18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

భారతం లో "కుంతీ కుమారి

 "


 (ఆదిపర్వం, పంచమాశ్వాసం.)


 తరువోజ వృత్తం.



"ఏల యమ్ముని నాకు నిచ్చె నిమ్మంత్ర? మిమ్మంత్రశక్తి యే నెరుగంగ వేడి


యేల పుత్త్రకు గోరి యెంతయు భక్తి నిను దలంచితి బ్రీతి? నినుడును నాకు


నేల సద్యోగర్భమిచ్చె? గుమారు డేల యప్పుడ యుదయించే? నిం కెట్టు


లీ లోకపరివాద మే నుడిగింతు? నింతకు నింతయు నెరుగరె జనులు?


వసంత తిలక వృత్తం.


"ఈ బాలు నెత్తుకొని యింటికి జన్న, నన్నున్‌

నా బంధు లందరు మనంబున నేమనా? రె

ట్లీ బాలసూర్యనిభు నిట్టుల డించి పోవం

గా బుద్ధిపుట్టు? నని కన్య మనంబులోనన్‌".

 

-ముందూ వెనుకా ఆలోచించకుండా తాను చేసిన ఈ పనికి ఫలితం ఎలా వుండబోతోందో ఊహించుకుంటూ కుంతి బాధపడుతున్న సందర్భం లోనివి ఈ పద్యాలు.

 

‘ఎందుకు ఆ ముని (దుర్వాసుడు) అడగగానే ఆ మంత్రం నాకు ఉపదేశించాడు?


 ఆ మంత్ర శక్తిని నేను పరీక్షించే ఆలోచనతో పుత్రునికోసం ప్రార్థించి ఎంతో భక్తితో నిన్ను ఎందుకు మనసులో ప్రీతితో తలుచుకున్నాను? 


సూర్యభగవానుడు కూడా దయతలచి ఎందుకు నాకీ సద్యోగర్భం ఇచ్చాడు? 


అలా వరం ఇచ్చిన వెంటనే, ఈ కుమారుడు ఇప్పటికిప్పుడే ఎందుకు ఉదయిం చాడు? 


దీనివలన లోకులు వేసే అపనిందను నేను ఏ విధంగా ఆపగలను?


 జరిగినదంతా ఇంతకింతకూ పసిగట్టి తెలుసుకోకుండా జనులు మానతారా?


 ఈ పసిబాలుని ఎత్తుకుని ఇంటికి వెళితే, నా బంధువులంతా నన్ను ఏమీ అనకుండా ఊరకుం టారా? 


అలాగని, ఎట్లా ఈ సూర్యప్రభతో సమానంగా వెలిగిపోతున్న బాలుడిని ఇక్కడే వదిలిపెట్టి పోవడానికి మనసు పుడుతుంది?


’ అని పై పద్యంలో కుంతి మనసులోని ఎన్నో ప్రశ్నలకు రూపమిస్తుంది. 

 

 మూలంలో రెండు శ్లోకాలలో ఛాయామాత్రంగా ఉన్న విషయాన్ని నాటకీయంగా పెంపొందించి రచించాడు నన్నయ. (జంధ్యాల వారు మరింత హృద్యం గా మలచేరు.)



వ్యాసభారతంలోని ఆ రెండు శ్లోకాలు :

 

"దృష్ట్వా కుమారం జాతం సా వార్ష్ణేయీ దీనమానస్ఢా


ఏకాగ్రం చిన్తయామాస కిం కృత్వా సుకృతం భవేత్ఢ్ఢ్‌"


‘అప్పుడే పుట్టిన ఆ కుమారుడిని చూసి వృష్ణివంశ కన్య అయిన కుంతి హృదయం చాల దుఃఖంతో నిండిపోయింది. ఆమె ఏకాగ్ర చిత్తంతో అప్పుడు ఏమి చేయడం వలన అంతా మంచి జరుగుతుందో అది చేయడానికి సంకల్పించుకున్నది’ అని పై శ్లోకం భావం.

 

"గూహమానాపచారం సా బన్ధుపక్షభయాత్‌ తద్ఢా

ఉత్ససర్జ కుమారంతం జలే కుంతీ మహాబలమ్ఢ్ఢ్‌"

 

‘ఆ సమయంలో కుటుంబజనుల వలన భయంతో తాను చేసిన ఆ అనుచిత కృత్యం వారికి ఎప్పటికీ తెలియకుండా పోయే విధంగా ఆ మహాబలుడైన కుమారుడు, కర్ణుడిని నదీ జలంలో వదిలివేసింది’ అని పై శ్లోకం భావం.


 సేకరణ.

కామెంట్‌లు లేవు: