5, సెప్టెంబర్ 2020, శనివారం

మంత్ర పరిశీలన

వక విశేషమైన మంత్ర పరిశీలనలో ' హ్వయాం అగ్నిం ప్రధాన స్వస్తయే హ్వయామి మిత్రా వరుణా వి హావసే హ్వయామి రాత్రీం జగ తో నివేశనీం హ్వయామి దేవం సవితాః అమూతయే అని మనం రోజూ సూర్యరశ్మిని చంద్ర కాంతిని ఎందుకు దర్శించి వీటి వలన మానవ నిర్మాణానికి ఫలమేదైనను కలదా. పరిశీలించిన అది ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ, అని అదే సాయం సమయంలో ఆకృష్ణేన అని వక చిన్న తేడా మంత్రంలో సత్యము బదులుగా అనగా చూసిన కిరణ శక్తి సత్యమే, అది సాయం సమయంలో కృష్ణేన అని మిగిలిన మంత్రం అంతా వకటే. సూర్యుని కిరణ లక్షణము అనగా చైతన్య మైనది సత్యమని తెలియును. కాని దాని లక్షణము చంద్రకాంతివలననే అనగా స్స్వీకరించినగాని,లేక అనుభవించినగాని అగ్ని లక్షణము చంద్ర దర్శనమువలన మానవ జీవ వుత్పత్తికి మూలమని తెలియును. యిది ఏ రోజుకు ఆరోజే దాని లక్షణం వివిధ రకములుగా యుండును అదే ప్రకృతిని ఆశ్వాదించుట. నిజంగా ప్రకృతిలో లేదు. అది మనలోనే ఉదయమే సూర్యుని నుండి నిల్వ చేయబడి చంద్ర దర్శనం అవగానే దాని లక్షణము మనస్సుకు తెలిసి ప్రేరణ అందుకే కృష్ణేన అనగా చీకటిలోనే తత్వం తెలియుటకై అలాగని చీకటి కాదు కొంత వెన్నెల రూపంలో. అనగా ప్రకృతిని సమ పాళ్ళలో ఆశ్వాదించుట జీవ లక్షణమని తెలియును. సూర్యకిరణాలు వలన మనలో యున్న శక్తి చార్జి చేయబడి చంద్ర కాంతి దానికి ఇగ్నీషియమ్గా పనిచేయును. అప్పుడే మనస్సు అహ్లాదకరమైన ప్రకృతి లక్షణమును ఆశ్వాదించుట. యిది యే పై మంత్రం సారాంశం. తెలుసుకుంటూనే ఉందాం. ఆచరిస్తూనే ఉందాం.

కామెంట్‌లు లేవు: