1, నవంబర్ 2020, ఆదివారం

హంపిదేవాలయలు

 *హంపిదేవాలయలు*


రాయల వారు రాజ్యమేలిన దేశం !! అడుగడుగునా దేవాలయాలే ,అద్బుతమైన కట్టడాలు ,అపురూపమైన శిల్పాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా ఉంటాయి .అందమైన తుంగ భద్ర నది అడుగులు వేసే ప్రదేశం !హరి హరాదులు అంటే రాయలవారికి ఎంతో బక్తి అందుకే తన రాజ్యం లో అడుగడుగునా హరి-హర క్షేత్రాలను నిర్మించాడు .


 13-15వ శతాబ్ధములో విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. విద్యారణ్య స్వామి ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి.


*హంపి-విరుపాక్ష దేవాలయం*

 


హంపి వీధి కి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయం లోనికి స్వాగతం పలుకుతుంది.దేవాలయం లో ప్రధాన దైవం విరూపాక్షుడు(శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉన్నది. విరూపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్దంకు చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయ్సళ పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజు లే నిర్మించారని అంటారు.


 ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది. ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. 


వెళ్ళు మార్గం : - కర్ణాటక లోని హోస్పేట నుండి ఇక్కడికి సులువుగా వేల్లవొచ్చు .

కామెంట్‌లు లేవు: