7, సెప్టెంబర్ 2020, సోమవారం

ప్రయోగాత్మకంగా న్యాయ స్థానాల కార్యకలాపాలు

తేదీ: 07-09-2020 నుండి  11-09-2020 వరకు ప్రయోగాత్మకంగా మన కరీంనగర్ జుడిషియల్ డిస్ట్రిక్ట్ పరిధి లో గల న్యాయ స్థానాల కార్యకలాపాలు గౌరవ హైకోర్టు ఆఫ్ తెలంగాణ వారి విధి విధానాల ప్రకారం ప్రారంభం.

1) కక్షి దారులకు న్యాయస్థానాల సముదాయాల లోనికి అనుమతి లేదు.

2) ప్రతి రోజు ఒక్కొక్క కోర్టులో సివిల్ మరియు క్రిమినల్ కలిపి 20 కేసులు మాత్రమే విచారించడం జరుగుతుంది.

3) కేసు విచారణకు ఆ కేసుకు సంబంధించిన ఇరువురు న్యాయవాదులను మాత్రమే కోర్ట్ హాల్ లోనికి అనుమతించడం జరుగుతుంది.

4) ఇరుపక్షాల న్యాయవాదులు సంసిద్ధత వ్యక్తం చేసిన కేసులను మాత్రమే విచారిస్తారు.

5) ఒక వేళ ఎవరైనా న్యాయవాదులు విచారణకు సంసిద్ధత వ్యక్తం చేయని యెడల ఆ కేసులలో గౌరవ న్యాయమూర్తి గారు ఎలాంటి వ్యతిరేక ఉత్తర్వులను జారీ చేయరు.

6) సీనియర్ న్యాయవాదులు మరియు ఇంకా ఇతరత్రా కారణాల చేత ఎవరైనా న్యాయవాదులు కోర్టుకు రానివారు ఉంటే వారి వారి ఇంటి నుంచే వర్చువల్ కోర్టు ద్వారా వాదోపవాదాలు చేయవచ్చును.

 7) ప్రతి న్యాయవాది విధిగా మాస్కు ధరించి రావాలి.

8) ప్రతి కోర్టు హాలు ముందు శానిటైజర్ అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

 9) కాస్ లిస్టు ఒక రోజు ముందుగా మన గ్రూపులో పోస్ట్ చేయడం జరుగుతుంది

10) ప్రతిరోజు లోక్ అదాలత్ ద్వారా కేసుల రాజీ చేయడం జరుగుతుంది. రాజీ పడే కక్షి దారులు మన కోర్ట్ కాంటీన్ దగ్గర ఉంటే కోర్టు సిబ్బంది వీడియో కాల్ ద్వారా సంబంధిత గౌరవ న్యాయ మూర్తులతో అనుసంధానం చేస్తారు.
                                   ఇట్లు
                  *అనిగంటి వెంకటేష్ *
                        అడ్వకేట్
                       *కరీంనగర్ *
                      * 8497996662*

కామెంట్‌లు లేవు: