10, అక్టోబర్ 2023, మంగళవారం

డోలకల్

 



పూర్వం ఒకసారి పరుశురాముడికి,వినాయకుడికి మధ్య ఘోరయుద్ధం జరిగిందట.ఆ యుద్ధంలో ఎవరు గెలిచారో రహస్యం.ఎవరికీ తెలియదు. కానీ డోలకల్' అని పిలవబడే ఈ కొండ బస్తర్' జిల్లాలో 'దంతేవాడ'కు బైలదిళ్ళ'కొండవరుసలో ఉంది.ఈ కొండ దిగువున ఉన్న పల్లె పేరు 'ఫరసపాల్'' (పరశుపల్లె' అయిఉంటుంది). ఈ కొండ మీద అంటే సముద్రమట్టం నుండి 3000 అడుగుల ఎత్తున కొండమీద ఓపెన్ గా 'గణేశుని ప్రతిమ' ఉన్నది. 10 శతాబ్దంలో ఈ ప్రాంతాలను పరిపాలించిన 'నాగవంశ రాజులు ఈ వినాయకుని విగ్రహం స్థాపించినట్టు తెలుస్తుంది.ఆ వెనుక కొండలు,దట్టమయిన అడవులలో కొన్నాళ్ళు ఈ విగ్రహం కనుమరుగయింది.కేవలం స్థానిక ప్రజలకే తెలుసు.ఎనిమిదేళ్ళ క్రితం ఈ ప్రాంతం వెలుగులోనికివచ్చింది.సంవత్సరానికి ఒకసారి మూడురోజులపాటు జరిగే ఉత్సవాలకు అనేకమంది వచ్చి ఈ కొండమీద వినాయకుడిని పూజిస్తారు.

కామెంట్‌లు లేవు: