7, డిసెంబర్ 2020, సోమవారం

తృప్తి.:-

 జధురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వామి వారి సందేశము.

 

     తృప్తి.:-   

ఎంతటి ఆస్తిపాస్తు లైనా తృప్తి లేకపోతే ఆ సంపద ఆ మనిషికి ఆనందాన్ని అందించలేవు.

సుఖ సంపదలను కోరుకొనే వ్యక్తి వాటిని పొందటానికి కస్తపడి పని చేయవలసి వస్తుంది .అందువలన అప్పుడు సంతోషము వుండదు.కారణము కస్తము లో సంతోషము లభించదు కదా . వొకవేల ఆ వస్తువును కష్టపడి. సంపాదించినా దానిని 

కాపాడటానికి మరలా కష్టపడాలి . అప్పుడు సంతోషము వుండదు.

ఏ కారణము వలనైనా అలా కష్టపడి సంపాదించినా వస్తువు

పోగొట్టుకుంటే అప్పటి దాకా వున్న సంతోషము పూర్తిగా పోయి మళ్ళ దుఃఖమే మిగులుతుంది .

అందువలన ఉన్నవాటిని వదిలి మరలా ఏదో సంపాదించాలని కోరిక కల్గి వుండటము అనేది మంచిది కాదు. పూర్వ కాలము లో వనాలలో నివసించే మునులకు 

ఆస్తి పాస్తులు ఏమి వుండేవి కావు.అయినా వారు ఆనందముగా లేరా. వారి ఆనందము నకు కారణము వారికున్న తృప్తి యే .

మనము పూజించే శంకరుడు రారీరమంటా విభూతిని పూసుకొని పులి చర్మాన్ని ధరించి వృషభ వాహనుడై వుంటాడు. అంటే మనలోనియింద్రియ సుఖాల నుండి దారి మల్లించటానికే సాంకేతికం గా యిలా చెప్పబడి నది .

మనమెంత ధనవంతులైన సాధారణ జీవితాన్ని గడపాలి .అప్పుడే ఆనందము గా వుండగలము .

ధనము అనుకోకుండా లభిస్తే మంచిపనులు చేయటానికి ధార్మిక కార్యక్రమాలు ను ఆచరించ టాని కే ధనాన్ని ఉపయోగించాలి .మన జీవితాలను సామాన్యం గా

గడపాలి.

యీ ప్రపంచము లో ధనవంతులు ఎవ్వరు పేద వారెవ్వరూ అని ప్రశ్నించుకుంటే ఎవ్వరి హృదయము సంతృప్తి తో నిండి వుందో ఎవ్వరికీ ఏటువంటి కోరికలు లేవో వారే ధనవంతులు.అని ఎవ్వరికీ యీ పైన చెప్పిన కోరికలు వుంటా యో వారే పే దవారని

మనము సమాధానము చెప్పాలి.

అందువలన సంతృప్తి అనే ఆదర్శాన్ని మనము ఆచరిస్తూ ఆనందమయ జీవనాన్నిగడపటానికి ప్రయత్నించాలి .

ఓం శాంతి శాంతి శాంతిః.

ఓం నమశ్శివాయ.

కామెంట్‌లు లేవు: