30, జూన్ 2020, మంగళవారం

*సాయిబాబా గూర్చి


వాట్సాప్ ఫార్వర్డ్
*ఈమధ్య చాలామంది హిందువులు.* *సాయిబాబా_దేవుడు కాదని చాలా వాదించుకుంటున్నారు.*
*దీనికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు (నిజాలు) చూడండి.*

ఇది చాలా చిన్న విషయం ఎవరైనా నేరుగా సమాధానం చెప్పగలిగే విషయం.కానీ మన హిందూ ధార్మిక సంస్థలు స్వామీజీలు కుండబద్దలు కొట్టినట్టు దీనికి సమాధానం చెప్పడానికి భయపడుతున్నారు.ఎవరైనా ఒకరు ధైర్యం చేసి పబ్లిక్ గా మాట్లాడినా కూడా వారికి ఎవరు సపోర్ట్ గా రావడం లేదు.
ముస్లిం మత పెద్దలు ఆయనను ముస్లిం ఫకీరుగా అంగీకరించారు. 
భారత ప్రభుత్వం కూడా ఆయనను ముస్లిం ఫకీర్ గా మాత్రమే గుర్తించింది. అందుకే సాయిబాబా దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోదు మన దేవాలయాలను ఆక్రమించుకున్నట్టు గా.ఎందుకంటే ముస్లింలు అంటే ప్రభుత్వానికి చాలా ప్రేమ.

ఈమధ్య హరే కృష్ణ వారు ఒక సాయిబాబా మందిరంలో భగవద్గీత బుక్ స్టాల్ పెట్టుకుంటామంటే దానికి సాయిబాబా మందిరంలో సాయిబాబా గురించి మాత్రమే చెప్పాలి అంటూ అనుమతి నిరాకరించారు.

 సాయి కథామృతం లో అడుగడుగునా సాయిబాబాను నిజమైన పరబ్రహ్మ స్వరూపంగా మిగతా దేవతలైన రాముడు కృష్ణుడు విఘ్నేశ్వరుడు అందరూ కూడా సాయి బాబా యొక్క చిన్న అంశాలుగా ఎలా పడితే అలా రాశారు.
  కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి శివలింగంపై సాయిబాబా కాలు పెట్టినట్టుగా విగ్రహాన్ని నిర్మించి పూజిస్తున్నారు.

అందుకే నేను కొంత చొరవ తీసుకొని పరిశోధించి నిజాలను మీ ముందుంచుతున్నాం.ఇందులో అన్ని ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాను దేనికి డొంకతిరుగుడు సమాధానం చెప్పలేదు.

సాయిబాబా దేవుడు మాత్రమే.
 హిందూ దేవుడు కాదు. వేదాలలో పురాణాలలో చెప్పబడిన దేవుడు కాదు.
సాయిబాబాకు రాముడికి కృష్ణుడికి ఎటువంటి సంబంధం లేదు.
సాయిబాబా హిందూ దేవుడు అవతారం కూడా కాదు.
సాయిబాబా హిందూ సన్యాసి కూడా కాదు.ఆయన స్వయంగా అల్లా మాలిక్ అని చెబుతూ ముస్లిం సన్యాసి డ్రెస్ వేసుకుని మసీదు దగ్గర ఉండే వాడు.
హిందూ సంస్కృత శ్లోకాలలో సాయిబాబా ప్రస్తావన ఎక్కడా లేదు. 
సాయిబాబా కి మందిరాలు నిర్మించడానికి హిందూ దేవాలయాల ఆర్కిటెక్చర్ ని కాపీ కొట్టేసారు. ఆయనను పూజించడానికి హిందూ దేవుళ్ళ అష్టోత్తరాలను సహస్ర నామాలను పూజావిధులు కాపీ కొట్టేసారు. నెమ్మదిగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా సాయిబాబా భక్తులు అని చెప్పడం స్టార్ట్ చేశారు.ఇంకాస్త ముందుకు వెళ్లి సాయిబాబానే వీళ్ళందర్నీ సృష్టించాడు అన్నారు.

అసలు సాయి బాబా అంటే ఏమిటో చూద్దాం.బాబాగారు షిరిడి గ్రామానికి వచ్చి నప్పుడు మొట్టమొదటగా అక్కడ ఉండే దేవాలయంలోని పూజారి సాయి అని ఆయనను పిలిచారు. అదే పేరుతో ఆయన ఫేమస్ అయిపోయారు. సాయిబులు అంటే ముస్లిములు అని అందరికీ తెలుసు. సాయిబు అనే పదం ఒక పర్షియన్ పదం.

సాయిబు అనేది ముస్లిములను సూచించదు. ఇస్లాం లో ఒక మతం అయినటువంటి సున్ని మతంలోని సూఫీ ఫకీర్ లను సూచిస్తుంది.

ఇస్లాం లో sufi అనే ఒక మతం ఉంది. వారు ఫకీరుగా దేశమంతా తిరుగుతూ ఉంటారు. ఆ బాకీలను సాయ అంటారు పర్షియన్ భాషలో.అంటే హిందూ సన్యాసులను స్వామీజీ  అని మనం గౌరవంగా ప్రేమగా ఎలా పిలుస్తాము, ఇరాన్లో పర్షియన్ భాషలో సాయి అని ఇస్లామిక్ ఫకీర్ లను పిలుస్తారు. పర్షియన్ భాషలో దీని అర్థాన్ని మనం గమనిస్తే పేద పెద్దాయన, తండ్రి లాంటి వాడు, పేద సన్యాసి అంటే అర్థాలు వస్తాయి. ఈ ఇస్లామిక్ ఫకీర్లు దేశమంతా తిరుగుతూ ఉండే వాళ్ళు. వాళ్లని మన వాళ్లు కూడా పర్షియన్ భాషలో లాగే సాయి అంటూ పిలిచేవాళ్ళు.అందుకే ఆ పూజారి బాబాను చూసి సాయ అని పిలిచాడు.మనవాళ్లు ఆ పదాన్ని కొంచెం ఇండియన్ భాషలకు అనుగుణంగా అచ్చుతో అంతమయ్యే లాగా సాయి అని మార్చారు.

ఆయన ఎప్పుడూ రెండు మాటలను పదేపదే చెబుతూ ఉండేవాడు. ఒకటి సబ్కా మాలిక్ ఏక్. రెండు అల్లాహ్ మాలిక్. ఆయన ఎప్పుడూ మసీదు దగ్గరే ఉండే వాడు.ఆయన వేషధారణ డ్రెస్సింగ్ అంతా చూడండి కచ్చితంగా ముస్లిం ఫకీరులా గా డ్రెస్ వేసుకుని వాడు.
ఎప్పుడు కాషాయ వస్త్రాలు రుద్రాక్ష మాలలు జపమాలలు తులసి మాలలు త్రిశూలం, డమరుకం వంటివి ఉపయోగించినట్లుగా చారిత్రక ఆధారాలు మనకు లభించడంలేదు.

ఆయన చాలా సమయాన్ని ఇతర ముస్లిం ఫకీర్ లతో గడిపినట్టుగా మనకి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.ఆయన హిందూ సన్యాసులతో కలిసి జపాలు ధ్యానాలు చేసినట్టుగా కానీ లేదా హిందూ పండగలో వచ్చి ఏదైనా వ్రతాలు పూజలు నిర్వహించినట్లు గాని మనకు ఎక్కడ చారిత్రక ఆధారాలు లేవు.

హిందూ సన్యాసులు ఎవరైనా కాషాయ వస్త్రాలు ధరించి ధ్యానాలు జపాలు తపాలు చేస్తూ ఉంటారు.తమ దగ్గరకు వచ్చిన వారికి ఏదైనా మంత్రం జపించండి లేదా ధ్యానం చేయమంటూ ఉపదేశిస్తూ ఉంటారు. కనీసం కమండలం జపమాల  దగ్గర ఉంచుకుంటారు.సాయి బాబా గారు ఎప్పుడు దానం చేసినట్టు జపం చేసినట్టు లేదా కాషాయ వస్త్రాలు ధరించి నట్టు మనకి కనిపించదు.

బాబాగారు షిరిడీకి వచ్చినప్పుడు షిరిడి పూర్తిగా హిందువుల తో కూడిన చిన్న గ్రామం.బాబాగారు ఇస్లాంకు చెందిన ఫకీరు కాబట్టి మన వాళ్ళు ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు ఆయన వెళ్లి ఒక పాడుబడిన మసీదులో ఉండేవారు.ఆయన హిందూ సన్యాసి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక దేవాలయంలోనే ఉండేవాళ్ళు. ఆయన ముస్లిం సన్యాసి కాబట్టి వెళ్లి మసీదు లోనే ఉన్నారు.

ఇక ఆయన తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి హిందూ గ్రంథాలతోపాటు ఖురాన్ తప్పకుండా చదవండి అంటూ ప్రచారం చేసేవాడు.దేవుడు లేడు అనే వాడిని ఆయన చాలా విమర్శించినట్లు మనకు ఆధారాలు లభిస్తున్నాయి.హిందూ సన్యాసులు ఎవరూ కూడా దేవుడు లేడు అనే వారిని విమర్శించడానికి వదిలేస్తారు. కేవలం ఇస్లాం లో మాత్రమే నాస్తికులను దూషిస్తారు.ఇస్లామిక్ దేశాలన్నింటిలో నాస్తికులకు మరణశిక్ష అమలు చేయబడింది.

బాబా గారు నమాజ్ చేయడాన్ని ప్రోత్సహించినట్టు గా మరియు ఆయనే స్వయంగా రోజు నమాజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఆయన బక్రీదు మరియు రంజాన్ రోజుల్లో ఖురాన్లోని Al-Fatih చదివి అందరికీ వినిపించేవారు.కానీ ఎప్పుడూ హిందూ పండుగలు రోజుల్లో వచ్చి పురాణాలు సంస్కృత శ్లోకాలు చదివి అందరికీ వినిపించినట్లుగా లేదా రోజు పురాణాలు భాగవతం వంటివి ప్రవచనాలు చెప్పినట్టుగా మనకు ఆధారాలు కనిపించడం లేదు.

ఆయన రోజు ఖురాన్ కి సంబంధించిన రెండు భజనలు వినేవాడు.mawlid,qawwali అనే ఇస్లామిక్ పాటలను వినేవాడు. Mawlid అనేది మొహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజుని కీర్తిస్తూ పాడే పాట.qawwali కూడా అల్లాహ్, మహమ్మద్ ని ఇస్లాంని కీర్తిస్తూ పాడే ఒక పాట. ఈ పాటలను ముస్లిం ఫకీర్లు తబలా తో పాడుతారు.బాబా గారు కూడా అచ్చం ఇలాగే తబలా తోనే ఈ పాటలను పాడేవారు పాడించి వినేవారు.ఇప్పటికీ ముస్లిం ఫకీర్లు అందరూ ఇదే విధంగా తబలా తో ఈ పాటలను పాడుతూ ఉంటారు.

సాయిబాబా గురించి అనేక సినిమాలు తీశారు.కానీ ఎక్కడా కూడా నేను చెప్పినటువంటి పాయింట్లను హైలెట్ చేసి చూపించలేదు. వాటిని మరుగుపరిచే సారు.ఎందుకు అంటే ఆయనను హిందూ దేవుళ్ళ లో కలిపేసే దానికి ఆయన్ని శ్రీకృష్ణుడు అవతారం గా ప్రచారం చేసే దానికి.

బాబా గారు తన దగ్గరకు వచ్చిన భక్తులకు మటన్ ను స్వయంగా వండి ప్రసాదంగా పెట్టినట్టుగా సాయి చరిత్ర లో ch 38 లో రాసారు.

అంతేకాకుండా ఆయన స్వయంగా ముస్లిం ఫకీర్ లతో కలిసి చేపలు మాంసాహారం తిన్నట్టుగా కూడా రాశారు.హిందూ సాధువులు ఎవరూ కూడా పొరపాటుగా కూడా ప్రాణం పోతున్న కూడా మాంసాహారం తినరు.

ముస్లింలు సాయిబాబాను ముస్లిం ఫకీర్ గా గుర్తించారు. ముస్లిం ఫకీర్ గా వాళ్ళు ఒప్పుకున్నారు.ముస్లింలు ఎవరూ కూడా హిందూ సాధువును పొరపాటుగా కూడా ముస్లిం ఫకీర్ గా ఒప్పుకోరు ఆ విషయాన్ని మీరు గమనించాలి.వాళ్లు హిందూ మతాన్ని హిందూ మతాన్ని ప్రచారం చేసే సాధువులను విపరీతంగా ద్వేషిస్తారు వారు ఎంతో మంది సాధువులు చంపినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి అటువంటి వారు పొరపాటు కూడా హిందువును ఫకీర్ గా ఒప్పుకోరు.

సాయిబాబా హిందూ దేవుళ్ళ అవతారమా??
మన దేవుళ్ళు అవతారాలు అన్నీ చూస్తే దుష్టులను శిక్షించడానికి సత్పురుషులు రక్షించడానికి మాత్రమే అవతరించినట్లు తెలుస్తోంది.
మరి బాబాగారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎక్కడ చేశారు?
బాబాగారి టైం లో బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పీడిస్తోంది.ఆయన అవతార మూర్తి అయిన ఏ కనీసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి మనకు స్వతంత్రమైన సంపాదించి ఉండాలి ఆయన మహిమలతో.
కనీసం ఆ శిరిడీ గ్రామంలో ఎవరైనా ప్రజలకు హాని తలపెట్టే టప్పుడు ఏదైనా crime జరిగేటప్పుడు అక్కడ ప్రత్యక్షమై దుష్టులను శిక్షించి ఉండాలి.ఆయన అలాంటివి ఏమీ చేసినట్టు మనకు కనిపించడం లేదు.

ఆయన చూపించిన  మిరాకిల్స్ అన్నీ కూడా చాలా చిన్నవి అవి కూడా ఆయన చుట్టూ ఉన్న మనుషులు ఆయనను ప్రార్థిస్తే మాత్రమే చేసినవి.ఆయన చేసిన మహిమలన్నీ కూడా శిరిడి అనే చిన్న గ్రామానికి మాత్రమే పరిమితమైనవి.

గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ప్రజలందరినీ ఇంద్రుని నుంచి రక్షించిన శ్రీ కృష్ణుడు ఎక్కడ బాబా గారు ఎక్కడ??ఆయన మిరాకిల్స్ లో చాలా గొప్పగా చెప్పబడేది వేడి వేడిగా ఉండే నీళ్లలో చేయి పెట్టి కలపడం.వేరొకరికి వచ్చిన వ్యాధులను తనకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇలాంటివన్నీ కూడా అసలు మిరాకిల్స్ అని చెప్పే దానికి సరిగ్గా సరిపోవని అనాలి.

వీటి వలన దేశానికి జాతికి ఎటువంటి ప్రయోజనం లేదు.ఇంత చిన్న miracles చేసేదానికి శ్రీకృష్ణుడు శ్రీరాముడు అవతారం ఎత్తి వచ్చాడంటే మనము నమ్మాలా?? బాబా భక్తులు మరి ఒక్క అడుగు ముందుకేసి సాయిబాబానే పరిపూర్ణ అవతారం, రాముడు కృష్ణుడు అవతారాలు సంపూర్ణం కాదు. అని ప్రచారం చేస్తున్నారు. నిజానిజాలు పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది.

సాయిబాబా గురువా? వ్యాస పౌర్ణమి కి సాయిబాబాకు సంబంధం ఏమిటి?

గురువు అంటే అజ్ఞానాన్ని అంధకారాన్ని పోగొట్టి మోక్షాన్నిచ్చే వాడు అని. అంతేగాని గుడ్డిగా నన్ను నమ్మండి నేను మీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని వాడు కాదు. అసలు బాబాగారు మోక్షం గురించి ఒక్కమాట చెప్పలేదు.
వ్యాసభగవానుడు వేదాలను విభజించారు. అష్టాదశ పురాణాలను రచించాడు. వేదాంత జ్ఞానాన్ని బ్రహ్మ సూత్రాల ద్వారా అందించారు.అందుకు కృతజ్ఞతగా ఆయనను స్మరించుకునే దానికి వ్యాసుడి పుట్టినరోజుని వ్యాసపౌర్ణమి గా సెలబ్రేట్ చేస్తారు.
అదేవిధంగా ఆ రోజు ఆదిశంకరులు మరియు ఇతరత్రా గొప్ప గురువులను కూడా పూజిస్తారు. గురు పౌర్ణమి రోజు మోక్ష మార్గాన్ని చూపించిన గురువులకు మాత్రమే వందనం చేస్తారు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై.
ముస్లిం ఫకీర్ అయినా బాబాకు సచ్చిదానంద పరమాత్మకి సంబంధం ఏమిటి?
ఖురాన్ లో బోధించిన గుడ్డి నమ్మకాన్ని ఫాలో అవమని చెప్పిన బాబా గురువులకే గురువు సద్గురు ఎలా అయ్యాడు?

సాయిబాబా అందరి కంటే గొప్ప గురువు అంటూ గురువారాన్ని ఆయనకు తగిలించారు. గురు పౌర్ణమి ని baba పౌర్ణమి గా మార్చేశారు. బాబా గారు తన శిష్యులకు ఎవరికి కూడా ఏ విధమైన ప్రవచనం చేయలేదు.
భక్తి జ్ఞాన కర్మ యోగ మార్గాలు లో ఏ మార్గాన్ని  కూడా ఆయన ఉపదేశించలేదు.
ఆయనను ఒక హిందూ సన్యాసి గా భ్రమపడుతూ ఎంతో మంది శిష్యులు తమకు ఏదైనా దీక్షను ఇవ్వాల్సిందిగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించిన ప్రార్థించారు.ఆయన ముస్లిం ఫకీర్ కదా అటువంటివేమీ ఆయన ఉపదేశించలేరు ఉపదేశించలేదు.
ఆయన  గ్రంథాలను రచించలేదు.
అసలు మనిషికి పునర్జన్మ ఉందని జన్మ పరంపర నుంచి మనిషి బయటపడాలని మోక్షాన్ని సంపాదించాలని ఆయన ఎక్కడ చూచాయిగా కూడా చెప్పలేదు.

ఆయన ఉపదేశించిన శ్రద్ధ మరియు సబూరి ఎవరి అజ్ఞానాన్ని పోగొట్ట లేదు.శ్రద్ధ మరియు సబూరి అనేవి (గుడ్డిగా నమ్మండి నమ్మకాన్ని కోల్పోవద్దు)అనేవి ఇస్లాం మరియు ఖుర్ఆన్ సంబంధించినవి.కురాన్ లో పదేపదే నమ్మకాన్ని కోల్పోవద్దు విశ్వాసం కలిగి ఉండండి అని చెప్పబడి ఉంటుంది. బాబాగారు ముస్లిం ఫకీర్ కదా అదే చెప్పారు.ఆయన పవిత్రంగా భావించింది కేవలం శుక్రవారం మాత్రమే ఎందుకంటే అది ముస్లింలు సంబంధించిన రోజు.
శుక్రవారాన్ని వదిలేసి ఈయన వ్యాసుడు కంటే గొప్ప గురువు అని అబద్ధాలు చెబుతూ గురుపౌర్ణమి ను బాబా కు తగిలించారు.

సాయిబాబా మంత్రాలు???
సయా అనేది పర్షియన్ భాషలో పదం. దానిని సంకరం చేసి సాయి అనే పదాన్ని సృష్టించారు.
మీరు అనుకున్నట్టుగా రామ,కృష్ణ అనేవి మన దేవుళ్ళ పేర్లు కాదు. అవి సంస్కృతంలోని మహత్తరమైన బీజాక్షరాలు.వాటిని స్మరిస్తే మీ కర్మఫలాలు నశించి మీకు ముక్తి వస్తుంది.

బీజాక్షరాలు కేవలం సంస్కృతంలోనే ఉంటాయి.మరి సాయి అనే ఈ సంకరజాతి పదం ఏ భాషకు చెందింది కాదు. ఈ పదాన్ని సంస్కృతంలోని బీజాక్షరాలలో కలిపి జపం చేస్తే ఏమవుతుంది??
వచ్చే సత్ఫలితాలు కూడా రాకుండా పోతాయి అది మాత్రం కచ్చితంగా చెప్పగలను.

మన వాళ్ళు అందరికంటే ముందు ఉంటారు మన మంత్రాలను గ్రంథాలను దేవాలయాలను కలుషితం చేసే దానికి దీనికి ఇదే పెద్ద ఉదాహరణ.

సాయిబాబాకు దేవాలయాలు నిర్మించి నిత్యం పూజలు చేసి హారతులు పట్టడం సబబేనా??
సాయి బాబా షిరిడీ గ్రామానికి వచ్చినప్పుడు ఒక పాడుబడిన మసీదులో ఉండేవారు. ఆయన జీవిత చివరాంకంలో వరకు కూడా మసీదులోనే గడిపారు. ఎప్పుడు దేవాలయంలో వచ్చి ఉండలేదు.
అటువంటప్పుడు హిందూ దేవాలయాన్ని నిర్మించి దానిలో ఆయన పెడితే ఆయన ఆనందపడతాడు లేదా బాధపడతాడు ఆలోచించండి.
ఆయన రోజు వినింది ఖురాన్లోని మరియు ముహమ్మద్ ప్రవక్తను ప్రశంసిస్తూ రాసిన ప్రేయర్లు.
ఆయన జీవించి వున్నప్పుడే ఎప్పుడు హిందూ గ్రంథాలను మంత్రాలను చదవలేదు వినడానికి కూడా ఇష్టపడలేదు.
మరి చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాన్ని పెట్టి రోజు మూడు నాలుగు సార్లు సంస్కృత మంత్రాలు చదివి వినిపిస్తే ఆయన ఆనందపడతాడు లేదా కోప్పడతాడు ఆలోచించండి.

సాయిబాబా యోగులకు రాజా గొప్ప యోగిపుంగవుడు??
సాయి బాబా ఎక్కడా కూడా యోగ శాస్త్రం గురించి ధ్యానం గురించి తపస్సు గురించి ఒక్క మాట చెప్పలేదు.ఇంకా హిందువుల అందర్నీ ఖురాన్ చదవమని ప్రోత్సహించాడు.
ఎప్పుడు ధ్యానముద్రలో కనిపించలేదు.
ప్రాణాయామం ఆసనాలు వంటివి చేసినట్టుగా మనకి ఎక్కడ రాయబడలేదు.
పతంజలి మహర్షి గురించి యోగ సూత్రాల గురించి ఎక్కడా వ్యాఖ్యానం చేయలేదు.
కేవలం ఖురాన్ గురించి మరియు ఇస్లాం గురించి ప్రచారం చేసిన ఒక ముస్లిం ఫకీరు అసలు యోగి కాదు.
అటువంటివాడిని యోగులకు రాజు అని దొంగ ప్రచారం చేశారు. చాలా గొప్ప యోగి అని అబద్ధాలు చెప్పారు.

ఇప్పుడు సాయిబాబా కాళ్ళకింద శివుని కృష్ణుని రాముని పెట్టి పూజిస్తున్నారు.ఇంకొన్ని రోజుల తర్వాత సాయి బాబా మాత్రమే దేవుడు మిగతా వాళ్ళని పూజిస్తే మేము చంపుతా అంటారేమో.
జీసస్ కూడా ఇలానే తయారయ్యాడు. మొదట్లో జీసస్ కూడా దేవుడే అన్నారు. ఇప్పుడు జీసస్ మాత్రమే దేవుడు మిగతా ఎవరిని పూజించిన నరకానికి పోతారు అంటున్నారు.

సాయిబాబా దేవుడంటే ఏ సమస్య లేదు.సాయిబాబా హిందూ దేవుడు. హిందూ దేవుళ్ళు అందరినీ సాయిబాబానే సృష్టించాడు అంటేనే సమస్య.సాయిబాబా శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒక్కటే అంటేనే సమస్య. శ్రీకృష్ణుడి లాగా సాయిబాబా విశ్వరూపం చూపించాడు అంటేనే సమస్య.

మరి మన స్వామీజీలు ధార్మిక సంస్థలు శాంతి పరులుగా ఉండబట్టే కదా ఇలాంటివన్నీ చేయగలుగుతున్నారు.సాయిబాబా భక్తులకు ధైర్యం ఉంటే ఒక మసీదు కట్టి అందులో సాయిబాబు అని పెట్టి పూజించండి.ఒక చర్చి కట్టి అందులో సాయిబాబా ని పెట్టి పూజించండి.అల్లా కంటే కూడా సాయిబాబా గొప్ప జీసస్ కంటే కూడా సాయిబాబా నేనే గొప్ప అని ప్రచారం చేయండి చూద్దాం.

సాయిబాబా దేవుడు అనే దానికి baba భక్తులంతా చూపించే రుజువు ఏమిటో చూద్దాం.
1.కొంతమందికి ఆయన కలలో కనిపించాడు.
2.మరికొంతమందికి ఆయన ధ్యానంలో కనిపించాడు.
3.ఇంకొంతమంది నిజంగా చూసాము అంటున్నారు.
మీరందరూ ఏవేవో పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఆయన వేలకు సహాయం చేశాడు.
4.ఆయన జీవించి ఉన్నప్పుడు ఏవేవో మిరాకిల్స్ చేసినట్టుగా మనకి ఆయన శిష్యుల ద్వారా ఆయన భక్తుల ద్వారా తెలుస్తోంది .

సాయిబాబా గట్టిగా దేవుడు అని చెప్పే దానికి ఇంతకు మించి పెద్ద ఆధారాలు మనకు లభించడంలేదు.

అసలు ఈ గందరగోళానికి అంతా కారణం దేవుడు అనే పదానికి అర్థం మనకు తెలియక పోవడమే.

దేవుడు, భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మ అంటూ అనేక పదాలు దైవత్వాన్ని సూచిస్తున్నాయి.

వీటికి గల తేడాను అర్థం చేసుకుంటే ఎవరు దేవుడు ఎవరు కాదు నీకే ఈజీగా తెలిసిపోతుంది.

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ.
ఈ పదాలను చూస్తే తల్లిదండ్రులు దేవుడు మనకి విద్య నేర్పిన గురువు కూడా దేవుడే.ఇప్పుడు చెప్పండి మీ తల్లిదండ్రులు దేవుళ్ళ లేక సాయిబాబా దేవుడు?

మనకి సహాయం చేసిన వాళ్లని కూడా మనం దేవుడిగా కీర్తిస్తాం. మరి వాళ్ళు నిజంగా దేవుడు అయిపోతారా?

అగ్ని దేవుడు వరుణ దేవుడు ఇంద్రుడు మీరందరూ దేవుళ్లు కాదా?
ఏసుప్రభు అల్లా బుద్ధుడు కూడా దేవుళ్లే. వీళ్లకు సనాతన ధర్మానికి మన వైదిక దేవుళ్లకు ఎటువంటి సంబంధం లేదు.
అలానే సాయిబాబా కూడా దేవుడే. అలానే సాయిబాబాకు మన సనాతన ధర్మానికి రాముడికి కృష్ణుడికి శివుడికి మన గ్రంధాలు ఎటువంటి సంబంధం లేదు.
సాయిబాబాను పూజిస్తే మీ సమస్యలు తొలగి పోతే పూజించండి దానికి ఎటువంటి అభ్యంతరం లేదు.కానీ ఒక్కటి మాత్రం అందరూ ఒప్పుకోవాలి రాముడికి సాయికి రాముడికి, కృష్ణుడి కి సాయికి, సాయికి శివుడికి ఎటువంటి సంబంధము లేదు.
దయచేసి సాయిబాబా భక్తులందరూ సాయిబాబా భక్తులు గానే ఉండండి ఆయన తీసుకొచ్చి మన సనాతన ధర్మంలోని దేవుడి తో లింక్ పెట్టవద్దు ఇక్కడే వచ్చిన చిక్కంతా.
మీరు సాయి బాబా ని తీసుకువెళ్లి ఏసుప్రభు కి లేదా అల్లా కి లింకు పెట్టగలరా అల్లా కాదు సాయిబాబా నిజమైన దేవుడని వారితో వాదించగల రా??

ఇక సాయిబాబా జీవితం విషయానికి వస్తే,
ఆయన తానే స్వయంగా నేను ముస్లిం అని చెప్పుకున్నాడు.
స్వయంగా తన చేతితో మటన్ బిర్యానీ ఉండి దాని ప్రసాదంగా పెట్టే వాడు.
ఆయన స్వయంగా నేను సమాధి లో నుంచి మీకు సమాధానం చెప్తాను మీకు హెల్ప్ చేస్తాను అన్నాడు.
అంతే కానీ అందరూ దేవుళ్ళు కంటే నేనే గొప్పవాణ్ణి నేనే నిజమైన దేవుని మిగతావాళ్లంతా ఫాల్స్ అని చెప్పలేదు.

సాయి కేవలం ఒక ఫకీర్ మాత్రమే అతన్ని దేవున్ని చేసి బ్రిటిష్ ఖాన్ గ్రేస్ కంమ్మీనిక్రృష్ట పార్టీలు మనల్ని సెక్యులర్ బానిసలు చేశారు అంతే కానీ అతడు ఏ విధంగా చూసినా కూడా దేవుడు కాదు. ఒకవేళ మికు భక్తి ఉంటే మిరంతా కోలుచుకోండి అంతేకాని
 #శ్రీరాముడు_శ్రీక్రిష్ణుడి_శివలింగాలను అతని కాళ్ళదగ్గర పెట్టి అవమానిస్తే మాత్రం ..ఎవడు చేతులు కట్టుకుని ఉరికే ఉండము. 
         
ఇది నాకు వాట్సాప్ ద్వారా వచ్చింది.   ఆలోచించవలసిన వాస్తవాలు ఉన్నాయనిపించి పంపడమైనది.

కామెంట్‌లు లేవు: