25, ఆగస్టు 2020, మంగళవారం

నిజమైన దేశభక్తుడు

అప్పట్లో……
ఆయన నెల జీతం ₹50/-
ఒకసారి చాలా అవసరంగా ₹100/-కావల్సి వచ్చాయి.
ఎక్కడ ప్రయత్నించినా ఆ డబ్బు సమకూడలేదు.
ఆయన పరిస్థితి గమనించిన ఆయన భార్య" నా దగ్గర వున్నాయి" అని ₹100/-ఇచ్చింది.
"ఎక్కడి"వని ఆశ్చర్యపోయి అడిగాడు.
"మీ జీతం నెలనెలా ₹50/-నాకు ఇస్తారు కదా, జాగ్రత్తగా వాడి నెలకి ₹5/- మిగిల్చేదాన్ని.అలా పోగు చేశాను" అని చెప్పింది భార్య.
వంద రూపాయలు తీసుకున్నాడాయన. అవసరం తీరింది.
ఆ మర్నాడు ఆయన పనిచేస్తున్న సంస్థకు" అయ్యా.. మీరు
నాకు ఇస్తున్న ₹50/-జీతం నాకు ఎక్కువ. ఈ నెల నుండీ
₹45/-ఇవ్వండి చాలు"అని ఉత్తరం రాశాడు.
ఆ సంస్థ పేరు కాంగ్రెస్ పార్టీ.
ఆ ఉత్తరం రాసిన మహానుభావుడు ఆ తర్వాత భారత ప్రధాని అయిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు.
అలాంటి నాయకులు
******************

కామెంట్‌లు లేవు: