*2070*
*కం*
ధనికులు విద్యావంతులు
ఘనజీవన్మూర్తులైన కడతేరగనే
తనువును శవమని పిలుతురు
మననము ప్రేతని తలతురు మహిలో సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ధనికులు, విద్యావంతులు, గొప్ప జీవితం గడుపుతూ ఉన్న వారైననూ కడతేరగనే ఈ భూలోకంలో దేహాన్ని శవం అని పిలుస్తారు, వ్యక్తి ని ప్రేత అని తలుస్తారు.
*సందేశం*:-- ఎంత గొప్పపేరు ప్రతిష్ఠ లు కల వారి నైనా చనిపోయిన వెంటనే శవం, ప్రేత అనే పేరులతో మాత్రమే గుర్తిస్తారు. అక్కడ అందరూ సమానులే.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి