18, జులై 2020, శనివారం

పంటి నొప్పి ప్రాణం లాగేస్తుంది.

40 ఏళ్ళు దాటిన వారికి సహజంగా వచ్చే సాధారణ ఆరోగ్య సమస్య పంటి నొప్పి. పంటినొప్పి అనుభవం లేని వారు వుండరంటే  అతిశయోక్తి కాదనుకుంటా.
మన ఇంట్లో దొరికే వాటితో ఈ బాధను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శీఘ్రముగా నివారించుకోవచ్చు.
ఇలా చేయండి.
కావలసినవి 2 వెల్లుల్లి పాయలు, కొంచం సైన్ధవ లవణం. లేని యెడల మామూలు ఉప్పు ఒక చిటికెడు.
ఇప్పుడు మీరు వెల్లుల్లిని ఉప్పును కలిపి ఒక చిన్న కల్వం లేదా రాయి మీద మెత్తగా నూరండి. ఆ నూరిన ముద్దను మీకు ఏ పన్ను బాదిస్తుందో ఆ పన్ను మీద పెట్టండి. బాగా నోట్లో ఉమ్మి ఊరుతుంది ఉమ్మివేయండి. కొంచం సేపు కాగానే నీటితో నోటిని శుభ్రం చేసుకోండి. ఇలా మీ నెప్పి తగ్గేదాకా చేయండి. కేవలం రెండు మూడు సార్లు చేస్తే చాలు మీ నొప్పి మాయం.
వెల్లుల్లి మంచి అంటి ఇన్ఫలమాటివ్, ఆంటీ బాక్టీరియల్  అంటే నెప్పి తీసే గుణం, పుండును మానిచే గుణం ఉందన్నమాట. ఈ విధంగా చేయండి నొప్పిని వదిలించుకోండి.


కామెంట్‌లు లేవు: