18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

చాటువు

 ;


ఉ. “కప్పుర భోగి వంటకము కమ్మని గోధుమ పిండివంటయున్ 


గుప్పెడు పంచదారయును గ్రొత్తగ గాచిన యాలనేయి పెస 


ర్పప్పు ను నల్లపు గొమ్మ నటి పండ్లును, నాలుగు నైదు నంజలున్ 


లప్పల తోడ క్రొంబెరుగు లక్షణ వజ్జల యింట రూకకున్.”



ఈ పద్యం క్రీడాభిరామం లోనిది. దీనిని శ్రీ నాధుడు వ్రాశాడనీ , వినుకొండ వల్లభ రాయుడు వ్రాశాడనీ రెండు రకాలుగా జనశ్రుతి వుంది. 


మంచన భట్టు , టిట్టిభ సెట్టి అనే ఇద్దరు దేశాటనం చేస్తున్నప్పుడు ఒక పూట కూళ్ళ యింటిలో లభించే భోజనాన్ని వర్ణించే పద్యం ఇది. 


( ఓరుగల్లు లో వాళ్ళిద్దరూ సంచారం 

చేస్తున్నప్పుడు చేసిన వర్ణన )


ఒక రూక కు ( ఇప్పటి రూపాయి కాదు. ) లక్ష్మణ వజ్జల అను వాని పూటకూటి యింటిలో లభించే భోజనం : 


 కప్పురభోగి అనే మేలిరకం బియ్యపు అన్నమూ, గోధుమ పిండి పణ్యారాలు , పంచదార, తాజా ఆవునేయి, పెసరపప్పు, అల్లపుకొమ్మూ, అరటి పండ్లూ, నాలుగైదు కూరలు ,గిన్నెలతో అప్పుడే తోడుకొన్న గడ్డ పెరుగు - వీటన్నిటి తో ఒక్క రూక కే కమ్మటి భోజనం !.


 “ లప్ప” : పాత్ర, గుండిగ , తప్పేల , తళిగ , బాన , బిందె మొ. 

 .

కామెంట్‌లు లేవు: