18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*ధార్మికగీత - 24*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                   

                                        *****

             *శ్లో:- ఆహార నిద్రా భయ మైథునం చ ౹*

                    *సమాన మేతత్ పశుభి ర్నరాణాం ౹*

                    *జ్ఞానో హి తేషా మధికో విశేష: ౹*

                    *జ్ఞానేన హీనాః పశుభి స్సమానాః*

                                        *****

*భా:- సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి. ఆహారము, నిద్ర, భయము, దాంపత్య ధర్మము అనే నాలుగు సహజాతాలు పశు పక్ష్యాదులకు, మానవులకు సమానమే. ఇక వాటికి మనకు తేడా ఏముంది ? ఒక్క జ్ఞానమే వాటినుండి మనిషిని వేరు చేస్తున్నది. అన్ని జన్మలలో నరజన్మ దుర్లభమని , మానవునిగా పుట్టడమే సుకృతంగా భావించాలని శాస్త్రం చెబుతోంది. మనిషిగా వివేకము, వివేచన, విచక్షణలతో జ్ఞానంలో పారమ్యమును సాధించాలి. భక్తియోగంలో పునీతుడై, కర్మయోగంలో నిష్ఠాగరిష్ఠుడై, జ్ఞానయోగంలో మేథోమథనం చేస్తూ పరిణతి చెంది , ముక్తిని పొందాలి అనేది గీతాప్రవచనము. '"జ్ఞానే నైవతు కైవల్యం"- జ్ఞానసముపార్జనతోనే మోక్షప్రాప్తి లభిస్తుంది. జ్ఞానం వల్లనే త్రికరణ శుద్ధి,వైరాగ్యము,శమదమాదుల యందు పరిపక్వత, తదేకనిష్ఠ సాధ్యపడతాయి. నరునిగా అట్టి జ్ఞానాన్ని సాధన చేయకపోతే పశువుతో సమానమే సుమా! అనే హెచ్చరికను అనుక్షణం మననం చేసుకొంటూ, కర్తవ్య పరాయణుడై మానవజన్మను సార్థకం చేసుకోవాలి*.

                                *****

                  *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: