19, సెప్టెంబర్ 2018, బుధవారం

స్వామి వైభోగం  

యాద ఋషి తపస్సుకి మెచ్చి
కొండపై  వెలసిన  స్వామి
తాపసి పేరుతో నే యాదగిరి
ఋషి కోరికపై గోపురం మీద సుదర్శనం
క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు
వెలసిన క్షేత్రమే ఈ యాదాద్రి
అనారోగ్య భక్తులకు
గ్రహః పీడా రోగులకు
ఆరోగ్యాన్నిచ్చే స్వామి
ఋషి ఫై అనుగ్రహంతో
పంచ రూపుల్లో వెలసిన స్వామి
మెట్ల దారిన వచ్చే భక్తులకు
మోకాళ్ళ నెప్పులు తగ్గించే స్వామి
గుండంలో స్నానమాడితే
సర్వ పాపాలు హరించే స్వామి
తెలంగాణ వచ్చాక
యాదగిరి యాదాద్రిగా మారింది
దిన దినం స్వామి వైభోగం పెరిగింది
అన్న దాన సత్రాలు
వసతి గదులు, కొత్త రోడ్ల నిర్మాణాలు
భక్తులకు కొంగు బంగారం ఈ స్వామి
నిత్యా కళ్యాణం పచ్చ తోరణం
భక్తుల పాలిట కల్పవృక్షం
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి




కామెంట్‌లు లేవు: