7, డిసెంబర్ 2020, సోమవారం

బీబీ నాంచారి కధ

 బీబీ నాంచారి కధ 700 సంవత్సరాల నాటిది..ప్రక్షిప్తం/ఎమోషనల్ గా రాసుకున్న కధ....

బీబీ నాంచారమ్మ మాలిక్ కాఫర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. అసలు మాలిక్ కాఫర్ స్వతహాగా హిందువు..అయితే అల్లా ఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారిన తర్వాత అతను ముస్లీంగా మారాడని చెబుతారు. తన రాజ్యాన్ని విస్తరించే భాద్యతను అల్లా ఉద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ మీద ఉంచాడు.. ( ఈ మాలిక్ కాఫర్ బై సెక్సువల్.. గుజరాత్ కు చెందిన వాడు..ఖిల్జీకి సెక్స్ బానిసగా బహుమతినివ్వబడ్డవాడు.. వీడి దండయాత్ర గురించి దోపిడీ గురించి తిరుమల రంగ మండపంలో మొన్నటి వరకూ ఒక ఇత్తడి ఫలకం ఉండేది..ఏ అధికారికో వాడి పేరు చూడడం చిరాకు అనిపించి తీసివేసినట్టున్నారు..అప్పట్లో ఆ ఫలకం తీసివేయమని పోస్టులు కూడా పెట్టాం.. )..

దీంతో మాలిక్ కాఫర్ దక్షిణ భారత దేశం మీద దండయాత్ర గావించాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని వశపరుచుకొన్నాడు. ఆనాడు శ్రీరంగంలోని రంగనాథుడి ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో ధగధగలాడిపోతూ ఉండేది..అపార ధనరాశులతో ముస్లిం దోపిడీదారులను ఊరిస్తూ ఉండేది..

ఆలయం మీద దాడిచేసి అక్కడి బంగారం, వెండి, వజ్రాలతో పాటు పంచలోహాలతో తయారుచేసిన ఉత్సవమూర్తిని కూడా మాలిక్ కాఫర్ కొల్లగొట్టి తనతో పాటు ఢిల్లీకి తీసుకువెళ్లాడు..

ఢిల్లీకి చేరుకున్న తర్వాత మాలిక్ కాఫర్ తాను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందు గొప్పగా ప్రదర్శించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సురతాని రంగనాథుడి విగ్రహం పట్ల ఆకర్షితురాలవుతుంది..

ఆ విగ్రహం తనకు ఇవ్వాల్సిందిగా కోరుతుంది. కూతురు కోరికను కాదనలేక మాలిక్ కాఫర్ ఆ విగ్రహాన్ని సురతానికి అందజేస్తాడు. ఇక ప్రతి రోజూ ఆ విగ్రహానికి అభిషేకం చేయడం, పట్టు వస్త్రాలతో అలంకరించడం ఊయల ఊపడం చేసేది..

అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవ మూర్తికి చేసే కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి చేయసాగింది. అంతేకాకుండా భక్తి పారవశ్యంలో తనను తాను ఆ రంగడికి భార్యగా భావిస్తూ వచ్చింది..

మనసావాచా కర్మణా రంగడికి తన మనస్సును అర్పించుకొని..రంగడు తప్ప తనను ఎవరూ తాకరాదనే మానసిక స్తితికి వెళ్లింది..

రంగనాథుని ఉత్సవ విగ్రహం లేని శ్రీరంగం వెలవెల పోయింది. దీంతో రంగనాథుడి భక్తులు ఆచార్యుల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి మాలిక్ కాఫర్ ను కలిసారు..

రంగనాథుడిని వెదుక్కొంటూ ఢిల్లీ వచ్చిన ఆ అర్చకులను చూసిన మాలిక్ కాఫర్ మనసు కరిగి పోయింది. దీంతో సంతోషంగా ఆ పంచలోహ విగ్రహాన్ని తిరిగి వారికి ఇవ్వడానికి అంగీకరించాడు..

అయితే అప్పటికే రంగనాథుడి మీద మనసుపడిన సురతాని గురించి విన్న అర్చకులు ఆమె ఆదమరిచి నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని తీసుకుని శ్రీరంగం బయలుదేరారు..

ఉదయం లేచిన సురతానికి రంగనాథుడి పంచలోహ విగ్రహం కనబడలేదు. దీంతో ఆ విగ్రహాన్ని వెదుక్కొంటూ ఆమె శ్రీరంగం చేరుకొంది. ఈ క్రమంలో తన తండ్రిమాటను కూడా లెక్కచేయలేదు..

శ్రీరంగం చేరుకొని అక్కడే స్వామివారిని సేవిస్తూ జీవిత చరమాంకంలో ఆయనలో ఐక్యమయ్యిందని చెబుతారు. ఇప్పటికీ శ్రీరంగంలో వారి నిలువెత్తు రూపాన్ని మనం చూడవచ్చు.

మరికొందరు ఆ విగ్రహం శ్రీరంగం లోని రంగనాథుడిది కాదని కర్నాటకలోని మేల్కోటే లో ఉన్న తిరునారాయణునిది అని చెబుతారు..దానికి సాక్ష్యంగా ఇక్కడి ఆలయంలో కూడా బీబీ నాంచారమ్మ విగ్రహం కనిపిస్తుంది. మరికొందరు భూదేవి అవతారమే బీబీ నాంచారమ్మ అని నమ్ముతారు..

కలియుగంలో వేంకటేశ్వరుడిని తోడుగా నిలుచేందుకు ఆమె సురతాని రూపంలో జన్మించిందని చెబుతారు. ఆమె తిరుపతిని చేరుకొని అటు పై భగవంతునిలో లీనమైపోయిందని నమ్ముతారు..

అందువల్లే తిరుపతిలో మనం ఇప్పటికీ బీబీనాంచారమ్మ విగ్రహాన్ని చూడవచ్చు. ఏది ఏమైనా ఆమె ఒక ముస్లీం స్త్రీ అన్న విషయంలో మాత్రం ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదు అలాగే మాలిక్ కాఫర్ కూతురు అనేది కూడా వివాదం లేనిదే..

అందుకే తమిళంలో బీబీనాంచారమ్మను తుళుక్క నాచియార్ అని అంటారు. అంటే తురుష్క భక్తురాలు అని అర్థం. బీబీ నాంచారమ్మను చాలా మంది ముస్లీంలు సైతం వేంకటేశ్వరుడి సతిగా భావిస్తారు..

కడపలో కూడా ఏటా ఒకరోజు ముస్లిం సోదరీమణులు వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది..

బీబీ నాంచారి గారు ఒక భక్తి పారవశ్యాలతో తనను తాను అర్పించుకున్న మహభక్తురాలు..దాంట్లో సందేహం లేదు వారికి పాదాభివందనం..

దీన్ని ఇంతవరకే చూడాలి..నిజంగా రంగడు లేదా వెంకన్న భౌతికంగా వివాహం చేసుకోలేదు అన్న విషయాన్ని గమనించాలి..

వారిని ఉదాహరణగా చూపుతూ అందరికీ ఇదే గాటన కట్టివేయలేము..నిజంగా భక్తి ఉంటే ఎవరూ ఆపలేరు..గురువాయూర్ కృష్ణుడు కావాలనుకుంటే జేసుదాసు గారినే రప్పించుకున్నారు 50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అన్నీ పరీక్షలు పూర్తి అయిన తర్వాత మాత్రమే అదీ దేవదేవుడి లీల.. ..

సాక్షాత్తు వెంకన్న అష్టదళ పాదపద్మారాదనకు కావలసిన సువర్ణ పుష్పాలు గుంటూరు కు చెందిన ఒక ముస్లిం భక్తుడు ఇచ్చారు..

నిజమైన భక్తి భావంతో ఎవరైనా రావొచ్చు..దానికోసం సంతకమే కాదు వారు పొర్లుదండాలు పెట్టడానికి సైతం సిద్దంగా ఉంటారు..

నియమాలు పెట్టినప్పుడు తప్పనిసరిగా పాటించాలి..తప్పదు..దీంట్లో పెద్దా చిన్నా లేదు..అగౌరవం లేదూ..కించపరచడమూ లేదు..

అడ్డంపడుతున్నదల్లా అహంకారమే..స్వస్తి..

( నెట్ లో వివిధ సోర్స్ ల ఆధారంగా..చిన్నప్పుడు చదివిన కధలు ఆధారంగా )..

కామెంట్‌లు లేవు: