2, డిసెంబర్ 2020, బుధవారం

అరుణాచల శివా

 అరుణాచల శివా  

============================

పవిత్ర తిరువణ్ణామలై కార్తీక దీపము ఉత్సవము నాడు దివ్య అరుణ గిరి శిఖరములపైన  దీప ప్రజ్వలన గావించే ( పార్వత రాజకుల) వారి వంశ చరిత్ర  - సేకరణ 

============================

పవిత్ర తిరువణ్ణామలై కార్తీక దీపము ఉత్సవము నాడు దివ్య అరుణ గిరి శిఖరములపైన  దీప జ్వలన గావించే గొప్ప అవకాశం పార్వత రాజకులు అనబడే  వంశస్తులచే లేదా వారి కులముచేత నుండే జరుగుతోంది. ఈ పవిత్ర దీపమునకు కావలసిన 

పవిత్ర వస్త్రములు సేవలుగా పురాతనము నుండి చేయడం జరుగుతోంది.  ఈ వంశము వారు తమ యొక్క  ఈ మహా దివ్య కార్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ఈ సమస్త సృష్టికి లోక నాయకుడిగా ఉదయించిన పరమేశ్వరుని మహా దివ్య 

రూపమే అరుణ గిరి. ఆ పరమ శివుడే దివ్య జ్యోతి స్వరూపముగా కృత్తికా దీపము నాడు కనపడుచున్నారు. .  తిరువణ్ణామలై  పరమ పవిత్రమైన పర్వతము.   ఇక్కడ ఉన్న మట్టి కూడా మహేశ్వర రూపమే. ప్రతీ రాయి పరమేశ్వరుని లింగ రూపమే. 

ముప్పై కోట్ల దేవతలు పూజించిన స్వయం భువు రూపమే  అన్నమలై. సాక్షాత్తు భువి  కైలాసం గా కీర్తించబడుచున్నది.   మానవ జీవిత పరమార్ధం , మానవ జన్మ ప్రయోజనం చూడటమే. ఈ జ్యోతి దర్శనం. మనలోని అంతః జ్యోతి రూపుడు 

ఈశ్వరుని దర్శించడమే ఈ కృత్తికా దీప దర్శనం.  విశ్వ  వ్యాప్తంగా ఎంతో అఖండ ఖ్యాతిని పొందిన ఈ అరుణ గిరి పర్వతం పై మహాజ్యోతి చూడటం ఒక వరం అయితే అన్నమలైలో మహాజ్యోతి వెలిగించడం ఈ పర్వత రాజా కులము వారు ఎంత 

ధన్యులో కదా ! . తిరువణ్ణామలై  కార్తీక  పూర్ణమి నాడు  ఈ పర్వత రాజకులం వారికి ఈ మహా యోగం లభించింది.    ఈ పర్వత రాజా వంశస్తులు ఎంతో  భక్తి శ్రద్ధలతో అన్నామలై  మహాదీపం వెలిగించే కార్యాణి. నెరవేర్చేస్తున్నారు. తిరువన్నమలై  

పట్టణంలో మొత్తము వీరివి ఒంటరిగా 2 వేల కుటుంబాలు ఉన్నాయి. వారిలో ( ఐదుగురు వారసుల కుటుంబం అరుణ గిరిపై  దీపం వెలిగించే హక్కును పార్వత రాజకులం వారికి  ఎలా వచ్చింది? . అంటే   ఈ  పర్వత రాజకుల రాజవంశంలో  పర్వత 

రాజుకు జన్మించిన జగన్మాత పార్వతీ దేవి ఈ వంశస్తులు కావడమే ఆ వంశస్తులకు పొందిన మహా యోగం. జగన్మాత పార్వతీ దేవి వంశస్తులే ఈ పర్వత రాజ కులము వారు. అందుకే అట్టి పవిత్ర  పరమేశ్వరుని సాక్షాత్తు దివ్య స్వరూపమైన అరుణ 

గిరిని అధిరోహించడానికి అంతే కాకుండా అరుణ గిరిపై వెలిగించే దివ్య జ్యోతిని ప్రజ్వలించే అధికారం ఈ పార్వతీదేవి సంప్రదాయానికి చెందిన వారు మాత్రమే ఉన్నది కనుక   తిరువణ్ణామలై  కొండలపై మహా దీపం వెలిగించే పవిత్రకార్యాన్ని 

నిర్వహిస్తున్నారు. పూర్వము ఒకానొక సమయంలో బ్రహ్మ ఋషి ధ్యానాన్ని భగ్నం  చేయడానికి రాక్షసులు పాప కార్యము పాల్పడ్డారు. బ్రహ్మ ఋషికి కోపాగ్నికి భయపడి  రాక్షసులు చేపలుగా మారి  సముద్రంలో కనుమరుగవుతారు. రాక్షసులను 

నాశనం చేయమని , లోకానికి రక్షణ ఇమ్మని శివుని ,బ్రహ్మఋషి ప్రార్ధించారు . భక్త రక్షణ ఎరిగిన పరమశివుడు పర్వత రాజుని  పిలిచాడు. సముద్రంలో దాగిన రాక్షసులను చేప రూపంలో నాశనం చేయాలని ఆయన ఆదేశం. అందుకు  సాయం 

చేయడానికి విశ్వకర్మ సృష్టించిన జ్ఞాని శెంపాన్ అనే పడవను ఇచ్చాడు . సముద్రంలోకి దూకి చేపల ఆకార రాక్షసులను పట్టుకొని సంహరించి తీరంలో  పడేసిన పర్వత రాజు . మరణించిన రాక్షసులు మళ్ళీ మళ్ళీ ప్రాణం పొంది , సముద్రంలోకి దూకి 

అదృశ్యమవుతున్నారు. . ఇలా అనేక మార్లు జరిగి,  అలిసిపోయిన పర్వత రాజు , తన కుమార్తె అయిన పార్వతిదేవి సాయం కోరారు.  పార్వతి దేవి అఘోరా రూపంలో సముద్రం మధ్యలో నిలబడి రాక్షస  రూపంలో ఉన్న చేపలను మింగేసి రాక్షస 

జాతిని నాశనం చేసింది ఆ సమయంలో అనుకోకుండా రాక్షసులకు చెలరేగిన వలలో సముద్ర కింద తపస్సు చేసిన  మీనామరీషి అనే ఋషి  తన తపస్సు భంగం అయిందనే కోపంతో  " నీ వంశం నాశనం కావాలి. , చేపలు పట్టడం వల్ల జీవించాలి అని 

పర్వత రాజను శపించాడు,  శాపనికి భయపడిన పర్వత రాజు  వెళ్లి శివుని ప్రార్ధించాడు.  కరుణామయుడు శివుడు కార్తిగై శుభదినాన తిరువణ్ణామలై లో జ్యోతి రూపంలో దర్శనం ఇస్తానని , ఆ జ్యోతిని వెలిగించే పని నీ  పర్వత రాజా  వంశమే  

నెరవేర్చడం వలన ఈ శాప విముక్తి పొందుతారని అని వరం ఇచ్చి శాప విమోచన మార్గం అనుగ్రహించారు పరమ శివుడు.   ఆ ప్రకారం అప్పటి నుండి పవిత్ర కృత్తికా మాసంలో కార్తీక మహా దీపం వెలిగించే హక్కు పొందిన పర్వత రాజ కులము వారీ 

సంప్రదాయ అనుసరణగా వస్తున్న ఆనవాయితీ.  ఈ రోజు వారి కుటుంబ దేవత తిమలాయ్ అంగలమ్మన్ ఆలయ పూజ నిర్వహిస్తారు. దీపమునకు వలయు వస్త్రములను  ఊరేగింపుగా గిరి శిఖరములపై  చేరుకుంటారు. . రాత్రి 6 గంటలకు కార్తీకై దీప 

ప్రజ్వలనచేస్తారు  పర్వత రాజకుల వంశం వారు.

కామెంట్‌లు లేవు: