25, మే 2025, ఆదివారం

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)

శోకో నాశయతే ధైర్యం 

శోకో నాశయతే శ్రుతమ్.

శోకో నాశయతే సర్వం 

నాస్తి శోకసమో రిపుః

(వా.రా.2.62.15)


*అర్థం:*

శోకము (విచారిస్తూ ఉండిపోవడం) ధైర్యాన్ని నాశనం చేస్తుంది. శోకము ఉన్న విజ్ఞానాన్ని, వివేకాన్ని నాశనం చేస్తుంది. అది ఇది అని ఏమిటి, శోకము సర్వమూ నశింపచేస్తుంది. శోకాన్ని మించిన శతృవు లేదు.

(కష్టాలు వచ్చినప్పుడు విచారిస్తూ ఉండిపోక, తేరుకుని ధైర్యంగా ముందుకు సాగాలి)

*_ముఖ్యంగా నేటి యువత దీనిని గ్రహించాలి._*


శ్రీ సూర్య మండల స్తోత్రం తో శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

కామెంట్‌లు లేవు: