7, నవంబర్ 2020, శనివారం

మన ఇతిహాసాలు

 *📖 మన ఇతిహాసాలు 📓*



*రామాయణం, మహాభారతం- రెండింటిలోనూ కనిపించే ఒకే పాత్రలు*


రామాయణ మహాభారతాలు హిందూ పురాణాలలో మహా కావ్యాలుగా పూజింపబడుతూ యుగయుగాలుగా గౌరవించబడుతున్నాయి. హిందువులు వీటిని కేవలం కధలుగా కాకుండా ఇతిహాసం లేదా చరిత్ర గా భావిస్తారు.ఈ కావ్యాలలో వర్ణించబడిన సంఘ్తటనలు నిజం గా జరిగాయని, మరియూ వాటిలోని పాత్రధారులు ఒకప్పుడు రక్త మాంసాలతో కూడిన శరీరం తో భూమి మీద తిరిగారనీ హిందువుల విశ్వాసం. రామాయణం త్రేతా యుగం(యుగాలలో రెండవది)లో జరిగితే, మహాభారతం ద్వాపర యుగం(మూడవ యుగం) లో జరిగింది. ఈ రెంటి నడుమ చాలా సంవత్సరాల వ్యత్యాసం(బహూశా కొన్ని మిలియన్ల సంవత్సరాలు) ఉంది.కానీ ఈ రెండింటిలోనూ కనిపించిన పాత్రలు కొన్ని ఉన్నాయి. 


 *హనుమాన్*


హనుమంతుడు సుగ్రీవుని సచివుడు(మంత్రి) మరియు శ్రీరాముడి భక్తాగ్రేసరుడు.రామయణం లో హనుమంతుని పాత్ర ముఖ్య పాత్రలలో ఒకటి.ఈయన మహాభారతం లో కూడా కనిపిస్తారు.హనుమంతుని సోదరుడైన భీముడు(వాయుదేవుడు వీరి పితామహుడు)సౌగంధికా పుష్పాన్ని తీసుకురావడానికి వెళ్తుండగా ఒక పెద్ద ముసలి వానరం భీముడి దారికి అడ్డంగా తన తోకని అడ్డం పెట్టి పడుకుంది.ఆగ్రహించిన భీముడు తోకని అడ్డం తీయమని అడిగాడు.అప్పుడు ఆ వానరం తాను ముసలిదాన్నయిపోవడం వల్ల అలసిపోయాననీ భీముడే తనని పక్కకి తప్పించాలనీ సమాధానమిచ్చింది.తన శక్తి సామర్ధ్యాల కి గర్వించే భీముడు ముసలి వానరం తోకని కాస్తయినా కదల్చలేకపోయాడు. గర్వ భంగమైన భీముడు తానెవరో తెలుపవలసిందిగా ముసలి వానరాన్ని కోరాడు.అప్పుడు ఆ ముసలి వానరం తాను హనుమంతుడినని చెప్పి భీముడిని ఆశీర్వాదిస్తుంది.

కామెంట్‌లు లేవు: