31, ఆగస్టు 2020, సోమవారం

దీపారాధన చేయడం

🍁🍁🍁🍁🍁🍁🍁🍁దీపారాధన చేయడం వల్ల కలిగే సత్ఫలితాలు ఏమిటి? అంటే దీపం వెలిగే చోట లక్ష్మీ నివాసం ఉంటుంది. 🍁దారిద్య్రములు తొలగి ఐశ్వర్యములు లభిస్తాయి. దేవతా శక్తులు స్ధిరనివాసం చేస్తాయి. 🍁దీపం వెలిగించి పూజాదికాలు చేస్తే విఘ్నకారకాలైన తామస శక్తులు, రాక్షస భూతప్రేత పిశాచాలు దరి చేరవు. 🍁దీపారాధన క్రమంగా మనలో ఙ్ఞానం ను వికసింప చేస్తుంది. 🍁దీప ప్రజ్వాలన వలన ఉత్తమ లోకాలూ లభిస్తాయి. 🍁దేవతా లోకాలుగ చెప్పే ఊర్ధ్వ లోకాలన్నీ కాంతి లోకాలు. అధోలోకాలన్నీ చీకటి మయాలు. జ్యోతిని వెలిగించడం వలన జీవునికి మంచి గతులు లభిస్తాయి. పుణ్య లోకాలు సిద్ధిస్తాయి. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపావళి నాడు దీపాలు వెలిగించడం, కొరివి రగిలించడం వలన మరణించిన పెద్దలకు ఉత్తమ గతులు కలగాలనే ఉద్ధేశ్యంతో చేస్తారు. సంధ్యా సమయాలలో దీపం వెలిగే ఇంట దైవీశక్తులు ఉంటాయి. అటువంటి ఇంట్లో రోగాలు, నిరుత్సాహం, కలహాలు, దారిద్ర్యము మొదలైన బాధలు ఉండవు.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: