*పంచ గయలు*
మన దేశంలో మొత్తం 5 గయలు ఉన్నాయని చెబుతారు.
*1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ.*
1. *శిరోగయ* : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో *“శిరోగయ”* గా వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.
2. *నాభిగయ* : జాజ్ పూర్, ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను *“నాభిగయ”* అని అంటారు.
3. *పాదగయ* : పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని *“పాదగయ”* అంటారు.
4. *మాతృగయ* : గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని *“మాతృగయ”* అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.
5. *పితృగయ* : బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్లోని అలకనందా నదీ తీరంలో గల *“బ్రహ్మకపాలం”* అనే ప్రదేశాన్ని *“పితృగయ”* అంటారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి