14, ఆగస్టు 2020, శుక్రవారం

నాలుగు వేదములు

నాలుగు వేదములు ఋక్కు , సామ, యజుః అధర్వణ, వక చిన్న వివరణ. ఋక్కు అనగా శక్తి యెక్క మూల తత్వం అనగా బంగారం మలినంతో  ఎలా నుండునో అలాగ.దాని 
శక్తిని సామ పరంగా అనగా మనో శక్తి ఆత్మలో యున్న శక్తితో సాధన వలన యజుః తత్వం తెలియబడినది . తెలియబడిన తత్వం సాధన వలన యజుః వలన అధర్వణ అనగా లక్షణమైన పదార్థంగా మారు చున్నది. దాని ఫలము అనుభవము పంచభతాత్మకమైన శరీర ధర్మం వలననే అనుభవైక వేద్యమగును.అనగా పదార్ధాలు లక్షణము తెలియును. కాని దాని గుణము ఎలా తెలియును అది తిరిగి వస్తువుగా మారి మనం ధరించినగాని అనగా పదార్థమును స్వీకరించి జీర్ణమైన గాని దాని లక్షణము దేహములో మార్పు చెందదు. వక ఉదాహరణ. దశరధుడు యాగం వలన హవిస్సు పాయసరూపం, పాయసరూపం దేహము వలన లక్షణము, అట్టి లక్షణము వలన రామ జననం. రామ జననం అయిన తరువాతనే రామ గుణం దేహం రూపంలో తెలిసినది. సమస్త దేవతలు అట్టి రూపం గుణములను ప్రత్యక్షంగా చూసి  యుండలేదు. చూసిన తరువాత తెలిసినది. మానవ పరిపూర్ణత్వం తెలియకయే. అది ఓహో యిది అని తెలిసినది రూపంగా. దానిని మన మహర్షులు సాధన లో గ్రహించారు.కాని ప్రత్యక్షంగా చూసిన గాని తత్వం గోచరించదు. మనం కూడా అలాగే సాధన చేసి శోధించి తెలియవచ్చు.యీ పరంపరలో వక అన్నమయ్య, త్యాగయ్య పురందర , క్షేత్రయ్య రామదాసు... మెుదలగు వారిని చూసి సాధనతో తెలియవచ్చు. ఏదైనను తగుమాత్రము జీవనమునకు మాత్రమే తీసుకొని సాధనతో శోధించిన విషయం తెలియనగును. మనం కూడా యిలా చేసి చేసి ఎప్పటికో వక మంచి సు క్షేత్రమును చేరి ముక్తి పొందవచ్చు. చేస్తూ వుండటమే. అనుమాన నివృత్తి ఎవరికి వారే తప్ప యితమిధ్ధంగా యిది అని దర్శింప చేయలేరు. మానవ నైజమే అంత. యఙ్ఞం అనగా సృష్టియే. అలా అని సృష్టించిన తరువాత దాని లక్షణమునకు భ్రాంతి నొందక దూరమునుండి గమనించుటయే. శబ్ద శక్తిని దర్శించిన యిక ఏ వస్తువైననూ దానిని సర్వం ఖల్విదం బ్రహ్మ. మాయ యని దేహం వలననే తెలియుచున్నది. తెలుసుకుంటూనే ఉందాం ఆచరిస్తూనే వుందాం.
************************

కామెంట్‌లు లేవు: