16, జులై 2025, బుధవారం

శ్రీమద్భాగవత కథలు*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🌹మంగళవారం 15 జూలై 2025🌹*

          ఈ రోజు నుంచి 

                   2️⃣``    

           *ప్రతిరోజూ...* 

  *మహాకవి బమ్మెర పోతనామాత్య..*

``

                  

     *శ్రీమద్భాగవత కథలు*               

```

వ్యాసమహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని పోతనామాత్యులు తెలుగులోనికి తెనిగించి, ఆ అమృత భాండాగారాన్ని అచ్చతెలుగు వారందరికీ అందించారు. 


సమగ్రంగా దేశభాషలలోకి వచ్చిన మొట్టమొదటి భాగవతం ఇదే. 

```

‘పలికెడిది భాగవతమటనే పలికిన భవహర మగునట’``` అని తన 

వినయాన్ని, భాగవతం పలకడం వల్ల కలిగే ప్రయోజనాన్ని సరళమైన భాషలో పోతన చెప్పారు.```

 

*భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలి కైన దమ్మిచూలి కైన*

*విభుదజనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపఱతు!*

```

పోతనార్యుని కవితా వైదుష్యానికి మచ్చుతునక ఈ పద్యం. ఈ చిన్న పద్యంలో ఎంతో గొప్ప భావం ఉన్నది. భాగవతం పురాణ గ్రంధమే కాక వేదాంత ధోరణి, తత్త్వము నిబిడీకృతమయిన మహా కావ్యము. దీనిలో భక్తితో పాటు వేదాంత ధోరణి అంతటా కనిపిస్తుంది. అందుకే భాగవతాన్ని అర్థం చేసుకొనుట కష్టమని పోతన విన్నవించుకున్నాడు. అదియునూ సామాన్యముగానా! శివునికి, బ్రహ్మకు కూడా సాద్యం కాదన్నాడు. మరి మహావిష్ణువు గురించి ఎందుకు చెప్పలేదు? 


ఈ కావ్యములో గాధలన్నియూ ఆయనవే కదా! అతని కధ చెప్పుకోవడం అతనికే సాద్యం. మరి పండితులకు కవులకు సామాన్యులకు కొరక బడేది కాదని సున్నితముగా చెబుతూ ఆ నారాయణుని కీర్తించాడు. భక్త శిఖామణి కృతికర్త. భక్త రక్షకుడు కృతి భర్త, కధానాయకుడు. దీనిలో ఇన్ని మర్మాలున్నాయి కనుకనే బ్రహ్మకు శివునకు మాత్రమే తప్ప నేనెంతవాడిని ‘విభుధ జనుల వలన విన్నంత కన్నంత’ అని సెలవిచ్చి తప్పించుకున్నాడు కాని వారెవరో చెప్పలేదు. 


ఆ కాలంలో విష్ణు కధలను చాలమంది పండితులు కధలు కధలుగా చెప్పుకునే సంప్రదాయముండెనేమో? ఆ వివరాలను సేకరించి, కావ్య రచనకు పూనుకున్నాడు. కాని అంతకు ముందే మూల భాగవతానికి (వ్యాసభాగవతం) వ్యాఖ్యానం వ్రాసిన శ్రీధర పండితుని మాత్రం చాలా వరకు కావలసిన చోట్ల వినియోగించుకున్న వివరాలు కావ్యమంతటా కనిపిస్తుంది. కొన్ని ఘట్టాలలో అతనిని మించి, సాహసించి, స్వతంత్రించి, ప్రయోగించిన, ఘాటుదనం కనిపిస్తుంది. ఇది ఈ భక్తకవి కవితారీతి.


```

*ఎన్నిసార్లు విన్నా.. పఠించినా.. పారాయణం* *చేసినా తనివితీరనివి భాగవత కథలు. పౌరాణికులు* *ధార్మికులు, మహాత్ములు ఈ కథలను సప్తాహంగానో, ప్రసంగాల ద్వారానో, సత్సంగాల్లోనో ప్రవచనాలందించడం సంప్రదాయం. ఈ భాగవత కథలను ఎంతో సరళంగా, ఆసక్తికరంగా, తమ కలం ద్వారా అందించారు*

 *ఆధ్యాత్మిక రచయిత శ్రీ వనం జ్వాలానరసింహారావు గారు*

``

*చదివెడిది భాగవతమిది, చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్*

*చదివినను ముక్తి కలుగును, చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై*```

 

అంటూ సాక్షాత్తూ పోతనామాత్యులు ఆవహించినట్లుగా ఎంతో భక్తితో, అనురక్తితో, మీదు మిక్కిలి శ్రద్ధతో, దీక్షగా భాగవత కథాస్రవంతిని తమ కలం ద్వారా ఈ పుస్తకాన్ని, గళం ద్వారా సామాజిక మాధ్యమాల్లో అందించి అందరినీ ముగ్ధులను, పునీతులను చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న విపత్కర సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమై స్వీయనిర్బంధంలో ఏదో వ్యాపకంతో కాలక్షేపం చేస్తుండగా, వనం జ్వాలానరసింహారావు గారు కేవలం ఆధ్యాత్మిక వ్యాపకంతో గత ఆరునెలలుగా క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. 


జ్వాలాగారు మొదట వేదభాష్య గ్రంథాలనన్నిటినీ తిరగేసి, తర్వాత భాగవత కథారచనను ఆరంభించి అంకితభావంతో ఒక పవిత్రయజ్ఞంలా పూర్తిచేశారు. గతంలో ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారు (వాసుదాసస్వామి) తెనిగించిన ‘మందరం’ రామాయణం (పూర్వ) ఆరుకాండలను ఎంతో సరళంగా వచనంతో ‘మందర మకరందం’ గ్రంథాలుగా వెలువరించగా, దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రికలో ధారావాహికగా ఇస్తూ ఆరు గ్రంథాలను రామకార్యంగా సభాక్తికంగా ప్రచురించింది. దర్శనమ్ సహా వివిధ పత్రికల్లో వారు రాసిన వ్యాసాల సంకలనం ‘ధర్మధ్వజం’ అనే గ్రంథాన్ని కూడా దర్శనమ్ వెలువరించి పాఠకలోకానికి ఉచితంగా అందించింది. ప్రస్తుతం ప్రతిఒక్కరూ చదవదగిన, ప్రతి ఇంటిలో దాచుకోదగిన

``` *శ్రీవనం జ్వాలానరసింహారావు* గారి *కలం నుంచి జాలువారిన ‘శ్రీమద్భాగవత కథలు'* పవిత్ర గ్రంథాన్ని కూడా ప్రచురించే భాగ్యం కలగటం దర్శనమ్ పరివారం భాగ్యం. ఈ అవకాశాన్ని కల్పించిన 

శ్రీ వనం జ్వాలానరసింహారావు గారికి మనఃపూర్తిగా ధన్యవాదాలు. వారి ఆధ్యాత్మిక రచనాస్రవంతి ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ పుస్తకానికి లేఔట్ సెట్టింగ్ అందించిన శ్రీనివాసరావు త్రిపురాన గారికి, అందమయిన ముఖచిత్రాన్ని అందించిన రామోజు గణేశ్ గారికి, పుస్తకాన్ని ముద్రించిన శ్రీ సాయి తిరుమల ప్రింటర్స్ అధినేత లక్ష్మి నర్సు గారికి ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు.

``

                              

             *(సశేషం)*


*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)

__________________ 

     *జ్వాలా వారి విశిష్ట* 

     *వ(ర)చనామృతం* 

                      

  *‘శ్రీమద్భాగవత కథలు'*


*మరుమాముల వెంకటరమణ శర్మ (పబ్లిషర్)

*సంపాదకులు, దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక.```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: