*#శంకర విజయాలు-11*
ఆది శంకరాచార్యుల జయంతి - 2 May , 2025
*శంకరులు లేక పోతే - ఈ రోజు మనకు సనాతన ధర్మం లేదు*
1) ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని
2) శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు
3) ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు.
4) అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటారు.
5) అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు.
6) అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతారు.
7) ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు - శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు
8) అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు - మొత్తం మనీషా పంచకంగా పేరొందాయి.
9) అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని
10) శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది.
సాక్ష్యాత్తు కైలాస శంకరుడు - కాలడి శంకరులుగా ఈ భూమి మీదకు అవతరించారు
*హర హర శంకర !! జయ జయ శంకర !!*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి