21, జులై 2020, మంగళవారం

*తన గర్వమే తనకు శత్రువు*



మనిషికి గర్వం రావటానికి అనేక కారణాలుంటాయి . సామాన్యంగా ఐశ్వర్యమో , పాండిత్యంతో , అధికారమో గర్వానికి కారణాలవుతాయి . 


కానీ ఈ గర్వమే తన శత్రువని మనిషి గ్రహించాలి . ఎందుకంటే దాని మూలకంగా అతనికి మున్ముందు అనర్ధం కలుగుతుంది .

అంతకంటే ఎక్కువగా గర్విష్ఠియైన మనిషి తప్పుడు పనులు చేస్తాడు . తనను ఎవరూ అడ్డుకోలేరనే భ్రమలో పడతాడు . 

తన దుష్కర్మల ఫలితాన్ని అతను తప్పకుండ అనుభవిస్తాడు . వీటన్నిటినీ తప్పించుకోవాలంటే గర్వాన్ని విడనాడాలి .

శ్రీశంకర భగవత్పాదులవారు ఇలా అన్నారు :-

*మాకురు ధనజన యౌవన గర్వమ్* !
*హరతి నిమేషాత్ కాలః సర్వం* !! 

దానం , యవ్వనం , పాండిత్యం మున్నగునవి కారణంగా ఏ మానవుడూ గర్వించరాదు . ఎందుకంటే కాలం సర్వాన్ని హరిస్తుంది . అంటే అవి శాశ్వతం కాదు .

శ్రీ శంకర భగవత్పాదులవంటి మహనీయులు ఎంతటి పండితులైనా ఏమాత్రం గర్వానికి లోనుకాలేదు , అందువలనే ప్రజలు వారిని మహాపురుషులుగా కీర్తించారు . కాబట్టి మనిషి ఏకారణంలో కూడా గర్వానికి లోనుకాకూడదు . వినయంతో జీవించాలి . 

*తస్మాదహంకార మిమం స్వశత్రుమ్ భోక్తుర్గలే కంటకవత్ ప్రతీతమ్* !
*విచ్చిధ్య విజ్ఞాన మహాసినాస్ఫుటం భుంక్ష్వాత్మసామ్రాజ్యసుఖం యధేష్టమ్* !!

అన్న భగవత్పాదుల సూక్తిని ప్రతియొక్కరూ మననం చేస్తూ నిరహంకారమైన జీవితాన్ని గడపాలి . 

--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు* .

కామెంట్‌లు లేవు: