31, ఆగస్టు 2020, సోమవారం

నీళ్లు.. నిజాలు

ఎందుకని మల్టీనేషనల్ కంపెనీల నీళ్ళకూ కూల్ డ్రింకులకూ అలా పురుగులు పట్టడం లేదు.?
.
ఎందుకని మనం ఇంట్లో తొట్టెల్లో పట్టిన నీళ్ళు రెండు రోజులకూ మనం తయారు చేసుకునే పళ్ళరసాలు మర్నాటికే పాడైపోతున్నాయి? అవి మన ఇంటిలోని వాటికన్నా మంచివి అవ్వడం వల్లనా నీళ్లు నిజాలు
.
కాదు కాదు కానే కాదు మరి నిజం ఏవిటి?
.
నేను ఈ ప్రయోగం చేసి అనేక బాటిల్స్ నీళ్ళనూ, కూల్ డ్రింకులనూ స్వయంగా పరిశీలించి వాటి Ph Values చూసిన తర్వాతే ఈ పోస్ట్ పెడ్తున్నాను.
Please read and save your own mother, father and your own family and save other's health.
.
సహజంగా మనం తాగే నీరు, Normal Pure Drinking Water Ph. Values కనీసం 7 వరకూ వుండాలి..మనం ప్రతి రోజూ 20/- రూపాయల నుంచి నుంచి 100/- వరకూ డబ్బు పెట్టి బస్టాండ్లలో/ రైల్వేస్టేషన్లలో/ ఎయిర్ పోర్ట్ ల్లో కొనుక్కుని తాగే కిన్లే, ఆక్వాఫినా బిస్ లరీ, బ్రయిలీ ఇలా అనేక వాటర్ బాటిల్స్ లోని Ph. Values Test చేసి చూస్తే అవి కనీసం 5.5 కూడా లేదు. అంటే మనం ఎంతో ఆరోగ్యకరమైన వని అనుకుంటూ ఎంత భయంకరమైన ఎసిడిక్ కంటెంట్ వున్న నీటిని తాగుతున్నామో మనం ఆలోచించాలి. తెలుసుకోవాలి.
న్యూస్ పేపర్లలో, టివి చానల్స్ లో ఆ మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఎవరికి వారు ఈ వ్యాపారం లోకి దిగారు. మనకు వాళ్ళ కంపెనీల ముద్ర వున్న నీరు మాత్రమే ఎంతో మంచిదని భ్రమ కలిగిస్తూ మనకు ఎంతో ఇష్టమైన సినిమా వాళ్ళని క్రికెటర్లను అడ్డం పెట్టుకుని వాళ్ళకి కోట్లు ఇస్తూ ప్రకటనల్లో నటింపచేస్తున్నారు. వారు కోట్ల డబ్బు కోసం చేసే ప్రకటనలు చూసి మనం మోసపోతున్నాం. నిజానికి మనం తాగే నీరు ఆల్కలైన్ స్టేజ్ లో వుంటే రుచి తక్కువగా వుంటుందని పుల్లగా వుండడం కోసం ఆ నీటిలో ఎసిడిక్ కంటెంట్ వుండేట్టుగా మన కార్పొరేషన్ నీరుని మారుస్తున్నారు.
ఎసిడిక్ టేస్ట్ అంటే కొద్దిగా పుల్లని రుచితో మామూలు మంచి నీటికన్నా భిన్నమైన రుచితో వుంటుంది. మనం వారి అడ్వర్టైజ్ మెంట్లు చూసి ఆ నీరు కార్పొరేషన్ నీరు కన్నా శుద్దమైన నీరని వారి వాటర్ కన్నాఎంతెంతో మంచి నీరు అనే భ్రమలో అజ్ఞాన అంధకారంలో బతుకుతున్నాం.

వాళ్ళు మామిడి పండు రసాన్ని విమర్శిస్తూ మజాని తాగమంటారు. బత్తాయి కమలా పళ్ళరసాల్ని విమర్శిస్తూ ఆరెంజ్ డ్రింక్ తాగమంటారు. చదువుకున్న మనం తాగేది మంచి వనుకుంటూ చదువుకోని వారు కూడా తాగుతున్నారు.
ఏడ్స్ లో వారు చూపించేదంతా నిజమేనేమో అనుకుని అత్యంత భయంకరమైన ఏసిడ్ మీడియం ద్రావకాలను మనం తాగుతూ పసిపిల్లలకు కూడా తాగిస్తున్నాం. ఎసిడిక్ మీడియం లోని వస్తువులు తినడం వల్ల తాగడం వల్లా శరీరమంతా బలహీనమైనపోయి ఎక్కడలేని రోగాలతో సర్వనాశనమౌతున్నాం.
.
కాన్సర్ పుండ్లు కాన్సర్ కణాలు అన్నీ ఎసిడిక్ మీడియంలోనే పెరుగుతాయి.
ఆ కణాలు విపరీతంగా పెరగడానికి ఈ ఎసిడిక్ మీడియం నీళ్ళు కూల్ డ్రింకులూ కారణమౌతాయి. ఆస్తమా న్యుమోనియా వ్యాధుల తీవ్రతని ఎంతగానో పెంచుతాయి. అంతే కాదు రక్తంలో ఇంకా అనేక వ్యాధులు రావడానికీ, గాల్ బ్లాడర్, లివర్, కిడ్నీలు సర్వనాశనమవ్వడానికీ కారణమౌతుంది. అందుకనే ఆయుర్వేద వైద్యం వీలైనంత వరకూ మంచి నీటి బావినీరునే వాడుకోమని చెప్తుంది. లేదా మామూలుగా వచ్చే కుళాయిలోని నీటిని మామూలు ౩ కాండిల్స్ ఫిల్టర్స్ లో వేసుకుని త్రాగాలని సలహా ఇవ్వడం జరుగుతోంది. మనకు పుల్లని రుచితో వుండే ఈ ఎసిడిక్ నీళ్ళు కావాలో ఆరోగ్యం కావాలో మనమే ఇక నిర్ణయించుకోవాలి.
మనం రుచి కావాలనుకుంటే మంచి నీటిలో ఏలక్కాయల తొక్కులు వేసుకుని వాడుకోవచ్చు. మీకు ఇంకా పుల్లని నీరు తాగాలనిపిస్తే చక్కగా ఫ్రెష్ లెమన్ జ్యూస్ తీసుకుని తేనె వేసుకుని తాగచ్చు కదా ఈ కెమికల్ వాటర్ తాగి కుళ్ళి కుళ్ళి చావడం కన్నా.
..
మనం ఎవరో ఒక సినిమా స్టార్ చెప్తే మనం మళ్ళీ నమ్మి వాటిని మనం మన పిల్లలకి కూడ పట్టిస్తున్నాము. ఆ సినిమా హీరో కూల్ డ్రింక్ త్రాగుతుంటే చూసి వాళ్ళు తాగమని చెప్పే అత్యంత హానికరమైన కూల్ డ్రింకుల్నీ సోడాల్ని, బాటిల్డ్ వాటర్నీ ఎంత డబ్బుపోసి కొంటున్నాం. అవి నిజంగా అంతగా హానికరం కావు అని నమ్మి స్వయంగా కన్న తల్లి తండ్రులే తమ పసిబిడ్డలకు కూడా ఆ ద్రావకాలను తాగించేస్తున్నారు. అనేక వ్యాధులకు కారణమౌతున్నారు.
.
మనం చేసిన లెమన్ జ్యూస్ మర్నాటికి కంపు కొడుతుంది కదా..
మరి కూల్ డ్రింకుల్లో ఎందుకు పురుగులు రావు ??
.
ఎందుకు రావంటే పురుగుల మందుకలిపిన పదార్ధానికి పురుగులు పట్టవు కనక. ఆ కంపెనీల వారు తయారు చేసిన కూల్ డ్రింకులకు షెల్ఫ్ లైఫ్ పెరగడానికి వారు పురుగు మందులతో పాటు, అంత కన్నా ప్రమాదకరమైన కెమికల్స్ ని ప్రిసర్వేటివ్స్ పేరుతోనూ ఎసిటిక్ ఏసిడ్ కలిపి చేసిన ద్రవ పదార్థాల వల్లా, ఆహరపదార్థాల వల్లా ఎన్నో ఏసిడ్ మన ఒంట్లోకి ప్రవేశించి కేన్సర్ కి, Asthma కి, ఆర్థరైటిస్, జాండిస్, డయబిటిస్ వంటి అనేక రుగ్మతలు పెరగడానికి కారణమౌతున్నాయి.
మల్టీనేషనల్ కంపెనీలు వేసే భయంకరమై వేషాలు, చేసే అతి నీచమైన మోసాలూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యరు చెయ్యలేరూ. ఆస్థమా, ఆర్థైటిస్ డయబెటిల్, లో బిపి హైబిపిలు వచ్చేట్టు చేసేది వాళ్ళు తయారు చేసిన ఆహారాలే.
ఆ రోగాలుఎలా వస్తాయో తెలియదని చెప్పేది వారే.
ఒకసారి రోగం వస్తే తమమందులను జీవితమంతా వాడాల్సిందే అని చెప్పేదీ వారే. పిల్లి గుడ్డిదైతే ఎలక ఎదురునిలబడి ఎకసెక్కెం చేసిందనే సామెత నేడు భారత దేశంలో ఎంతో నిజం.
.
సింపుల్ గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే మనం తాగే ఆక్వాఫినా కిన్లే బిస్ లరీ బాటిల్స్ లో సప్లై చేసే నీరు ఒక గ్లాసు తాగితే అది కనీసం ఒక 12 గ్లాసుల ఆల్కలైన్ వాటర్ తాగితే కానీ న్యూట్రల్ కాదు. ఇక కిన్లే బిస్ లరీ సోడాలూ కూల్ డ్రింకులు ఒక గ్లాస్ నీరు తాతితే కనీసం 24 గ్లాసుల ఆల్కలైన్ నీరు త్రాగితే కానీ మళ్ళీ ఆనీరులోని ఏసిడ్ నార్మల్ కాదు.
.
శాస్వత పరిష్కారం.
.
అ నీటికన్నా మన కార్పొరేషన్ వారు ప్రతి రోజూ మన ఇళ్ళకి సప్లై చేస్తున్న మంచి నీరు కనీసం 12 రెట్లు మంచి నీరు. దానిని హాయిగా మామూలు ఫిల్టర్ల లో పోసుకుని త్రాగడమ్ ఎంతో మంచిది.
ఇంకా కావాలంటే చక్కగా బిందెలో వీలైతే రాగిబిందెలో కాచుకున్న నీటిని మట్టి కుండలో పోసుకుని టెస్ట్ చేస్తే మాకు 9.6 Ph Values వున్న నీరుగా మారింది. అంటే ఎంతో ఆరోగ్యకరమైన నీరు అన్నమాట.
లేదా పాత ఫిల్టర్లు వుండేవి మూడు కాల్షియం కాండిల్స్ వుండే ఫిల్టర్లు అలాంటివి అయినా మంచివే. 
ఆ నీటిని కొద్దిగా వేడిగా ప్రతి రోజూ ఉదయం మూడు గ్లాసులు తాగితే దగ్గూ జలుబూ ఆస్థమా వ్యాధులు, వైరల్ జ్వరాలూ తగ్గుముఖం పడతాయి. కిడ్నీ వ్యాధులు జాండిస్ లూ రాకుండా వుంటాయి.
.
ఊరు వెళ్తుంటే బద్దకం వదిలెయ్యండి.

ఏదైనా ఊరు వెళితె చక్కగా మీ నీళ్లని, దానిలో వున్న మీ ఆరోగ్య్యాన్ని, మీ చేత్తో ఒక Bag లో తీసుకుని వెళ్ళండి.
అది వీలు కాలేదా..ఆ నీళ్ళు అయిపోతే ఎక్కడ ఏ మనుషులు సాధారణంగా ఏ నీరు త్రాగుతున్నారో ఆనీరును మీరు కూడా త్రాగండి.
ఎంత దూరప్రాంతాలకు వెళ్ళినా బాటిల్ వాటర్ త్రాగి కేన్సర్లు తెచ్చుకోవడం కన్నా ఆ ఊర్లలో ఏ తల్లిని ఏ ఇంట్లో నీరు అడిగినా తప్పకుండా ఇస్తారు.
మనం ఈ రోజుల్లో పైగా సంస్కారం పేరుతో తెచ్చిపెట్టుకున్న ఈ వింత ప్రవర్తనతో,మంచినీళ్ళు అడగడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం నిజం చెప్పాలంటే భయ్తపడిపోతున్నాం. తప్పుగా అనుకుంటారేమో అని.
ఇది చాలా చాలా విచారకరమైన విషయం.అలా అడిగినవాళ్ళని ఎగాదిగా చూస్తున్నాం.
మనజాతి అవలంభించిన అత్యుత్తమమైన విశ్వమానవ సంస్కృతిని అలవరచుకుందాం. ప్రపంచ మానవజాతికి దారిని చూపించే దేశం నుంచి వచ్చిన మనం చివరికి మనం తాగే మంచి నీళ్ళకోసం కూడా ఆ స్వార్ధ వ్యాపార దృష్టితో పనిచేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలపై ఆధారపడాలా?
భారతీయులమైన మనం ముందుగా మన వాళ్ళని రక్షించుకుందాం
తరువాతి తరాలకు దారిచూపిద్దాం.
దార్శనికులమై నిలబడదాం.
.
సత్యమేవ జయతే. జైహింద్.
.
Dr Gautham Kashyap
+917989740833

కామెంట్‌లు లేవు: