5, జులై 2023, బుధవారం

కర్మ భూమి" చర్చ

 ఈ రోజు ఓ గౄపులో "కర్మ భూమి" పై జరిగిన ఓ చర్చ:-


[7/5, 12:14 PM] +91 80963 54159: ఈ విషయంలో ఏఏ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? ఒకవేళ లోకంలో ఇదొక ప్రచారం మాత్రమేనా? లేదా ఏదన్న శాస్త్రం స్పష్టంగా ఈ విషయాన్ని చెబుతోందా అన్నది పరిశోధించటం  చాలా అవసరం.  ఒకవేళ చెబితే ఆ శాస్త్రమే అక్కడికక్కడే పరిష్కారాన్ని సూచిస్తుంది కదా. కాబట్టి  మీరు చెప్పినది ఏ గ్రంధంలోనో /శాస్త్రంలోనో లేదా మరో రూపంలో ఎక్కడ ఉందో తెలియజేయ ప్రార్ధన.   🙏 🙏                                                                                                                                          వాల్మీకి విరచిత యోగావాసిస్టం లో  అద్భుతమైన విషయాలు వున్నాయి. ఒక గ్రహం నుండి ఇంకోగ్రహానికి ప్రయాణం,  ఒక బ్రహ్మాండం నుండి మరో బ్రహ్మాండంకి ప్రయాణం, అలాంటి సమయంలో ఎలాంటి కర్మలు చేయాలి? వాటి ఫలితం ఏమవుతుంది? టైం ట్రావెల్ లో వొచ్చే ధార్మిక సమస్యలకు ఎలాంటి పరిహారం చేయాలి..... ఇలాంటి అద్భుతమైన విషయాలని సాక్షాత్తు సరస్వతిదేవి లీల అనే  భక్తురాలికి ఒక బ్రహ్మాండం నుండి మరో బ్రహ్మాండంకి ప్రయాణం చేయిస్తూ వివరంగా చెబుతుంది. ఆ సమయంలో మొదటి సారి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ దేవుడు సంధ్యావందనం చేసి ప్రారంభించాడని మాత చెబుతుంది. ఏ సృష్టి లేనపుడు సంధ్యావందనం ఎవరికో? అది కూడా చెబుతుంది మాట.  ఒక బ్రహ్మాండం నుండి మరో బ్రహ్మాండంకి ప్రయాణం చేసినపుడు ఎలాంటి వైదిక కర్మలు చేయాలో వాటి స్టితి,ఫలితం ఏమవుతాయో చెప్పినపుడు. సముద్రం దాటితే పరిహారం ఉండదా? 🙏🙏

[7/5, 12:51 PM] శర్మద: ఆర్యా! 

మీ ప్రశ్నలు బాగున్నాయి. 


నాకు తెలిసిన విషయం చెప్పటానికి ప్రయత్నిస్తాను. 


భూమిపైన మన భారతదేశం ఒక్కటే కర్మభూమిగా గుర్తించబడినది. మిగతా ఏ ప్రాంతములోనూ లేదా దేశాలలోనూ మన శాస్త్రాలు చెప్పిన కర్మాచరణ లేదు. అంతా అనాచారము. అసంస్కృతీప్రవర్తనలు. (మనదేశంలో ఇవి లేవని కాదు. ఇప్పుడు ఈ దుష్టసంస్కృతి ఏర్పడినది.) మన యొక్క ఏ మతగ్రంథాన్ని పరిశీలించినా.... భగవంతుని అవతారాలనుండి దేవతల తపస్సులు సహితము మన హైందవభూమియందే జరిగినట్లు మనకు తెలుస్తుంది. 


భగవద్గీత లో కూడా భగవంతుడు భరతవర్షమే కర్మభూమి అని, దేవతలు సహితము భరతవర్షంలో జన్మించాలని కోరుకుంటారని చెప్పటం జరిగింది. ఇలా ఎందుకంటే.... భూలోకంలో తప్ప మరేలోకంలోనూ కర్మాధికారం లేదు. చివరకు తపస్సు చేయాలన్నా కర్మ అవసరమే. అందువలన అలా కోరుకుంటారని భగవంతుని మాట. 


కర్మభూమియైన భరతవర్షంలో చేసిన కర్మ ఫలవంతమౌతుంది. ఇతరచోట్ల చేసిన కర్మ నిష్ఫలమౌతుంది. అందువలన కర్మాచరణకు మన కర్మభూమి దాటి పోరాదని శాస్త్రనియమం. ఎంతటి బ్రాహ్మణుడైనా వరుసగా మూడురోజులు పాటు సంధ్యావందనము చేయనిచో అతనికి మరలా శుభముహూర్తంలో ఉపనయనం చేయమని శాస్త్రం చెబుతోంది. అందువలన సముద్రాన్ని దాటి వేరే దేశాలకు వెడితే...  కర్మభూమి కానటువంటి ఆ దేశంలో చేసిన కర్మలు (సంధ్యావందనము సైతం కర్మయే) నిష్ఫలమౌతాయి. అందువలన మరలా ఆ వ్యక్తి ఉపనయనంచేత సంస్కరించబడాలి. అందుకే...  కంచి పరమాచార్య అనేక సందర్భాలలో సంధ్యావందనం చేయటం ముఖ్యమని, ఇతరదేశాలకు నీవు వెళ్ళటం అవసరమా? అని భక్తులకు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. 


ఈ కారణాలవలన సముద్రం దాటటం వద్దని చెప్పటం జరిగింది.

[7/5, 1:38 PM] +91 80963 54159: లోక వ్యవహార దృష్టి కోణంలో ...సముద్రం దాటి ఇతరదేశాలకు వెళ్ళటం వల్ల  "Brain drain" కి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. విద్వాంసులు మనకు తక్కువై మనసమాజంలో అజ్ఞానం పెరుగుతుంది అని మహాత్ములు ఎప్పుడో  దర్శించి చెప్పివుండవచ్చు.  అది మన మంచికే.  ఇప్పుడు అదే చూస్తున్నాం అనుభవిస్తున్నాం కూడా.  కానీ.. మనం రోజూ చేసే సంధ్యా వందనంలో ఆచమనం (శ్రౌతాచామానం) లోనే 6 లోకాల (భూ, భువ, సువ, మహా, జన, తపో, సత్య) ప్రస్తావన ఉంది. అసలు సంధ్యావందనలో ఎన్నిసార్లు ఆచమనం చెయ్యల్సివోచ్చినా శ్రౌతాచామానం మాత్రమే చేయాలి, పురాణాచమనం(కేశవాది నామాల) అప్రస్త్తుతం అని ప్రాచీన వేదపండితులు సూచిస్తున్నారు అని తన తాతగారు చెప్పగా తానూ విని ఆచరిన్స్తున్నాను అని మా తాతగారు నాకు  చెప్పగా యధాశక్తి నేను తిరుమల వెంకటేశ్వరుడి దయవల్ల ఆచరించగలుగుతున్న. ఇక్కడ అంశం ఏమంటే.. భూ లోకం అనగా ఈ మొత్తం భూగోళం తో పాటు  షడ్వికారాలకు లోనయ్యే జీవానికి, జీవ ప్రక్రియకు అవకాశం ఉన్న ప్రతి ప్రదేశాన్ని (మొత్తం సృష్టిలో..అనేకం వున్నాయి ) భూలోకంగానే భావిస్తున్నాను అని ఆచమన మంత్రానికి అర్ధం అని పెద్దలు చెప్పగా విన్నాను. కాబట్టి  అఖండమైన అనంతం శాశ్వతమైన వేదమే లక్ష్యంగా ఆచరించే వైదిక కర్మ అయిన సంధ్యవందనలో అనేక భూలోకాలనన్నిటినీ కలిపి ఒకే భూలోకంగా భావించి కర్మ చేస్తున్నపుడు.. మొత్తం భూలోకం కర్మభూమి వేదభూమి అయినట్లే. కాబట్టి వైదిక కర్మలు మనముంటున్న భూమి మీద ఎక్కడ ఆచరించినా ఫలితం రాకమానదు. సంధ్యావందనమే నిలువెత్తు సాక్ష్యం. 🙏🙏

[7/5, 2:01 PM] +91 79957 06813: భారతదేశము అంటేనే కర్మభూమి అనియు  కర్మాచరణమందు ఎక్కువ ఆదరణ గల భూమి అనియు ఆర్యావర్తము అని కూడా ఈ నిఘంటువులో ఇచ్చారు. ఇప్పుడే నిఘంటువును పరిశీలించి పలికిన వ్యాఖ్యలివి. 


మతపరమైన కర్మలు (కర్మకాండ) జరిగే భూమి, భారతవర్షము అని ఆప్టే నిఘంటువు.  


విష్ణుపురాణంలో వున్న  ఈ శ్లోకాన్ని ఓసారి గమనించగలరు. 


ఉత్తరేణ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం |

వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః ||

నవయోజనసాహస్రో విస్తరోSస్య మహామునే |

కర్మభూమిరియం స్వర్గమపవర్గంచ గచ్ఛతాం ||

(అపవర్గమంటే మోక్షం) 


ఈ శ్లోకానికి అర్థం ఇదిగో.


సముద్రమునకుత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షము గలదు. అందలిసంతతి ''భారతి'' యనబడును. ఇతి తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమి యని దీనికిపేరు. స్వర్గాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. 


ఇదే శ్లోకం కొలది మార్పులతో బ్రహ్మ పురాణం, పందొమ్మిదవ అధ్యాయం, జంబూద్వీప వర్ణనంలో ఇలా కనిపిస్తోంది.


రోమహర్షణ ఉవాచ -


ఉత్తరేణ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం |

వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః ||

నవయోజనసాహస్రో విస్తారశ్చ ద్విజోత్తమాః!|

కర్మభూమిరియం స్వర్గ మపవర్గం గంతు మిచ్ఛతామ్‌ ||


సూతుడిట్లనియె-


సముద్రమునకుత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షము గలదు. అందలిసంతతి ''భారతి'' యనబడును. ఇతి తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమియని దీనికిపేరు. కోరినవారికి స్వర్గము మోక్షమును గూడ నిందే యున్నవి.


ఉదాహరణకు అగ్ని మహాపురాణం, జంబూ ద్వీప వర్ణనంలో ఇలా వుందట Agni Maha Purana (Telugu) Chapter 118


శివమహాపురాణంలో ఇలా వుందని విన్నాను. 


నవయోజనసాహస్రో విస్తరోSస్య మహామునే |

స్వర్గాపవర్గయో:కర్మభూమిరేషా స్మృతా బుధై:||


స్వర్గమోక్షాలనిచ్చే కర్మభూమి అని పండితులచే చెప్పబడినది


మొత్తానికి మనదేశానికి కర్మభూమి అనే పేరు పురాణాల్లో వుంది అని చెప్పవచ్చు. అంటే కర్మ భూమి అంటే మన దేశం తప్పించి యావత్ ప్రపంచానికి వర్తించదేమోనని నా నమ్మకం.

[7/5, 2:11 PM] +91 79957 06813: కాని భగవద్గీత 15 వ అధ్యాయం, 2 వ శ్లోకం లో *కర్మాణుబంధీని మనుష్యలోకే* అని చెప్పబడింది. 


అంటే మనుష్యులు నివసించే లోకమంతా కర్మ చేత బంధించబడినది అని చెప్పబడింది. భారత దేశం కూడా ఈ లోకంలో భాగమే కాబట్టి, ఈ విషయం భగవద్గీతలో చెప్పబడిందని అనవచ్చు. 


ఈ లోకంలో కర్మలచేతే (పనులు చేయడం వలనే) ఫలితాలు వస్తాయని చెప్తోంది (దేవలోకంలో సంకల్పమాత్రం వలన ఫలితాలు రావచ్చు).


అంటే ఈ లెక్కన మనకు తేలిందేమిటంటే పురాణాలు శాస్త్రాలు కూడా కర్మభూమి అంటే ఇదమిత్థంగా తెలియబరచని పరిస్థితి. 


ఇంకనూ ప్రయత్నిస్తేగాని వీటన్నిటిని అర్థం చేసుకోలేమేమో

[7/5, 2:48 PM] శర్మద: సరే అయితే...


ముందు మీరు సముద్రాన్ని దాటండి. 😅😅


నాకొక సందేహం వచ్చింది. దీనిని కూడా ఆలోచించండి. 


సీతమ్మను తీసుకొని రావటానికి వెళ్ళినవారంతా సముద్రాన్ని దాటారు కదా? 


అంతకుముందు రావణుడు లంకనుండి ఎన్నోసార్లు సముద్రాన్ని దాటి వచ్చాడు కదా? 


ఇక్కడ వారు ఫరిహారాలు చేసుకున్పారా?

[7/5, 2:55 PM] +91 92411 45762: రావణాసురిడిది కూడా అసలు లక్నో దగ్గర ప్రాంతమేనని ఒక వాదన.

[7/5, 2:57 PM] శర్మద: ఇది బాగున్నది. 


అసలు రావణుడు పులస్త్యబ్రహ్మకు మనుమడు. బ్రహ్మ దేవలోకానికి చెందినవాడు. కనుక రావణుడు అసలు భూలోకానికి చెందినవాడు కానేకాదు. 

😂😂😂😂😂

[7/5, 2:58 PM] +91 80963 54159: సముద్రాన్ని ఎవ్వరైనా దాటవచ్చు. వారి వారి వర్ణ/వేద/శాఖ ధర్మాలను అనుసరించి, దేశ,కాల,మాన, పరిస్త్తితులకు తగ్గట్లు మూల ధర్మం మారకుండాప్రాయచ్చిత్త సహితంగా యధాశక్తి వేదం నిర్దేశించిన కర్మలు చేయవచ్చు. సంధ్యావందనం, సత్రయాగం, వరలక్ష్మి వ్రతం...ఇలా అన్నీ హైదరాబాద్ లో చేసినా, బ్రెజిల్ లో అమెజాన్ చిట్టడవికి వెళ్ళి చేసినా శ్రద్ద,భక్తిని అనుసరించి ఫలితం రాకమానదు. 🙏

[7/5, 3:00 PM] శర్మద: భరతఖండంలో ఎక్కడ చేసినా ఫలితం ఓకే. 


భరతఖండం దాటి చేసేటువంటి కర్మలవిషయంలోనే పెద్దల (శాస్త్ర) అభ్యంతరం.

[7/5, 3:02 PM] శర్మద: దేశాంతరంలోనైనా, దేశంలోనైనా మూడురోజులపాటు నిత్యకర్మలను ఆచరించకపోతే అతడు కర్మభ్రష్టుడు అని, తిరిగి ఉపనయనం చేసుకోవాలనీ శాస్త్రం చెబుతోంది.

[7/5, 3:02 PM] +91 79957 06813: నేనూ ఈ నిబంధనతో ఏకీభవిస్తున్నాను

[7/5, 3:04 PM] +91 79957 06813: కంచి పరమాచార్య వారు ఎన్నో సార్లు ఈ వివరణ ఇవ్వడం నేనే చదివాను.

[7/5, 3:04 PM] +91 80963 54159: Brain Drain ని ముందే ఊహించి కట్టడిచేసే ప్రయత్నం అనుకోవచ్చు. వేద నిషేధం చేయకుండా పరిహారాలు చెప్పిందేమో....నాకు అంత బుద్ధి బలం లేదు. వేదవిద్వంసులు చెప్పగలరు. 🙏

[7/5, 3:07 PM] +91 80963 54159: ..దానిదేముంది శాస్త్రం చెప్పిన పరిహారం. కర్మపై కర్తపై నిషేధం లేదుకదా. పూజ ప్రారంభించాం..దీపం కొండెక్కింది. ఆపేయం కదా. ఓ పరిహార మంత్రమో/శ్లోకమో/నామమో చెప్పి మళ్ళీ వెలిగించి. కర్మ చేస్తాం. 🙏

[7/5, 3:09 PM] శర్మద: మీరు చెప్పినటువంటి ఎన్నో సైన్సు కారణాలు మన ఆచారాలవెనుక ఉన్నాయనేది సత్యం. 


మన పూర్వీకులకు ఈ రహస్యాలన్నీ తెలుసు. కారణాలను చెబితే.... *ఓస్... ఇంతేగా...* అనే నిర్లక్షం కలిగి సమాజం పాటించదనే శంకతో ఆ విజ్ఞానానికి భక్తిని రంగరించి బోధించారు మన పెద్దలు. 


అందవలననే ఏ సంప్రదాయం ఎందుకు అనేది అర్థంకాక ఇప్పుడు మనం జుట్టుపీక్కుంటున్నాము.


దీనిపై మన ఆత్మీయులు తమ తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.

కామెంట్‌లు లేవు: