శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం
జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి (39)
అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి
నాయం లోకో௨స్తి న పరో న సుఖం సంశయాత్మనః (40)
శ్రద్ధాసక్తులూ, ఇంద్రియనిగ్రహమూ కలిగినవాడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు. జ్ఞానం కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అజ్ఞానం, అశ్రద్ధ, అనుమానం మనిషిని పాడుచేస్తాయి. అడుగడుగునా సందేహించేవాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులుండవు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి