25, ఏప్రిల్ 2025, శుక్రవారం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః 

జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి (39)


అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి 

నాయం లోకో௨స్తి న పరో న సుఖం సంశయాత్మనః (40)


శ్రద్ధాసక్తులూ, ఇంద్రియనిగ్రహమూ కలిగినవాడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు. జ్ఞానం కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అజ్ఞానం, అశ్రద్ధ, అనుమానం మనిషిని పాడుచేస్తాయి. అడుగడుగునా సందేహించేవాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులుండవు.

కామెంట్‌లు లేవు: