మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు - . మధుమేహ నివారణ చూర్ణం.
. మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించును. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది శరీరం నందలి రస,రక్త ధాతువులు కొన్ని కారణాలచే క్షీణించడం వలన వాతం ప్రకోపించడం వలన కలుగునది. రెండోవది శరీరం నందు వాతం సంచరించు మార్గములలో కొన్ని దోషములు అడ్డగించునపుడు వాతం ప్రకోపం చెంది కలుగునది . మొదటి రకమైన ధాతు క్షయముచే వచ్చు మధుమేహము తగ్గుట అసాధ్యము. జీవితాంతం ఔషధాలు వాడుతూ ఉండవలెను.
•. మధుమేహ రోగులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు -
. పాతబియ్యం , పాత గోధుమలు, రాగిమాల్ట్, మేకమాంసం , మజ్జిగ, కందిపప్పు కట్టు, పెసర కట్టు, పాత చింతపండు, ఉసిరికాయ, వెలగపండు, తోటకూర, పాలకూర, మెంతికూర , కొయ్యతోటకూర, పొన్నగంటికూర, లేత మునగ కూర, లేత బీరకాయ, లేత సొరకాయ, లేత పొట్లకాయ, లేత బెండ , లేత క్యాబేజి, లేత టమాటో లేతవి మాత్రమే తీసుకోవాలి . బూడిద గుమ్మడి , కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి .జొన్నరొట్టె చాలా మంచిది.
• తీసుకోకూడని ఆహారపదార్థాలు -
. తేలికగా అరగని ఆహారం నిషిద్దం, చేపలు , రొయ్యలు తినరాదు. మద్యపానం , ధూమపానం నిషిద్దం , పెరుగు వాడరాదు , ఇంగువ, వెల్లుల్లి వాడకూడదు, నువ్వులు , నువ్వుల నూనె , ఆవాలు, ఆవనూనె వాడరాదు. ఎర్రగుమ్మడి తీసుకోరాదు, శనగపిండి తినరాదు, నూనెతో వేపిన పదార్థాలు వాడరాదు, కొబ్బరి ముట్టుకోకూడదు, పనస, ద్రాక్ష, కమలా పండ్లు నిషిద్దం, దుంపకూరలు పూర్తిగా మానివేయాలి, భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు, బెల్లము , కొత్త చింతపండు వాడరాదు .
మధుమేహ ఔషధాలు వాడు సమయంలో టీ , కాఫీ , మద్యం , మాంసాహారం ముట్టుకోరాదు. త్వరగా గుణం కనిపించును.
• మధుమేహ నివారణా చూర్ణం -
.
. 14 రకాల మూలికలతో చేసిన "మధుమేహ చూర్ణం " మా దగ్గర లభ్యం అగును. ఈ చూర్ణం మధుమేహం, దీర్ఘాకాలంగా మధుమేహం ఉండటం వలన అంతర్గత అవయవాల మీద పడు దుష్ప్రభావాలను అద్భుతంగా నయం చేయును. శరీరంలో కోల్పోయిన శక్తిని పునురుద్దరించును. రక్తశుద్ధి చేయును. శరీరము నందలి వ్యర్థ పదార్ధాలను బయటకి పంపును. శరీరం శుద్ధి అగును. మధుమేహ రోగులకు సంభవించు నరాల దోషమును సంపూర్ణముగా పోగొట్టును.
ఈ చూర్ణము కావలసిన వారు 9885030034 నెంబర్ నందు సంప్రదించగలరు.
కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి