18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*ఆచార్య సద్భోదన*



మనల్ని మనం విస్మరించకుండా పరిపూర్ణ భక్తిలో మునగలేము. రెండు భిన్న విషయాలయందు ఒకే సమయంలో ఏకాగ్రతను చూపించలేము. మనం భగవంతుని గురించి ధ్యానిస్తూ, అదే సమయంలో మనలోని అహం ఎడల అప్రమత్తతను ప్రకటించలేము. పరిపూర్ణ హృదయంతో, భక్తితో ఆదర్శం పట్ల మెలగగలిగితే దాని సారాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది. మనలోని అవగాహన పెరిగే కొద్దీ ఉన్నతమైన ఆలోచనల ముడులు విడివడుతూ వస్తాయి. అప్పుడు విశ్వాసం, శరణాగతి సహజంగా మన వద్దకు చేరి మనలో నిశ్చలతనూ, ప్రశాంతతనూ కలిగిస్తాయి.

సర్వేజనా స్సుఖినోభవంతు.


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: