*పల్కుల్ రాని యిసుంగు శ్లోకముల నభ్యాసించి పేరున్ గొనెన్*
ఈ సమస్యకు నా పూరణ.
మేల్కొల్పెన్ గద రాజపుత్రి తనకున్ మేడ్పడ్డ యా భర్తనున్
చుల్కన్ జేయకె, తల్లి కాళి దయచే జొక్కంబుగా వాగ్ఝరిన్
పల్కన్ నేరిపి, కాళిదాసునకు పెన్ బాండిత్య మున్నీయగా
పల్కుల్ రాని నిసుంగు శ్లోకముల నభ్యాసించి పేరున్ గొనెన్.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి