25, జులై 2025, శుక్రవారం

న్యుమోనియా గురించి

 న్యుమోనియా గురించి సంపూర్ణ వివరణ - 

                

న్యుమోనియా ని ఆయుర్వేదము నందు 

" ఊపిరితిత్తుల జ్వరము " అని వ్యవహరిస్తారు. ఇది "న్యుమోకోకస్ " అనే వైరస్ జాతి క్రిముల వలన ఊపిరితిత్తులకు ఈ వ్యాధి సంక్రమించును. ఇది ఎక్కువుగా 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలలో అధికంగా వచ్చును. ఈ న్యుమోనియా 8 రకాల పేర్లతో పిలవబడుతూ వివిధ భాగాలలో వ్యాప్తిచెందును. ఇప్పుడు మీకు వాటి గురించి మీకు వివరిస్తాను. 


 * సింగల్ న్యుమోనియా - 

         

ఒకే ఊపిరితిత్తి వాపు వచ్చును. 


 * డబుల్ న్యుమోనియా - 

      

   రెండు ఊపిరితిత్తులు వాపు వచ్చును. 


 * ఎపిక్స్ న్యుమోనియా - 

      

  ఊపిరితిత్తుల అగ్రభాగములో వ్యాధి . 


 * బేసల్ న్యుమోనియా - 

       

 ఊపిరితిత్తుల అడుగు భాగములో వ్యాధి . 


 * లోబార్ న్యుమోనియా - 

        

ఊపిరితిత్తుల లోబ్ భాగము వాపు . 

 

* బ్రాంకో న్యుమోనియా - 

       

 ఊపిరితిత్తులతో సహా శ్వాసనాళములు కఫముతో నిండి వాచుట . 


 * పెరపురల్ న్యుమోనియా - 

     

  ఊపిరితిత్తుల పక్క భాగాన వాపు . 


 * సెంట్రల్ న్యుమోనియా - 

    

   ఊపిరితిత్తుల మధ్యభాగాన వాపు . 

       వ్యాధి ఏ భాగాన వచ్చింది అన్నది అనుభవం గల వైద్యుడు గుర్తించగలడు. కొన్నింటిని X - RAY సహాయముతో గుర్తించవచ్చు. ఈ న్యుమోనియా రావడానికి ప్రధాన కారణం తేమతో కూడిన శీతలగాలి తగలడమే కారణం . శీతల గాలి వలన క్రిములు ఊపిరితిత్తులలోకి ప్రవేశించి వ్యాధిని వృద్ధిపొందించగలవు. 

 

* న్యుమోనియా లక్షణములు - 

        

అకస్మాత్తుగా చలితో కూడిన జ్వరము వచ్చును. అర్ధగంట తరువాత చలి తగ్గి జ్వరం పెరుగును . జ్వరం 104 డిగ్రీల వరకు పెరిగి విపరీత తలనొప్పితో శ్వాసగమనం తీవ్రత పెరుగును . మరీ చిన్నపిల్లలలో వ్యాధి అంకురించినప్పుడు మొదట బాలపాప చిన్నెలలోని ఈడ్పుల వలే వచ్చి క్రమేపి మగతతో జ్వరం ప్రారంభం కాగలదు. 

             

. దగ్గు , కఫము , రక్తజీరతో కూడిన కళ్లే , ఊపిరి పీల్చునప్పుడు , వదులున్నప్పుడు పక్కలలో నొప్పి , ఎక్కువ ఆయాసము , పెదవులు పగిలి పొరలు ఊడుట , ముఖము ఒకవైపు గాని , రెండువైపుల గాని ఎర్రబారుట మొదలగు లక్షణాలు కనపడును. క్రమేపి శ్వాస తీవ్రత పెరిగి శ్వాసకు , నాడికి గల సంబంధం చెడిపొవును . వ్యాధి సోకిన ఊపిరితిత్తి భాగాన వాచి బరువుగా , బాధగా ఉండును. రోగి వెల్లకిలా గాని , ఏ వైపున వ్యాధి తగిలినదో ఆ భాగానికి గాని వత్తిగిలి పరుండును. 

                    

 మొదట కఫము చిక్కగా ఉండి చివరకు పలుచన అయ్యి దగ్గుతో వెలువడును. కఫము చిక్కగా ఉన్నప్పుడు రక్తజీర కనిపించును. ఈ రక్తజీర మొదటిరోజులలో ఎర్రగా ఉండి తరవాతి రోజులలో నల్లబారును. 3 రోజుల తరువాత కఫము పసుపురంగుకు మారును . ఉదయం , సాయంత్రం జ్వరం ఒకే మాదిరిగా ఉండి 9 రోజున ఒక్కసారిగా తగ్గిపోవును . కొంతమందికి 11 లేక 13 రోజులకి తగ్గగలదు. 

            

. న్యుమోనియా లక్షణాలు బయటపడిన వెంటనే రోగిని ఒక ప్రత్యేక గది యందు ఉంచి సరైన పథ్యం చేపిస్తూ ఉపిరిత్తులను బలవర్థకం చేయు ఔషధాలను ఇవ్వవలెను. అత్యంత జాగ్రత్తతో వ్యాధి బలాన్ని గమనిస్తూ చికిత్స చేయవలెను . ప్రస్తుత సమయం ఈవ్యాధి వ్యాపించుటకు అత్యంత అనుకూల సమయం కావున తగిన జాగ్రత్తతో వ్యవహరించవలెను .  


       మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక -

     


 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

కామెంట్‌లు లేవు: