30, జూన్ 2020, మంగళవారం

మనవి కష్టాలు అంటారా


కష్టాలు కష్టాలు అని మనం తెగ బాధపడతాం.
 కాని నిజానికి మనవి కష్టాలు అంటారా?

👉ఇంద్రుడు అంతటివాడు శాపం తట్టుకోలేక వెళ్లి         తామరతూడులో దాక్కున్నాడు.
👉నహుషుడు శాపం వలన తొండగా మారిపోయాడు.
👉హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తన సంపదలు కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడు.
👉పాండవులు అడవుల పాలయ్యారు.
వేరేవాడి దగ్గర ఆవులు కాచారు, గుర్రాలను మేపారు. వంటలు వండారు. సేవ చేశారు.
👉నలుడు భార్యని కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు.
👉దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి వందల సంవత్సరాలు దాక్కున్నారు.
👉రాముడంతటి వాడె భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది.
👉శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కుంటూ నే ఉన్నాడు. 
అనేకమంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు, ఎందఱో కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటిమాటికి దాడులు చేశారు. 
చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు. 
అయన భార్యలని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. రుక్మిణికి అర్జునుడు చితి పేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయింది. 
సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి శరీరం వదిలేసింది.
👉పెళ్లైంది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి దృతరాష్ట్రుడి తో సహా అగ్నీకీలల్లో ఆహుతై పోయింది.
👉ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు.

అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు. వీటి ముందు మనకి వచ్చే చిన్ని చిన్ని కష్టాలు ఓ లేక్కంటారా? కానేకాదు.

ప్రతీది కాలం నిర్ణయిస్తుంది.. నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది.అది కష్టం అయినా సుఖం అయినా...
ఓపిక తో ఉండాలి..
ధైర్యంగా ఎదుర్కోవాలి... 
లక్ష్యాన్ని సాధించాలి...

!!సర్వే జనా సుఖినోభవంతు!!🙏🏼VSN🙏🏼

కామెంట్‌లు లేవు: