శ్రీమద్భగవద్గీత: ఏడవ అధ్యాయం
విజ్ఞానయోగం: శ్రీ భగవానువాచ
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ (13)
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే (14)
ఈ మూడుగుణాల ప్రభావంవల్ల ప్రపంచమంతా భ్రమచెంది, వాటికంటే విలక్షణుడిగా, వినాశం లేనివాడిగా నన్ను గ్రహించలేక పోతున్నది. త్రిగుణస్వరూపమైన ఈ నా దైవమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించినవాళ్ళు దానిని అతిక్రమిస్తారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి