20, నవంబర్ 2020, శుక్రవారం

ఏ రాశుల వారు ఏ జ్యోతిర్లింగాన్ని

 ఏ రాశుల వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి ???

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.


*ద్వాదశ రాశుల మంత్రాలు ఇవి*


1 ) మేష రాశి :- ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః

2 ) వృషభరాశి :- ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయనమః

3) మిథున రాశి :- ఓం క్లీం కృష్ణాయ నమః 

4) కర్కాటక రాశి :- ఓం క్లీం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః 

5) సింహరాశి :- ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః 

6) కన్యారాశి :- ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః 

7) తులారాశి :- ఓం తత్వ నిరంజనాయ తారకారామాయ నమః 

8) వృశ్చికరాశి :- ఓం నారాయణాయ నరసింహాయ నమః 

9) ధనూరాశి :- ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః 

10 ) మకరరాశి :- ఓం శ్రీ వత్సలాయ నమః 

11 ) కుంభరాశి :- ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః 

12 ) మీనరాశి :- ఓం క్లీం ఉధృతాయ ఉద్దారిణే నమః


రాశుల ననుసరించి పై మహామంత్రాల్ని జపిస్తే మానవుడు చాలా భాగం మాయ నుండి బయట పడతాడు. సృష్టి స్థితి లయలకు మాయ మూలస్థానం. దీనికి లోబడే జగత్తు కాలభ్రమణ మవుతోంది . మయుడు మాయకే సూత్రధారి. అదే విష్ణుమాయ. త్రిమూర్తులు కూడా మాయబద్దులే. మానవుడు జాగ్రత్తగా ఉంటూ, ధార్మిక నియమాలు పాటిస్తూ ఉంటే, సర్వశుభాలు సమకూరు- టయేగాక , మరొక జన్మలేని పరమ పదాన్ని చేరతాడు . లోకకళ్యాణం కోసం మానవుడు ఏ కార్యం ఆచరిస్తాడో అదే సత్యం. అదే ధర్మం. అదే సత్య ధర్మం . 


ద్వాదశ రాశులు-- ద్వాదశ జ్యోతిర్లింగాలు


*మేషరాశి: రామేశ్వరం 

శ్లోకం:- సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖై్య

శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి.

ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర,, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామచంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము ప్రతిష్టించెనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, ఎర్ర వస్త్ర దానములు కుడా చేసిన మంచి ఫలితములు వచ్చును.


*వృషభ రాశి: సోమనాధ జ్యోతిర్లింగము*

శ్లోకం:- సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే.

ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుదభ్రిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది.


*మిధున రాశి: నాగేశ్వర జ్యోతిర్లింగం:*

శ్లోకం:-యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై ,

సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే.

ఈ రాశి బుధునికి స్వగృహము. దోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, ప్రతి రోజు పై శ్లోకమును చదువుట, ఈ రాశి శని సంచరించు కాలమునందు జన్మ నక్షత్ర రోజున కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపించిన విశేషమైన ఫలితములు కలుగును.


*కర్కాటకం: ఓంకార జ్యోతిర్లింగం:*

శ్లోకం:-కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ,

సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే

ఈ రాశి చంద్రునకు స్వగృహం , . ఓంకార జ్యోతిర్లింగ దర్శనం, రోజు పై శ్లోకం చదువుట , జన్మ నక్షత్రం రోజున ఓంకార బీజాక్షరం ఉచ్ఛరిస్తూ ఉండటం మంచి నివారణ ఉపాయములు.

*సింహరాశి : శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం*

శ్లోకం:-ఇలాపురే రమ్య విశాల కేస్మిన్‌ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం, వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘ్రుష్నేస్వర జ్యోతిర్లింగ దర్శనం, పై శ్లోకమును రోజు చదువుట, జన్మ నక్షత్రం నాడు ఏక దశ రుదభ్రిషేకం ద్వారా దోషాల నుండి విముక్తి పొందవచ్చును.


*కన్యా రాశి: శ్రీ శైల జ్యోతిర్లింగం*

శ్లోకం:-శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం,

తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం.

ఈ రాశికి అధిపతి బుధుడు. బాధల నుండి ఉపశమనం పొందుటకు శ్రీ శైల మల్లిఖార్జున దర్శనం, భ్రమరాంబకి కుంకుమ అర్చన, జన్మ నక్షత్రం రోజున చండి హోమం చేసిన ఉపశమనం పొందగలరు. రోజు పైన చెప్పిన శ్లోకం చదువుట, జన్మ నక్షత్రం రోజున ఆవుకి ఆకు కూరలు, పచ్చ పెసలు తినిపించుట మంచిది.


*తులారాశి: మహాకాళేశ్వరం*

శ్లోకం:- అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం అకాల మౄఎత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం ఈ రాశికి శుక్రుడు అధిపతి, మహాకాళేశ్వర దర్శనము ద్వారా, శుక్రవారము సూర్యోదయ సమయములో బొబ్బర్లు దానం చేయుట ద్వారా దోషములు, బాధలనుండి విముక్తి పొందవచ్చును.


*వృశ్చిక రాశి: వైద్యనాదేశ్వరుడు*

శ్లోకం:-పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం ,

నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి.

ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకి కారణ భూతం. బాధలకు వైద్య నాదేశ్వరుని దర్శించి , పూజించుట ద్వారా, మంగళవారము జన్మ నక్షత్రము రోజున కందులు, ఎరన్రి వస్త్రములు దానము చేయుట మంచిది. ఋతు క్రమ దోషములున్న స్త్రీలు పెద్ద ముత్తైదువులకు యెరన్రి వస్త్రములు దానము చేయుట మంచిది.


*ధనురాశి : విశ్వేశ్వర లింగం*

శ్లోకం:- సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం

వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే.

ఈ రాశి వారికి గురుడు అధిపతి, స్వస్తానం. వేదాంత ధోరణి విపరీత ఆలోచనలు, సైంటిఫిక్‌ ఆలోచనలు, వీరి లక్షణం. అద్దిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన కాశీ క్షేత్రం, , అన్నపూర్ణ వద్ద శివుడు భిక్ష అడుగుట, అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున నారాయణ మంత్రంతొ శివుడు జీవులకి మోక్షము ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్పబడింది. పై శ్లోక పారాయణ, పూజ చేయుట, కాశి క్షేత్ర దర్శనము , గురువారము రోజున, జన్మ నక్షత్రము రోజున శనగల దానము ఇచ్చుట ద్వారా శని, గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును.


*మకరము: భీమ శంకరం*

శ్లోకం:- యం డాకినీ శాకినికాసమాజై : నిషేవ్యమాణం పిశితా శనైశ్చ , సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి. ఈ రాశి అధిపతి శని. గురునికి నీచ, కుజునికి ఉచ్చ,గురుడు అంటే జీవుడు , అహంకారపూరితమైన గజరాజు మొసలిచే పీడించబడి గజేంద్ర మోక్షము అనే ఆర్తి పూరితమైన ఘట్టం పురాణాలలో చెప్పబడింది. దోషాలకి భీమ శంకరం దర్శనం,,పూజ చేయుట, పై శ్లోక పారాయణము నిత్య పారాయణము, శని వారము నల్ల నువ్వుల దానము, నల్లని వస్త్రాలు దానము ఇచ్చుట, అవిటివారికి, ముసలి వారికి వస్త్ర దానము చేయుట మంచిది


*కుంభం:కేదారేశ్వరుడు*

శ్లోకం:-మహాద్రి పార్శే్వ చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్రై్ద :

సురాసురై ర్యక్ష మహోర గాదై్య : కేదారమీశం శివమేక మీడే .

ఈ రాశికి శని అధిపతి, దోషాలకి కేదాద్రేశ్వర దర్శనము, పూజించుట, నిత్యమూ పై శ్లోక పారాయణము, శని వారము నువ్వుల దానము, అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చేసిన మంచిది.


*మీన రాశి: త్రయంబకేశ్వరుడు* 

శ్లోకం:-సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాథ్‌ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే . ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడు నీటి మధ్యలో ఉంటాడు. అధిక ఫలితాలని ఇస్తాడని పురాణ ప్రసిద్ది. దోషాలకు త్రయంబకేశ్వర దర్శనము, చిత్రపటము పూజ మందిరమునందు ఉంచి నిత్యమూ పై శ్లోకము పారాయణము చేయుట మంచిది.

కామెంట్‌లు లేవు: