18, జులై 2020, శనివారం

జ్ఞానస్యాభరణం క్షమా

ఒకానొక  చక్రవర్తి  యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశయిల్లింది. 
తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్లునెత్తికెక్కాయని.

 అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.

'మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును' అన్నాడు. 

అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు. 

తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. 

దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి 'ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు' అన్నాడు. 

పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు. 

ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండదు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు' అన్నాడు మంత్రి మళ్ళీ. 

పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు. 

వెంటనే ఆలోచించాడు...

 మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్ర ల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది. జ్ఞానోదయమయింది. 

వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, 'గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. 
బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్ల పరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్లగా ఉంచు తుంది.
అందం కాదు!!! గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి' అన్నాడు.

ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్ర గుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరో కాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.

 నరస్యాభరణం రూపం
 రూపస్యాభరణం గుణమ్‌
 గుణస్యాభరణం జ్ఞానమ్‌
 జ్ఞానస్యాభరణం క్షమా

మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం.

పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది. 

అంటే మంచి అంద గాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు. 

వినయం అనేది మనిషిలో ఎల్ల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి. 

కొందరు ఓటమి చవి చూసి నప్పుడో, బాధలలో మునిగిపోయినప్పుడో తమ బాధలు వెళ్ళబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు. 

అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించి నపుడు, సంపదలు వచ్చినపుడు, మంచి పదవి ఉన్నపుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్న చూపు చూస్తారు. కించ పరుస్తారు. మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు. 

అందంగా ఉండడం మంచిదే కాని తను అందంగా ఉన్నానని అందవిహీన మయిన పనులు చేయడం తగనిది. 

అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది దీని సారాంశం!!! 
సదా క్షేమ దాయకం కూడా!!!
^^^^^^^^^^^^^^^********

హిందూ ధర్మాన్ని కాపాడాలి
ఇది ఎవ్వరిని విమర్శించటానికి, లేక ఎవ్వరి మనస్సు నొప్పించటానికి కాదు.  కేవలం ఇప్పటి మన హైందవ ధర్మం యెక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్రాసింది.
ఇప్పుడు మన హిందూ ధర్మానికి మూడు విధాల గ్లానులు కలుగుతున్నాయి.
1) ఇతర మతస్తులు మన హిందువులపై మాయ మాటలు చెప్పి వారి మతంలోకి మార్చుకోటం అంటే మతమార్పిడి.
2) నాస్తిక వాదం
3) సాయి బాబా వాదం.
ఇప్పుడు ప్రతిది క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

1) మతమార్పిడి.: మన దేశంలో ముఖ్యంగా క్రైస్తవులు మన హిందువులలో మన ధర్మం మీద అవగాహన లేని గ్రామీణ ప్రజలని మభ్య పెట్టి కొంత ధనం, ద్రవ్యాలు ఇచ్చి మతమార్పిడి చేస్తున్నారు. మన ధర్మంలో కూడా కొంతమంది హిందూ ధర్మ ప్రచారకులు వాటిని ఆపటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతవరకు వారి ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి.  కానీ ఇంకా ఇంకా మన ధర్మం మీద ప్రతివారికి అవగాహన రావాలి అందరు ఒక ఉద్యమంగా మారి ఈ మాత మార్పిడులను అరికట్టాల్సిన అవసరం వుంది.
ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మేము ప్రార్ధన చేసి మీ రోగం తగ్గిస్తామని వారికి నమ్మబలికి కొన్నాళ్లకు వారిని తమ మతంలోకి మార్చుకుంటున్నారు. దీనిని మనమందరం అరికట్టాల్సిన అవసరం ఎంతయినా వుంది.

2) నాస్తిక వాదులు; మన హిందుత్వంలోనే జన్మించిన కొందరు హిందూ ధర్మం మీద అవగాహన లేక కొంతమంది చెప్పే వాటిని నమ్మి దేముడు లేడు అని ప్రచారం చేస్తున్నారు.  వారికి మన హిందూ ధర్మం మీద మన పురాతన జ్జ్ఞానంమీద అవగాహన కల్పిస్తే తప్పక వీరు హిందుత్వపు గొప్పతనం తెలుసుకోగలుగుతారు.

3) సాయి బాబా వాదం ఇది ముఖ్యంగా మన బ్రహ్మళ్లలో వుంది.  సాయి బాబా దేముడని సాక్షాత్తు దత్తాత్రయ అవతారం అని ప్రచారం చేస్తున్నారు.   మన ధర్మం ఎవరిని నీచంగా చూడామని, విమర్శించమని చెప్పదు. కానీ మన ఉనికికి ప్రమాదం ఏర్పడే టప్పుడు మనం మన జాగ్రత్తలో ఉండాలి మన వారికి సరైన మార్గంలో ఉంచాలిసిన అవసరం వుంది.
సాయి బాబా ఒక మంచి ఫకీర్ ఐ ఉండవచ్చు, కానీ అతను మొదటగా హిందువు కాదు, రెండు ఆయన ఒక పాడుబడ్డ మసీదులో నివాసం ఉన్నట్లు చెపుతున్నారు, మూడు తను ఎప్పుడు తన మత దేముడి స్మరణే చేసినట్లు చెపుతున్నారు.  మరి ఆయన మన హిందూ దేముడు యెట్లా అవుతారు.  ఆలోచించండి. జ్ఞానులు ఇతర మతాలలో కూడా వుంటారు.  వారిని మనం జ్ఞానులుగానే పరిగణించాలి కానీ దేముడి హోదా ఇవ్వకూడదు కదా.

తన తప్పశెక్తితో కొన్ని మహిమలు చూపి ఉండొచ్చు మనం కాదనం. కానీ ఇటీవల కాలంలో వున్న మహానుభావులు, శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణ మహర్షిలను కూడా మనం యోగులుగా చూస్తున్నాం కానీ ఎవరికి దేముడి హోదా ఇవ్వలేదు కదా.  అంతేకాదు ఆది శంకరాచార్య, రామానుజచార్య, మద్వాచార్య లను మనం హిందూ ధర్మమును కాపాడటానికి వచ్చిన మహానుభావులుగా చూస్తున్నాము కానీ ఎవ్వరికీ మనం దేముడి హోదా ఇవ్వలేదు గమనించగలరు.  ఇంకా వెనకకి వెళ్ళితే, ఎందరో మహర్షులు, బ్రహ్మర్షులు, మన భారత గడ్డమీద జన్మించారు అది మనకు వారి జ్ఞాన సంపద వల్ల తెలుస్తున్నది. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశారు. ఎందరో ఋషులు వరాలు, శాపాలు ఇచ్చారని మనకు పురాణాలవల్ల తెలుస్తున్నది. మరి మనం ఎవ్వరికీ దేముడి హోదా ఇవ్వలేదు.  కాబట్టి మేధావులు ముఖ్యంగా సాయి బాబాను ఆరాధించే వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను.
ధర్మాన్ని రక్షించండి అది మిమ్ములను మీ కుటుంబాన్ని రక్షిస్తుంది.
సార్వే జానా సుఖినోభవంతు
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
**************
హిందువులకు దేముళ్ళు ఎందరు;
ఈ మధ్య నేను ఒక సరిస్తవాపాస్టర్ వీడియో చూసా అందులో ఆయన ఒక మాట అన్నాడు. బహు దేముళ్ళను కొలిచే వారికి నరకం వస్తుంది అని. అంతేకాదు హిందువులు బహు దేముళ్ళని సేవిస్తున్నారు కావట్టి వాళ్లు నరకం పొందుతారని వారి బైబులు చెపుతున్నాడని హిందువులని వాళ్ళ మతంలోకి మార్చుకొనే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రసంగం. ఇటువంటి విమర్శలను మన హిందువులు అందరు ఎదుర్కొనే స్థాయికి మన జ్ఞానం పెంపొందించువాలి. అప్పుడే అటువంటి వాటినుండి మనలను మన ధర్మాన్ని కాపాడుకోగలం.
ఈ శ్లోకం గమనించండి
ఆకాశాత్ పతితం తోయం యధా గాస్చేతి సాగర
సర్వ దేవా నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి.
భావం ఆకాశం నుండి వచ్చిన నీరు ఏవిధంగా అయితే సముద్రాన్ని చేరుతుందో అదే విధంగా అన్ని దేవతలకు చేసిన నమస్కారం కేశవునికే చెందుతుంది అని అర్ధం.
దీనిని బట్టి మనకు రెండు విషయాలు తెలుస్తాయి అవి. 1) ఎంతమంది దేవతలకు నమస్కరించిన అందరు ఒక్కరే ఆ ఒక్కరు కేశవుడు మాత్రమే. కాబట్టి మనం ఏదేముడిని ఏ పేరుతొ కొలిచిన మన నమస్కారం మాత్రం ఆ దేవా దేవుడైన కేశవుడిని మాత్రమే చేరుతాయి అని అర్ధం. ఇప్పుడు చెప్పండి హిందువులకు దేముళ్ళు ఎందరు. ఉన్నది ఒక్కడే ఆ దేముడిని మనం వివిధ రూపాలతో వివిధ నామాలతో పూజిస్తున్నాం.
మీకు ఇంకా సరళంగా అర్ధం కావటానికి ఒక సాధారణ ఉపమానంతో చెప్పే ప్రయత్నం చేస్తాను.
మీకు తహసీల్దారు ఆఫీసు నుండి ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి మీరు ఏమి చేస్తారు మీరు మీ అర్జీని అక్కడి ఇన్వార్డ్ క్లర్కుకి ఇస్తారు, ఆ క్లర్కు మీ అర్జీని తీసుకుంటాడు. నిజానికి మీ అర్జిమీద తహసీల్దారుగారి పేరుమీదనే వుంది. ఆ క్లార్క్ రెండు మూడు రోజుల్లో కార్యాల ఇతర సిబ్బంది, వీ ఆర్ ఓ , ఆర్, ఓ. ల ఎండోస్మెంట్ తో తహసీల్దారు గారివద్దకు పంపుతారు. అవన్నీ మీకు తెలియకుండానే జరుగుతాయి. తరువాత మీరు వచ్చి ఔట్వేర్డ్ క్లర్కునుండి తహసీల్దారు గారి సంతకంతో మీకు మీ సర్టిఫికెట్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మీకు తహసీల్దారుగారు మాత్రమే మీ పని చేయ సమర్ధుడు. కానీ మీరు అతనిని కనీసం కలవనుకుడా కాలవ లేదు. కానీ ఆయన ద్వారా మాత్రమే మీకు సర్టిఫికెట్ వచ్చింది.
మీరు ఆఫీసుకి వెళ్ళినప్పుడు అక్కడి ఇన్వార్డ్ కాలేర్క్ కు నమస్కరించారు కానీ తహసీల్దారిని చూడను కూడా చూడలేదు. మరల మీ సర్టిఫికెట్ పొందినప్పుడు కూడా మీకు అది ఇచ్చిన క్లర్కుకే నమస్కరించారు. అదే విధంగా మన హిందూ సాంప్రదాయంలో భగవంతుని కంట్రోల్లో వున్న అనేక శాఖలు వివిధ ఉద్యోగస్తులకు అంటే వివిధ దేవతలకు ఆయన అప్పచెప్పారు ఉదాహరణకు ధనము కావాలంటే లక్షి దేవికి, విద్య కావాలంటే సరస్వతికి, ధైర్యం కావాలంటే పార్వతి దేవికి తన శక్తిని ఇచ్చారు, ఇంకా ఉప శాఖలు కూడా ఉదాహరణకు ధనానికి ధన లక్ష్మి, ధాన్యానికి ధన్య లక్ష్మి, సౌభాగ్యానికి సౌభాగ్య లక్ష్మి అదే విధంగా మిగిలిన దేవతలకు కూడా.
ప్రతి పని చేయటానికి కార్యాలయంలో ఒక్కొక్క ఉద్యోగస్తుడు వున్నా అన్నీ కూడా ఆ ఆపేసారు పేరుమీదే జరుగుతాయి. అదేవిధంగా మనం ఏ దేముడిని కొలిచిన అన్ని ఆ పరమాత్మా పేరుమీదే.  అది తెలుకొని ఇతర మతస్తులు మన ధర్మాన్ని విమర్శిస్తున్నారు. మన వాళ్ళు వాళ్ళ మాటలు నమ్ముతున్నారు.
మిత్రులారా ఇప్పుడు కాదు ఎప్పటికి మన హిందూ ధర్మాన్ని విమర్శించే స్థాయికి ఇతర మతస్తులు ఎవ్వరు ఎదగ లేదు, ఎదగ లేరు ఎందుకంటె మన ధర్మం, మన జ్ఞానం అప్పరమైనది. మన దేశంలో దైవ సాక్షాత్కారం పొందిన మహానుభావులు ఎందరో వున్నారు. ఇప్పటిలో కొన్ని వందల సమత్సరాల్నుండి తప్పస్సు చేస్తున్న మహర్షులు ఎందరో మన హిమాలయాలలో వున్నారు ఇది సత్యం.
ఓ హిందూ మేలుకో నీ ధర్మాన్ని తెలుసుకో
సర్వ్ జన సుఖినోభవంతు
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
*****************
ఈ పోస్టు పాతదే ఆయన స్ఫూర్తిదాయకం.
**************
ఆర్యా ఈ పోస్టుకు కర్తను నేను కాదు ఎక్కడినుంచో ఎత్తుకొచ్చి పెట్టాను.  మీ ప్రశంసలకు అర్హుడిని నేను కాదు.
****************
ఇక్కడ మనం ఒక విషయం గనించాలి మనకు వున్న శాస్త్రీయ పరిజ్ఞానంకు వైదిక్ పరిజ్ఞానంకు కొంత వ్యత్యాసం ఉంటుంది. దానికి కారణం నేను చెప్పలేను. ఉదాహరణకు చతుసాగర పర్యంతం అని మనం చెప్పుకుంటాము, కానీ మనం ఏడు సముద్రాలని  చదువుకున్నాం. మనం చదువుకున్న సముద్రాలు వేరు ఆ సాగరాలు వేరు. మన వైదిక్ జ్ఞానంమలో కొన్ని అంతరార్ధాలు ఉంటాయి అవి మన స్థూల దృష్టికి బోధ పడవు.
******************
మిత్రులకు విన్నపం. నేను తరచూ ఈ నంబరు కలపండి ఆ నంబరు కలపండి అనే రెక్యూస్తులు చూస్తూ ఇది వ్రాస్తున్నాను. దయచేసి మీ మిత్రులని కూడా ఈ గ్రూపులో చేర్చ దలుచుకుంటే మనకు గ్రూప్ ఇన్విటేషన్లు పంపుతున్నారు వాటిని మీ మిత్రులకు షేర్ చేయండి.  అక్కడ వారు క్లిక్ చేస్తే గ్రూపులోకి చేరుతారు. మనం అడ్మిన్ గారిని విసికించకుండా ఇది చేయటం మంచిది కదా. ఇప్పటికి సభ్యులు అడిగే పుస్తక భాండాగారాన్ని తెస్తూ వారు చాలా శ్రమిస్తున్నారు. గమనించగలరు
***************
మీ అభినందనల వర్షాన్ని నేను భరించలేకుండా వున్నాను. మీకు కృతఙ్ఞతలు.




కామెంట్‌లు లేవు: