18, జులై 2020, శనివారం

అద్వైతతత్త్వము

భగవానుడు భారతయుద్ధంలో పార్థసారథియై అర్జునుని రథం తోలాడు. అర్జునుడు దయార్ద్రచిత్తుడై శోకగ్రస్తుడు కాగా భగవంతు డతణ్ణి ఈ చందంగా మందలించాడు.

క్లైబ్యం మాస్మ గమః పార్థ నై తత్త్వయ్యుపపద్యతే,
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్యోత్తిష్ఠ పరంతప.

పరంతప్సశత్రువులకు మంటెత్తించే శక్తిగల ఓ అర్జునా! క్లైబ్యం మాస్మ గమ్సఃమగటిమిని కోలుపోకు. గుండెలు జారిపోనీకు. కయ్యం పోవడానికి సిద్ధపడే వచ్చావ్. ఇపుడు వెనుదీయడ మెందుకు?

'యుద్ధం పాపం, కయ్యానికి నడుంకట్టిన నా గురువులు పెద్దలు అన్నలుతమ్ములు వీరి నందరిని నే నెట్లా చంపేది? కనుక యుద్ధం చేయను' అని అతడు దుఃఖముచేత వికలుడై రథమ్మీద కూలబడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పయిని చెప్పినట్టులుగా మందలించాడు.

ఇంకా ఈ రీతిగా బోధింపడానికి పూనుకొన్నాడు. నీవు భీష్ము డనిన్నీ ద్రోణు డనిన్నీ కర్ణు డనిన్నీ ఎవరిని అంటావో వారొకనా డుంటే మర్నాడు పోయేవారే. శరీరాలకు భీష్ముడు ద్రోణుడు అనే పేరు లేదు. ఆత్మ ఖండింపబడదు. అగ్ని ఆత్మను కాల్పలేదు, 'పావకః ఏనం న దహతి' నీరు దీనిని తడపలేదు, 'ఆపః ఏనం న క్లేదయంతి.' గాలి దానిని ఎండిపోయేట్లు శోషించేట్లు చేయలేదు. ''మారుతః న శోషయతి''

అచ్చేద్యోయమదాహ్యూయ మక్లేద్యోశోష్యేవ చ,
నిత్య స్సర్వగతఃస్థాణు రచలోయం సనాతనః.

దీనిని ఖండింపనూ మండింపనూ ఎండింపనూ తడిముద్దగాచేసి పారేయనూ వీలుకాదు. ఇది శాశ్వతమైనది. పాము కూసాన్ని వదిలిపెటుతుంది. ఇంకో కూసం వస్తుంది. ఆలాగే ఒక శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. పోయేది శరీరమే. ఆత్మమాత్రం నిత్యం. ఆత్మ అనేది భీష్ముడు ద్రోణుడు అని నీవు చెప్పేవారి శరీరంలో ఉండి తెలిసికొనే చైతన్యమే. పోయేది వచ్చేది దేహమే. దేహం పోతే యేం? ఇంకో దేహం వస్తుంది. విదేహస్థితిలో ఉండేది ఆనందమే. అదిలేక ఆత్మ, 'అయం నిత్యః సర్వగతః స్థాణుః అచలః సనాతనః' అతడు నిత్యుడు, అనగా మూడు కాలాలలోనూ ఉండేవాడు. సర్వగత్సఃఎక్కడబడితే అక్కడ ఉండే వ్యాపకుడు. స్థాణ్సుఃస్థిరమయినవాడు, నిలుకడ అయినవాడు. అచల్సఃచలనము లేక కదలు లేనివాడు. సనాతన్సఃఎల్లయపుడును ఉండెడివాడు. అందుచేత ఈ భీష్మద్రోణాదులు నీ బాణాదులచే చచ్చిపోతారని అనుకొని గడబిడ పడకు. అని శ్రీకృష్ణుడు అర్జునునికి జ్ఞానోపదేశం చేశాడు.

అర్జునుని ప్రశ్న ఏమిటి? పూజింపదగిన భీష్మద్రోణాదులను నేను బాణాలచే ఎట్లా బాధిస్తాను? అన్నలూ బావమరదులూ ఆచార్యులున్నూ కదా నాకు శత్రువులు. వారిని చంపి జయము పొందితే కలిగే లాభం ఏమిటి? రాజ్యం ఒకటేకదా? కావలసినవారు చుట్టపక్కాలు గురువులు గురుపుత్రులు ఇందరూ చచ్చిపోతేగాని రానిరాజ్యం వస్తేనేం పోతేనేం? గురువులను చంపకుండా బిచ్చమెత్తి అయినా పొట్ట పూడ్చుకోవచ్చును. కాని 'నెత్తురుతో తడిపిన అర్థకామాదులను అనుభవించడం ఎట్లా? అని అర్జునుడు తన మనసులోని వ్యథను వెళ్ళబెట్టాడు. 'నెత్తుట తడిసిన' కూడు అంటానికి ఆంగ్లంలో 'బ్టడ్ స్టెయిన్ డ్' అని అంటారు. అర్జునుడు 'దేహమే ఆత్మ' అని అనుకొని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు తగినచందంగా ప్రత్యుత్తరం చెప్పదలచి-ఓయీ! నీవు ద్రోణుడూ భీష్ముడూ అనేది వారి దేహాలనా లేక వారి ఆత్మలనా? శరీరం నాశనంకావచ్చు, పుట్టిన వస్తువేనాడో గిట్టవలసిందే. ఏదయినా విత్తునాటితే ఈనాడు మొలకెత్తి పెరిగి ఏనాడో మళ్ళా గిట్టవలసినదే. మనం చూస్తూండగానే ఎండి పడిపోతుంది. అలాగే శరీరం కూడా పడిపోతుంది. లోపల ఉండే ఆత్మ అవినాశి. దానికి చావు పుట్టుకలులేవు.

అవినాశి తు తద్విద్ధియేన సర్వమిదం తతమ్,
వినాశ మవ్యయస్యాస్య నకశ్చిత్కర్తు మర్హతి.
- గీత. 2-17

ఏ వస్తు వీ ప్రపంచ మంతా నిండి ఉందో ఆ వస్తువు నాశరహితమయిన దని తెలిసికో. మార్పు లేని వస్తువును నాశనం చేయడ మనేది కాని పని. దేనిచేత ఈ ప్రపంచమంతా నిండి తొణికిసలాడుతూందో దానికి నాశమనే మాటలేదు.

ఏ వస్తువు లోకమంతా నిండి ఉంది అని అంటే అంతటికీ అంతర్యామియైన వస్తు వీశ్వరుడే అని చెప్పవలసి వస్తుంది. ఆతడే నాశం లేనివాడు నిత్యుడు చావుపుట్టులు లేనివాడు. శరీరం లోపలా వెలుపలాఉండే దతడే. అతడే లోపల ఉండి 'నేను నేను' అని తోచే అహంభావంతో కూడియున్న వాడు. ఆయన తప్ప వేరే వస్తువు మరిలేదు. సర్వగతమయిన అట్టి వస్తువుకు నాశంలేదు. అందుచేత వారినీ వీరినీ నాశనం చేస్తున్నానే అనే సందేహం అక్కరలేదు. వీరి ఆత్మ అవినాశి. నశించేది దేహమే. ఆత్మ అన్ని శరీరాలలోనూ ఉండే వస్తువే. అదే యీ భీష్మ ద్రోణాదుల శరీరంలోనూ ఉంది. నీవు చంపేది వారి దేహాలను. వారి ఆత్మలను నీవు నాశనం చేయలేవు' ఈతత్త్వం నీవు తెలిసికో అని భగవానుడు అర్జునుడు ఉపదేశం చేశారు.

ఒక స్విచ్ నొక్కితే అన్ని దీపాలూ వెలుగుతై. ఆ దీపాలు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి' వీనికన్నిటికీ మూలమయిన శక్తి ఒక్కటి. ఒక దీపం పగిలిపోయినంతమాత్రాన మూలశక్తి మాయమవుతుందని ఎవరయినీ అనగలరా? ఇట్లే జ్ఞానమయంగా అన్ని చోటులా అఖండంగా వ్యాపించియున్న శక్తి శరీరాలనుండి బుద్ధిరూపంగా వ్యాపించి వుంది. మహామతుల ఆత్మ మహాత్మగా అల్పమతుల ఆత్మ అల్పాత్మగా అవుతూంది. అట్టి వస్తువు నీచే ఎట్లా చంపబడుతుంది. నేను చంపుతాను అని అనుకోవడము తప్పే. కనుక నీ ధర్మం చెయ్.

దేహినో స్మిన్ యథా దేహే కౌమారం ¸°వనం జరా,
తథా దేహాంతర ప్రాప్తిః ధీర స్తత్ర న ముహ్యతి.
- గీత. 2-13

జీవుడు వేరువేరుగా అన్ని శరీరాలలోనూ ఉన్నాడు. అంతటా వ్యాపకంగా ఏకశరీరంగా లేకపోయినా అనేక భేదాలుగా ఉన్న శరీరాలలో ఉన్నా, ఈ శరీరంలో కౌమారమూ ¸°వనమూ వార్ధకమూ అనే మార్పులు కలగడం లేదా? అలాగే చచ్చి మరొక శరీరం పొందడము గూడా ఒక మార్పే, శరీరం నశించినప్పుడు తాను నశించడం లేదని తెలిసికొన్న జ్ఞాని ఇదంతా చూచి భ్రమపొందడంలేదు.

జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ,
తస్మా దపరిహార్యేర్ధే న త్వం శోచితు మర్హసి.
- గీత. 2-27

పుట్టినవాడు గిట్టటం నిక్కం. అలాగే చచ్చినవాడున్నూ పుట్టటమున్నూ నిక్కమే. కనుక తప్పించుకోరాని విషయం పట్ల మనకు శోకం ఎందుకు? ఏ కారణంవల్ల నయినానేమి ఎన్నడూ వీరందరూ చచ్చిపోవలసినవారే, అందుచేత వారి కొరకు నీవు నీధర్మం ఎందుకు పోగొట్టుకోవాలి! అలాఐతే నీకు ధర్మచ్యుతి కలుగుతుంది. ధర్మయుద్ధానికి మించిందేదీ లేదు. నీవు చంపబడతావా వీరస్వర్గం సంపాదిస్తావు-'హతో వా స్వర్గం ప్రాప్యసి', జయం పొందుతావా రాజ్యమేలుతావ్. 'జిత్వా వాభోక్ష్యసే మహీమ్'. ఎట్లా అయినా శ్రేయమే. ఇట్లా కాక యుద్ధవిముఖుడవయితే ధర్మం నెరవేర్పలేక ధైర్యం చాలక పారిపోయాడనే వాదు నీ వెంటనే ఉంటుంది.

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయామ్,
సంభావితస్య చాకీర్తిర్మరణా దతిరిచ్యతే.
- గీత. 2-34

అదియుగాక జను లందరూ నీ అపకీర్తిని చాలాకాలం ఘోషిస్తూనే ఉంటారు. ఎన్నిక అయినవానికి అపకీర్తి చావుకంటె ఎక్కువ శోకం కలిగిస్తుంది. పోనీ నీవు యుద్ధం చేయక పరుగెత్తిపోతే వీరి శరీరాలు శాశ్వతాలా? అట్టిది లేదే! కనుక శరీరాలనుగూర్చి నీవు చింతపడక కయ్యానికి నడుంకట్టు. శ్రీకృష్ణభగవాను లిట్లా-''తస్మాద్యుధ్యస్వ భారత'' కనుక యుద్ధం చెయ్! అని ముగించారు.

భగవంతు డొకపుడు అద్వైతసరళిలో మాటాడతారు. మరొకవుడు మీమాంసకుల రీతిగా చర్చ చేస్తారు. ఇట్లా ఇన్ని విధాలుగా చర్చ చేస్తే మనం దేన్ని పట్టుకోవాలి? వారే ఇలా ఇంకో శ్లోకం చెప్పారు -

యావా నర్థ ఉదపానే సర్వత స్సంప్ణుతోదకే,
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః

ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని పరిశీలిస్తే మొదట మొదట మనకు ఏ అర్థమూ గోచరించదు. ఉదపాన మంటే తాగే నీరు. బావులలో గుంటలలో చెరువులలో మనకు తాగేనీళ్లు దొరకుతయ్. వీనివల్ల మనకు ఏప్రయోజనం కలుగుతుందో నీటి వెల్లువలు వచ్చినా ఆ ప్రయోజనమే కలుగుతుంది. మంచి బ్రాహ్మడికి ఎరుకవల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో అన్ని వేదాలవల్ల అంతే ప్రయోజనం కలుగుతుంది.

ఆదిశంకరు లవతరించి దిగ్విజయం చేసే కాలంలో శాంతమూ ఆనందమూ కలిగించే నిజతత్త్వం ఇలా అందరీకీ ఉపదేశించారు-'ఆత్మకంటె వేరయిన వస్తు వేదీ లేదు. ఆత్మకు భిన్నంగా ఇంకో వస్తువు ఉన్న దనే మిథ్యాజ్ఞానమే దుఃఖానికి కారణం. నేను వేరు ఆత్మ వేరు అనే తలపే అజ్ఞానం' అని.

వారి పరంపరనుండి వచ్చిన సదాశివబ్రహ్మేంద్రసరస్వతి ఆచార్యులవారు చెప్పిన అద్వైతతత్త్వమనే-'సర్వంబ్రహ్మమయ మ్మనిచెప్పారు. ''చూచే వస్తువు చూడబడే వస్తువూ'' ఈ రెండూ ఒకటే అని శంకరులు దిగ్విజయం చేశారు. శంకరులు కాశిలో ఉపదేశం చేస్తున్న కాలంలో వ్యాస భగవానులే ముసలివేషంలో వచ్చి వాదించి శంకరులవారి కీర్తిని నలుగురికీ తెలిసేటటులు చేశారని ఒక కథ. శంకరులను శంకరుల అవతార మనే చెపుతారు. ఆ రీతిగానే వ్యాసాచార్యులవారు మహావిష్ణువనియే ప్రతీతి - ''శంకర శ్శంకర స్సాక్షాత్.'' - 'వ్యాసాయ విష్ణురూపాయ'.

శంకరులు విద్యాభ్యాసకాలంలో శాస్త్రాల నన్నింటినీ ఎంత సూక్ష్మంగా విచారించారో ఆ సంగతి శంకరదిగ్విజయంలోని ఈ దిగువ ఉదాహరించిన శ్లోకం చెపుతుంది.

అన్వీక్షిక్త్యెక్షి తంత్రే
పరిచిత రతులా కాపిలే కాపి లేభే.
పీతం పాతంజలాంభః
పరమపి విదితం భాట్టఘట్టార్ధతత్త్వమ్.
యత్తైః సౌఖ్యం తదస్యాం
త రభవ దమలాద్వైతవిద్యానుఖేస్మిన్
కూపే యోర్థ స్ప తీ ర్థే
సుపయసి వితతే హంతనాంతర్భవేత్కిమ్?

అన్వీక్షికి అంటే దండనీతి. 'రాజు ఎట్లా పరిపాలించాలి' అనే యీలాటి విషయాలను చర్చ చేసే శాస్త్రం.

'అన్వీక్షికీ ఐక్షి' శంకరులవారు ఈ శాస్త్రం చూచినంత మాత్రాన తెలిసికొన్నారు. లోకమంతా ఆయనకడకు వచ్చి అణగిందని వారికి కలిగిన దండనీతిప్రావీణ్యం దీనివల్ల అవగతం అవుతుంది.

'తంత్రే పరిచితి రతులా కాపిలే కాపి లేభ్సేఅదేరీతిగా వారికి సాంఖ్యాది శాస్త్రాలలోనూ పరిచయం చాలా ఎక్కువ. మహాభాష్యంకూడా వారికి మంచినీళ్ళ ప్రాయం.'
పీతం పాతంజలాంభః. (మహాభాష్యము పాతంజలమే యోగదర్శనమూ పాతంజలమే.)

'పర మపి విదితం భాట్ట ఘట్టార్థతత్త్వమ్స్‌మీమాంసాశాస్త్రమంతా వారి కాకళింపు.

'యత్తైస్సౌఖ్యం తద స్యాంత రభవ దమలాద్వైత విద్యాసంఖేస్మిన్' చాలా ఏండ్లు శ్రమ చేసినా లభ్యం కాని శాస్త్రజ్ఞానం శంకరులకు సులభంగా లభించింది. అమలమయిన దద్వైతం. ఇన్ని శాస్త్రాలూ తత్త్వాలూ తెలిసికోవడంవల్ల కలిగే ఆనందమే. అద్వైతతత్త్వంద్వారా ఏర్పడే ఆనందసాగరంలో మునుకలు 'కూపే యో2ర్థః సతీర్థే సుపయసి వితతే హంత నావిర్భవేత్విమ్?' - ఒక బావివల్ల కలిగే ప్రయోజనం కావేరీజలంచేత కలగ దని చెప్పగలమా? బావి నీరూ దప్పి పోగొటుతుంది. అమృతంవంటి సెలయేటి నీరూ దప్పి పోగొటుతుంది. చిన్న బావివల్ల ఏ పనులు జరుగుతవో ప్రవాహజలంవల్ల అధిక తరంగా జరుగుతై. ఆ మహానదిలో ఈ చిన్న చిన్న వస్తువుల ప్రయోజనమంతా అణగిఉంది. నదులులేని ఊళ్ళలో బావులఉపయోగంమిక్కుటం. నదులు పారే తావులలో బావులు తవ్వేవారెవ రుంటారు? ఆలాగే సమస్తవస్తువులవల్ల కలిగే ఆనందం అమలమైన అద్వైతంలో ఇమిడిఉంది. పయి నుదాహరించిన శ్లోకం చదివి
ఈయావా నర్ధ ఉదపానే తావత స్సంప్లుతోదకే,
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజాసతః.

అనే గీతాశ్లోకం చదివితే సులభంగా అర్థం తెలుస్తుంది.

సాంఖ్య యోగం కర్మానుష్ఠానం మొదలయిన వాని వల్ల కలిగే ఫలితా లన్నీ అద్వైతజ్ఞానంవల్ల కలుగుతై.
బ్రాహ్మణుడు అంటే వేదం తెలిసికొన్నవాడు. వేదానికి కూడా బ్రహ్మమని పేరు. వేదాధ్యయనం చేసిన వాణ్ణి బ్రాహ్మణు డని సాధారణంగా అన్నా ఉపనిషత్తుల రీత్యా సాక్షాద్ బ్రహ్మస్వరూపం ఎల్లెడలా చూచి అనుభవంలోకి తెచ్చుకొన్నవానికే బ్రహ్మణు డని పేరు. ఇట్టి అఖండ బ్రహ్మాకారవృత్తితో ఉండేవానికి వేదాలవల్ల ఏమి ప్రమోజనం? ఖండఖండాలుగా ఇవన్నీ ఉన్నా కడపటి ఇవన్నీ బ్రహ్మజ్ఞానంలో కలిసిపోయేవే.

ఈలాగే శరీరం వస్తుంది. పోతుంది. ఆత్మ అవినాశి. ఇది అచలం. సనాతనం. పుట్టిన వస్తువెల్లా ఏనాడో ఓనాడు గిట్టవలసినవే. అందుచేత నశ్వరాలైన భీష్మద్రోణాదుల శరీరాలనే భీష్మద్రోణాదులనుకొనివారితో యుద్ధం చేయను అని అనడం అవివేకం. అందుచేత నీవు కలతపడక నీ ధర్మం నీవు నిర్వర్తించు! అని భగవంతుడు అర్జునునకు బోధచేస్తాడు. అంబికాకటాక్షంవల్ల మూకకవికిన్నీ ఇట్టి జ్ఞానం కలిగింది.

శివ శివ పశ్యంతి సమం
శ్రీ కామాక్షీ కటాక్షితాః పురుషా,
విపినం భువనం మిత్ర మమిత్రం
లోష్ఠం చ యువతి బింబోష్ఠమ్.

ఇటులు ఆ మూగవాని నోటినుండి వచ్చింది. 'పండితా స్సర్వత్ర సమదర్శనః' సమ మంటే ఇక్కడ సమత్వంకాదు. ఏకత్వం అని అర్థం. వివిధాలయిన రూపాలలో ఏకత్వం చూడడం సమదృష్టి కలవానికే సాధ్యం.

సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరమ్.
న హిన స్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్.
- గీత. 13-28

అంతటా సమానంగాఉండే ఈశ్వరుని చూస్తున్న వ్యక్తి తన్ను తాను హింసించుకోడు. అట్టివాడే సమదృష్టి కలవాడు.

చక్కెరతో ఎన్నో రకాల బొమ్మలను తయారుచేస్తారు. అవి అనేక ఆకారాలతో ఉన్నా అన్నీ చక్కెర-తయారీవే. చక్కెరకు తీపితప్ప వేరే రుచి ఏముంది? ఆలాగే అన్ని వస్తువులలోనూ ఉన్న పరమాత్మను చూచే వానికి ఆనందం తప్ప వేరే ఏముంది?

ఈ సమ్యగ్ దర్శనం కలుగవలెనంటే అంబికా కాటాక్షం-అమ్మ అనుగ్రహం ఉండాలి. ఆమెను మన మేమీ తిరిపె మెత్తకుండా వుంటే ఆమెయే తనకు తానుగా కటాక్షిస్తుంది. జ్ఞానాగ్ని ఏమాలిన్యాన్నయినా భస్మం చేస్తుంది. ఏ వస్తువు చూచినా సరే దానిలో పరమాత్మరూపం చూచేవానికి దుంఖమూలేదు, వినాశమూలేదు. అతనిలో అన్ని తత్త్వాలూ అడగిపోతై. ఆస్థితి శ్రీకామాక్షీకటాక్షమే.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి  ........కంచిపరమాచార్యవైభవం....

కామెంట్‌లు లేవు: