2, డిసెంబర్ 2020, బుధవారం

ఆలోచించాల్సిందే

 *ఒక్కసారి.. ఆలోచించాల్సిందే..!!* బ్రెజిల్‌, గ్రీస్, ఈజిప్టు, అర్జెంటీనా, బెల్జియం, ఈక్వెడార్, పెరూ, బొలీవియా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, ఈక్వెడార్, ఇటలీ, పరాగ్వే, స్విట్జర్‌ల్యాండ్, టర్కీ వంటి దేశాలతో పాటు భారత్ పక్కనే ఉన్న థ్యాయ్ ల్యాండ్, సింగపూర్‌లలో కూడా *నిర్బంధ ఓటు హక్కు ఉంది.* ఈ దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోనివారికి రకరకాల శిక్షలు విధిస్తుంటారు. *బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ, సింగపూర్, బెల్జియం, ఆస్ట్రియా దేశాల్లో ఓటు వేయని ప్రజలకు పెనాల్టీ విధిస్తారు.* గ్రీస్, ఈజిప్టుల్లో *ఏకంగా జైలు శిక్ష విధిస్తారు.* థాయ్ ల్యాండ్‌లో ఓటు హక్కు రద్దు చేస్తారు. *ఇటలీలో ఓటు వేయలేదని అందరికీ తెలిసేలా అధికారిక పత్రాల్లో ప్రకటిస్తారు.* *బెల్జియంలో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేకుండా చేస్తారు.* బోలీవియాలో జీతం ఇవ్వరు. ఈ విధంగా పలు దేశాల్లో వివిధ రకాల శిక్షలు ఉన్నాయి. *కానీ 120 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో మాత్రం ఓటు హక్కు సంపూర్ణ వినియోగం ఏనాడూ జరగలేదు.*

కామెంట్‌లు లేవు: