30, జూన్ 2020, మంగళవారం

కలియుగంలో గురువుని నిర్ణయించుకోవడం

గురువును నిర్ణయించుకోవడం ఎలా?

గురువును మనము  నిర్ణయించుకోలేక పోవచ్చు.దానికి కారణం మనం అజ్ఞానాంధకారo లో ఉన్నాము.కాబట్టి.పూర్వ జన్మలో ఉత్తమ సద్గురువును సేవించి ఉంటే ఈ జన్మలో వారే ఎదో మిష తో మన దగ్గరకు వచ్చో,లేక వారు ఉన్న ప్రాంతంకి మనల్ని లాగో మళ్ళీ సాధనాలు పూర్తి  చేయిస్తారు.
పూర్వజన్మ లో మన గురువు లు భగవత్ సాక్షత్ కారులు,జ్ఞానులు కాక పోయింటే వాళ్ళు మనల్ని మార్చి పోయి ఉంటారు.
మరి ఎలా?అంటే దానికి గురు చరిత్ర చదువు తూ మనకు సద్గురువును చూపమని ప్రార్ధించాలి.అప్పుడు దత్తాత్రేయ స్వామియే మనకు గురువును చూపుతారు.(మహారాష్ట్ర ,కర్ణాటక లో చేస్తున్నది ఇదే)మనమే గురువుని నిర్ణయం చేస్తే మన అజ్ఞానంతో గురువులోని కొంత శక్తిని మాత్రమే గురించి సరి అయిన నిర్ణయం చేయ లేక పోవచ్చు.అందుకే ఈ రోజుల్లో  గురువుని నిర్ణయించే పని గురు చరిత్ర కు వదలాలి.
ఈ రోజుల్లో కావలసింది భోధక గురువు కాదు.అనుభవ జ్ఞానం ఉండి, మహానుభావులచే అపార శక్తి పొందిన అనుభవ జ్ఞానం ఉన్నవారు మాత్రమే తరింపజేయగలరు.

కామెంట్‌లు లేవు: