4, జులై 2025, శుక్రవారం

వారాహీ మాత🙏

 🙏 వారాహీ మాత🙏

వారాహీ మాత గురించి ఒక్కొక్క పురాణం లో ఒకోరకంగా చెప్పబడింది. వారాహీ మాతను గురించి వివరిస్తాను

వారాహీ దివా న స్మరేత్ అని శాస్త్ర వచనం 

వారాహీ మాతను పగటి పూట స్మరింపరాదు అంటే జపించకూడదు. మాత విశ్రాంతి తీసుకునే సమయం.ఆ తల్లికి నిద్రాభంగం అవుతుంది 

వారాహీ మాత ఆవిర్భాము గురించి వివిధ పురాణాలలో వివిధములుగా వివిధ వాహనాలతో వివిధ ఆయుధాలతో ఉన్నది. అవి ఒక్కసారి పరిశీలిద్దాము.

వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి. నేపాల్ లో ఈమెను బారాహి అంటారు.( వబయో రభేదః )

వారాహి

పులిని వాహనంగా కలిగి వరాహ ముఖం, పది చేతులతో వారాహి దేవి ఉంటుంది .


ఆయుధములు

త్రిశూలం, ఖడ్గం

వాహనం

గేదె, సింహం, పులి, గుర్రం


వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే.


మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది.

రక్తబీజుడిని చంపడం కోసం దుర్గా దేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వారాహి ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ఆయుధాలుగా కలిగి ఉంది.

దేవీ మాహాత్మ్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడ్ని సంహరిస్తుంది. వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది.


మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది.


దేవీ భాగవత పురాణం ప్రకారం వారాహిని, ఇతర మాతృకలతో పాటుగా, అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది.


వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత.


మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు.


దేవీ పురాణం వారాహీ దేవిని విచిత్రంగా వరాహా స్వామికి తల్లిగా (వరాహజననిగా) వర్ణించింది.


వారాహిని శైవులు , వైష్ణవులు , శాక్తులు పూజిస్తారు . వారాహిని సప్త-మాతృకల సమూహంలో పేర్కొన్నారు., ఇవి శక్తి మతంలో పూజించబడుతున్నాయి, అలాగే శివునితో సంబంధం కలిగి ఉంటాయి .


వారాహి ఒక రాత్రి దేవత మరియు కొన్నిసార్లు ధ్రుమ వారాహి ("చీకటి వారాహి") మరియు ధూమావతి ("చీకటి దేవత") అని పిలుస్తారు. తంత్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు వారాహిని పూజించాలి. పరశురామ కల్పసూత్రం ఆరాధన సమయం అర్ధరాత్రి అని స్పష్టంగా పేర్కొంది. శక్తలు వారాహిని రహస్య వామమార్గ తాంత్రిక పద్ధతుల ద్వారా పూజిస్తారు, ఇవి ప్రత్యేకంగా పంచమకార ఆరాధనతో సంబంధం కలిగి ఉంటాయి - ద్రాక్షారసం, చేపలు, ధాన్యం, మాంసం మరియు కర్మ సంయోగం . గంగానది ఒడ్డున ఉన్న కాళరాత్రి ఆలయంలో ఈ పద్ధతులు పాటిస్తారు, ఇక్కడ రాత్రిపూట మాత్రమే వారాహికి పూజలు చేస్తారు; గుడి పగటిపూట మూసివేయబడుతుంది. వారాహిని లలితా త్రిపురసుందరి దేవత యొక్క అభివ్యక్తిగా లేదా "దండనాయక" లేదా "దండనాథ"గా భావిస్తారు.

 శక్తిమతం యొక్క శ్రీ విద్యా సంప్రదాయం వారాహిని పరా విద్య ("అతీంద్రియ జ్ఞానం") స్థాయికి పెంచింది . దేవీ మహాత్మ్యం దీర్ఘాయువు కోసం వారాహిని ప్రేరేపించాలని సూచించింది. వారాహి పూజకు మరియు సిద్ధులను పొందేందుకు ముప్పై యంత్రాలు మరియు ముప్పై మంత్రాలు నిర్దేశించబడ్డాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే లలితా దేవి ఇచ్చా శక్తి, రాజమాతంగేశ్వరి జ్ఞానశక్తి వారాహీ మాత క్రియాశక్తి.

మన పురాణాల ప్రకారం మహా శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు,వీరే బ్రహ్మీ ,మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండీ.

8.వ మాతృక గా నారసింహి

9.వ మాతృక గా వినాయకి నీ ఆరాధించడం జరుగుతుంది,భక్తులకు కొంగుబంగారంగా మనల్ని ఎప్పుడు చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు,ఈ సప్త మాతృక స్వరూపిణి ఈ వారాహి మాతగా పరిగణించపడుతోంది, ఈ వారాహిరూపం రూపాన్ని పోలిఉండి,నల్లని శరీరఛాయాతో మేఘ వర్ణంతో ఎనిమిది చేతులతో, అభయ వరద హస్తం,శంకు చక్ర, రోకలి నాగలి,పాశం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది,ముఖ్యంగా లలితదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు ఈ వారాహిమాత,అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామాలలో వినిపిస్తుంది,వారాహి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచినవారికి,భక్తుల పాలిట కొంగు బంగారమై,తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్ని తొలగించి,శత్రుభయం,జ్ఞానసిద్ధి బుద్ధి, ధనప్రాప్తి,ఇంకా అనేక అనేక సకల జయాలు సిద్ధిస్తాయి,అలాగే ఈమె అజ్ఞాచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది, అందుకే ఆమెను ఆజ్ఞచక్రేశ్వరి అన్నారు,శుంభ నీశుoబ,రక్త బీజ వధలోను ఈమె ప్రస్తావన ఉంది.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: