీగా పేరుగాంచిన దాక్షారామ

*మేశ్వరుని చెంతకు చేరాడు. 

 ప్రపంచ సృష్టి పోషకురాలు అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే అన్నవస్త్రాలకు

లోటుండదు, మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధురభాషణ, సమయస్ఫూర్తి, వాక్శు ద్ధి, 

భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి.

 ఈమెకు నివేదన (దధ్యన్నము.)🙏స్వస్తి 🙏 శ్రీ దత్త శర్మ 8277246156

కామెంట్‌లు లేవు: