14, ఆగస్టు 2020, శుక్రవారం

*పెద్దలు చెప్పిన మంచి మాటలు*

1) పూజ్యులు పెద్దలైన ఇద్దరి మధ్య నుంచి నడిచి వెళ్ళకూడదు .
2) ఒక నదిలో స్నానం చేస్తూ ఇంకో నదిని స్మరించకూడదు .
3) షష్టి , అష్టమి , చతుర్దశి తిధులయందు తైలాభ్యంగ స్నానం చేయరాదు .
4) బహిష్టు అయిన  5 వ రోజు నుంచి స్త్రీలు, దేవత శుభకార్యాలలో పాల్గొనవచ్చు .
5) దీర్ఘకాలిక వ్రతాలు చేసే స్త్రీలకు మధ్యలో వచ్చే అంటు ,ముట్టు  వలన వారు వ్రతభంగము అయింది  అని బాధపడుతుంటారు . అది వ్రతభంగము ఏమి కాదు . వారు 5 లేక 7 వ రోజు నుంచి యధావిధిగా ఆ వ్రతాన్ని కొనసాగించవచ్చు .
6)ఇల్లు కట్టుకునే ముందు ఆ స్థలాన్ని నాగలితో దున్నించి ఒక ఆవు దూడను మూడు రోజులు కట్టివేయుట వలన స్ధలసంబంధిత దోషాలు ఏమైనా ఉంటె అవి తొలగిపోతాయి .
7) మొక్క / చెట్టు మీద నుంచి  రాలిన, నలిగిన  పూవులు  శ్రీ మహావిష్ణువు పూజకు ఉపయోగించరాదు . పూజకు పూవులు లేని సమయంలో
వాటి స్థానంలో అక్షింతలు వాడుకోవచ్చు .
8) దేవతలను తృప్తి పరుచుటకన్నా పితృదేవతలను( కాలం చేసిన పెద్దలును ) తృప్తి పరచుట ముఖ్యం . అందువలన వంశాభివృద్ధి జరుగును .
9)ప్రతి రోజు మొదటి అన్నం ముద్ద తినేముందు ఓం హ్రీం గౌరీయై నమః  అని కానీ ఓం అన్నపూర్ణా దేవియై నమః అని ఒక 5 సార్లు స్మరించుకొని భోజనం ప్రారంభిస్తే ఆ భోజనం ఔషధము లాగ పని చేస్తుంది, ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా దొరుకుతుంది , మరియు పండించిన రైతుకి కూడా ఎంతో  మేలు జరుగుతుంది 
10)  శత్రునాశనం కొరకు ఎన్నో క్షుద్రపూజలు చేయటానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు . అంటువంటి వారికి ఒక చిన్న చిట్కా . ఒక చిన్న శివలింగానికిప్రతి రోజు ఆవాలు నూనెతో అభిషేకం చేస్తే (  ఎంత చిన్న శివలింగమైతే అంత మంచిది .) శత్రుబాధలనుంచి విముక్తి పొందవచ్చు. 
11) తల్లిపాదాలకు ఒక్క సారి నమస్కారం , తండ్రి పాదాలకు 2 సార్లు , గురువు పాదాలకు 3 సార్లు , భగవంతునికి 4 సార్లు , అమ్మవారికి
( శక్తి దేవతలకు) 5 సార్లు నమస్కారం చేయాలి .
12)భగవంతునికి , మగవారు అయితే  సాష్టాంగ నమస్కారం , ఆడవారు అయితే పంచమ నమస్కారం చేయుట  శ్రేష్టం .
13) స్త్రీలు మంగళసూత్రానికి తోడుగా పిన్నీసులు వంటివి పెడుతుంటారు . అది శాస్త్ర, విరుద్ధం . ఆలా చేయటం వలన భార్య, భర్తల మధ్య సరైన సఖ్యత ఉండదు .
14) భగవంతుని నైవేద్యానికి బెల్లము ముక్క ఇక పటిక బెల్లం ఉపయోగించాలి . పంచదార నివేదన చేయరాదు . ఒకవేళ పండ్లు నివేదన చేస్తే తొక్క తీసి పెట్టాలి .
15) సూర్యునికి, చంద్రునికి ఎదురుగా ఎప్పుడు కూడా మల మూత్ర విసర్జన చేయరాదు, అలాగే ఉదయాన్నే బయట సూర్యునికి ఎదురుగా
 నుంచుని  పండ్లు తోముకుంటూ ఉంటారు . ఆలా ఎప్పుడు చేయరాదు .
16) ఓం శ్రీ శా  నమో నమః -  ఈ మంత్రాన్ని  సర్వకార్యయసిద్ధి మంత్రం అంటారు . సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని శక్తీ కొలది స్మరించుకోండి . మీరు చేయబోయే కార్యము నిర్విఘ్నం గా జరుగుతుంది .
**********************

కామెంట్‌లు లేవు: