20, నవంబర్ 2020, శుక్రవారం

Aaradhana

 💟🕉️💟


కొన్ని ముఖ్యమైన విషయాలు. 


పూజ :- పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణఫలాన్నిచ్చేది.


అర్చన:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది. అర్చన ఆనందం ఇస్తుంది. 


జపం:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జివున్ని , దేవుణ్ణి చేస్తుంది. 


స్తోత్రం:- నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం. ఇది శాంతి నీ ఇస్తుంది.


ధ్యానం:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది. ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం. 


దీక్ష:- దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.


అభిషేకం :- అభిషేకం చేస్తే , చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి. అభిషేకం అహంకారం పోగెట్టి పరా తత్వాన్ని అందిస్తుంది. పరమ పవిత్రమైన శాంతి ని ఇస్తుంది.


మంత్రం:- తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తి నీ ఇస్తుంది. 


ఆసనం:- ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.


తర్పణం:- పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.


గంధం:- గంధం లో సర్వ దేవత కొలువు అయి ఉన్నారు. దేవతలు అమ్మవారిని ఇలా అడిగారు. అమ్మ 

మేము కూడా మీ పూజ లో ఉండాలి . అని అన్నారు. అప్పుడు అమ్మవారు మీరు గంధం లో కొలువు అయి ఉండండి అని వరం ఇచ్చింది. అప్పటినుండి గంధం కి ఉత్తమంగా పూజ లో వాడుతున్నారు. గంధం మంచి కి సూచిక. 


అక్షతలు:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ , మంచి బియ్యం కలిపి చేయాలి. 


పుష్పం:- పుణ్యాన్ని వృద్ధిచేసే. , పాపాన్ని పోగొట్టేది. మంచి బుద్ధిని ఇచ్చేది.

అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి. 

 మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభమ్ కలుగుతుంది. 


ధూపం:- చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా మంచి జరుగుతుంది. ఈ వాసనకి ప్రేత , 

పిచాచాలు పారిపోతాయి. 


దీపం:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానం కి సూచన. 

 పూజ గదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. అగ్ని శివ కుమారుడు అయిన కుమార స్వామి కి ప్రతీక. 


నైవేద్యం:- మధుర పదార్థాలను, దేవతకు తృప్తినిచ్చే దానిని నివేదన చేయుటయే నైవేద్యం అంటారు. భగవాన్ నివేదన అయిపోయాక దానినే ప్రసాదం అంటారు.


ప్రసాదం:- ప్రకాశానందాల నిచ్చేది. సామరస్యాన్ని కల్గించేది. పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ప్రసాదం భగవాన్ యొక్క 

అనుగ్రహం కి సూచిక.

 పవిత్ర మైనది. 


ఆచమనీయం:- ఇది జలం తో చేయవచ్చు. 


స్వాగతం, ఆవాహనం:- దేవతను ఆహ్వానించడం. అలాగే పూజ కొరకు దేవతను పిలుచట నీ ఆవాహన అని అంటారు. పూజలో దేవత పేరుతో మంత్రాన్ని పఠిస్తూ పూజ మొదలు పెడుతారు. మొదట మహా గణపతి, గురువు నుండి మొదలు పెట్టాలి. ముఖ్యంగా కుల దేవత ఆహ్వానం జరుగాలి. ఇది మర్చిపోవద్దు. 


పాద్యం:- చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.


మధుపర్కం:- తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది. ఇది ఆరోగ్యం కోసం మంచిది. జీర్ణ వ్యవస్థ నీ మంచిగా ఉంచుతుంది.


స్నానం:- స్నానం అనేది శరీర శుద్ది కోసం అయితే ఈ స్నానమునీ మౌనంగా భగవాన్ నామాన్ని మానసికంగా స్మరిస్తూ చేస్తే మంచిది. 


వందనం:- అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం, మరియు చేతులు జోడించి వందనం చేయండి. సాష్టాంగ ప్రణామం అనగా వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి. ఇది స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళ పై భగవాన్ కి వందనం చేయొచ్చు. 


ఉద్వాసన:- దేవత లను, ఆవరణ దేవతలను పూజించి, పూజను ముగించడాన్ని ఉద్వాసనమని అంటారు. చివర్లో ప్రార్థన , దోష క్షమాపణ చెప్పి తీర్థ , ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయాలి. 


స్వస్తి

🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: