శు భో ద యం 🙏
చక్కని పద్యం!!
భాగవతంలో పోతనగారి పద్యాలు అనవద్యాలు హృద్యాలు!!
వైరాగ్యచింతనకు దూరమైసంపాదనయే ధ్యేయమైన నేటి సమాజమునకు ఈపద్యము చక్కని సందేశము.
“ఊహ గలంగి జీవనపు టోలమునం బడి పోరుచు న్మహా
మోహలతా నిబద్ధ పదము న్విడిపించుకొనంగ లేక సం
దేహము బొందు దేహి క్రియ దీనదశ న్గజ ముండె భీషణ
గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్ర శల్యమై.”
భయంకరమైన మొసలికిచిక్కి గెల్తునను ఊహసడలిన ఆ గజేంద్రుడు,సంసార బంధములకుచిక్కి బయటపడలేని జీవుని వలెనున్నాడట!
సంసారబంధములనుండి బయటపడుట ,వ్యామోహమును తగ్గించుకొని వేదాన్తచింతనతోకాలమును గడుపుడని మనకిది సందేశమేగదా!
వేదనలకు మందు వైరాగ్య సాధనయే!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి