15, ఏప్రిల్ 2025, మంగళవారం

దాశరధీ శతకం

 🙏దాశరధీ శతకం లోనిపద్యరాజము 🙏

భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో

దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్

రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా

డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే

దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

ఈ పద్యం రామదాసు గా ప్రసిధ్ధి చెందియన కంచెర్ల గొపన్న రాసిన దాశరధీ శతకం లోనిది.


అర్ధం:- యుద్ధం చెయ్యడం లో ప్రసిద్ధి గాంచిన వాడు, భక్తజన భాందవుడు, కోదండం తొ ఉజ్వల భాణతూణీరాలు వేయ గల భుజ బలసంపదగల రాముడి ని మించిన వేరే దేవుడు లేడని ఢం ఢఢం ఢం ఢం ఆని ఢంకా భజాయించి భుమండలమంతా వినబడేలా మదించిన ఏనుగు మీదకెక్కి చాటుతాను అని అర్ధం.

ఈ పద్యం ఉత్పలమాల అయినప్పటికీ 5 పాదాలుండటం వలన ఉత్పలమాలిక అయింది. దాశరధీ శతకం లో ఇలాంటి ఐదేసి పాదాలు పద్యాలు ఇంకా 5 ఉన్నాయి. ఈ పద్యం లో రాముడి లాంటి రెండొ దెవుడు లేడు అంటే అంటే శివుడో, వినాయకుడొకాదు. అది తెలుసుకోవాలంటే ఆనాటి సామాజిక రాజకీయ పరిస్తితులు తెలుసుకోవాలి.


మహామ్మదీయులు భారతదేశం లొ ప్రవేశించి వేల దేవాలయాలు నాశనం చేసారు. విగ్రహాలను ధ్వంస్వం చేసి అపవిత్రం చేసి పనికి రాకుండా చేసారు. చివరకి శ్రీరంగం లోని విగ్రహాన్ని కాపాడుకోవడం కోసం తిరుపతికి తీసుకొని వెళ్ళారు. 7000 వేల ఏళ్ళ చరిత్ర గల శ్రీకూర్మం కోవెలను కాపాడడం కొసం దాని మీద మట్టి దిబ్బలుపోసి 200 ఏళ్ళు ఉంచేశారు. ఇవి కొన్ని మాత్రమే, పూర్తిగా ధ్వంస్వం అయిపొయిన ఆలయాలు మరెన్నో.


సనాతన ధర్మానికి మూలాలు దెవాలయాలు. మన సనాతన ధర్మం వేల ఏళ్ళగా నిత్యనూతనం గా నిలబడటాని కారణం, వేదాలు వెద విద్య నశించకుండా ఉండటానికి కారణం దేవాలయాలు. అటువంటి దేవాలయల మీద మన సంస్కృతి మీద దాడిజరిగింది. దక్షిణాదిన శ్రీకృష్ణ దేవరాయలు తరువాత పెద్ద ఆలయాలు కట్టించె రాజులు కరువైనారు. ఉన్నవాళ్ళు వారి రాజ్యం కాపాడుకొవడం కోసం మహమ్మదీయులకి వశమై పోవడమో లేక వారి చేతులో ఓడిపొవడమో జరిగేది. హిందువులమీద జరగరాని అక్రుత్యాలన్ని జరిగేవి. బెదిరించి, బలవంతంగా మతమార్పుడులు బహిరంగంగా జరిగేవి.


మరోపక్క ఈస్టిండియా కంపెని కాలూనుతున్న రొజులు. సామ దాన ఉపాయలతొ కిరస్తాన మత మార్పిళ్ళు జరుగుతుండేవి.


ఆటువంటి కాలం లో మన సనాతన ధర్మన్ని నిలబెట్టడానికి నైజాం కాలం లొ గొపన్న కట్టించిన ఆలయం భద్రాచల రామాలయం. దీనికిగాను ఆయనకి కారాగార శిక్ష వేసారు. చివరకు రాముడే దిగివచ్చి అయనను విడిపించాడు. ఆయన రాసిన కీర్తనలు అమృత తుల్యాలు. తరతరాలుగా పాడుతునే ఉన్నారు.


సాహితీ రాజ్యానికి రాజు, సంగీత రాజ్యానికి రారాజు, భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తి, విపత్క పరిస్తితులలొ సనాతన భారతీయ ధర్మాని నిలబెట్టిన మరో మహా మనీషి కంచెర్ల గొపరాజు.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: