18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

పక్షులు

 *ఒక చెట్టుమీద రెండు పక్షులున్నాయి. ఒక పక్షి పై కొమ్మ మీద, మరోపక్షి క్రింది కొమ్మ మీద కూర్చున్నాయి. పై కొమ్మ మీద కూర్చున్న పక్షి సదా ప్రశాంతంగా, మౌనంగా గంభీరంగా వుంది. క్రింది కొమ్మపై కూర్చున్న పక్షి కొన్నిసార్లు తియ్యని ఫలాలను ,కొన్నిసార్లు చేదుఫలాలను తింటున్నది. ఒకసారి నాట్యం చేస్తుంది, మరోసారి దీనంగా వుంటుంది. ఒకసారి ఆనందింస్తుంది. మరోసారి దు:ఖిస్తుంది. కొన్నిసార్లు చాలా చేదుగా వున్న ఫలాన్ని తిని విసిగిపోతుంది. పై కొమ్మమీద సంతోషంగా వుండే బంగారు రంగు రెక్కలున్న పక్షిని చూస్తుంది. ఆ పక్షిగా మారాలని ఆలోచిస్తుంది. అంతలో మరచిపోతుంది.మళ్ళీ తీపి, చేదు ఫలాలను ఆరగించడం ప్రారంభిస్తుంది. అతి చేదుగా ఉండే మరో ఫలాన్ని ఆరగించి బాధపడుతుంది. పై కొమ్మ మీద కూర్చున్న పక్షిగా మారాలని తిరిగి ప్రయత్నిస్తుంది. క్రమంగా ఫలాలను తినడం మానేస్తుంది. పైన కూర్చున్న పక్షిలా ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది.* 


 *పై కొమ్మ మీద కూర్చున్న పక్షి పరమాత్మ లేదా బ్రహ్మం. క్రింది కొమ్మ మీద కూర్చున్న పక్షి సుఖదు:ఖాలనే కర్మఫలాలను ఆరగించే జీవాత్మ. జీవితమనే యుద్ధరంగంలో ఎడాపెడా దెబ్బలు తింటుంది. ఒకసారి పైకి లేచి ఇంద్రియాలు క్రిందికి లాగగానే క్రిందికి పడిపోతుంది. క్రమక్రమంగా వివేక, వైరాగ్యలను అభివృద్ధి చేసుకుని ధ్యానసాధన చేస్తూ, మనస్సును భగవంతుడి వైపు మళ్ళించి, ఆత్మసాక్షాత్కారం పొంది శాశ్వతబ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది.*

  🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: