20, నవంబర్ 2020, శుక్రవారం

భజగోవిందం

 *దశిక రాము**


**మోహముద్గరః**

(భజగోవిందం)

25)

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ 
మా కురు యత్నం విగ్రహసంధౌ|
సర్వస్మిన్నపి పశ్యా త్మానం
సర్వత్రో త్సృజ భేద జ్ఞానమ్||
-
శ్లోకం అర్ధం : శత్రువునైనా, మిత్రుడనైనా, పుత్రుడనైనా, బంధువునైనా కలహము చేయక, కూర్మిని చూపి శత్రు భావమును సంహరించుము. ఇతరుల పైన కోపము చేసిన నిన్ను నీవె కోపించిన తీరు నీలో, అందరిలొ శ్రీహరి నుండ ఇతరుల నేల దూషణ చేతువు? 
-
తాత్పర్యము : భగవంతుడు సర్వ వ్యాప్తి, జడ, చైతన్య, వస్తు, జంతు పదార్ధములందు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. 
చిన్న చీమ నుంచి, పెద్ద ఏనుగు వరకు సమస్త జీవులయందు స్వామి ఆత్మరూపములో వెలయుచున్నాడు. జంతువులు, పక్షులు, క్రిములు, మానవులు, వన్యమృగములు, చెట్లు, చేమలు మున్నగు భూ, జల, వాయు నిలయ సమస్త జీవులు శ్రీహరి ప్రతిరూపములే. 
భగవంతుడు సూక్ష్మముగా జీవులలోను, ఊర్జముగా పంచభూతములలోను నిక్షిప్తుడై ఉన్నాడు. అందుచే అన్ని జీవులను సమభావముతో చూడవలెను. ఎవ్వరిపై కోపతాపములు చూపరాదు, ఎవ్వరితో కలహించరాదు. 
అందరినీ ప్రేమతో, దయతో చూడవలెను. ద్వేష, విరోధ భావములను రూపు మాపి శాంతి, సహృదయము అలవరచు కోవలెను. శత్రువులైనను, పుత్రులైనను, బంధువులైనను అందరినీ ఒకే తీరు ఆదరించ వలెను. 
భేద భావము చూపుట కేవలము అజ్ఞానమే.
🙏🙏🙏

**ధర్మము-సంస్కృతి**

కామెంట్‌లు లేవు: