31, జనవరి 2021, ఆదివారం

అనుమానం..అడగనా

 తాతా..తాతా...ఒక అనుమానం..అడగనా?


అడుగురా చంటీ... ఆడిగితేనే కదా అనుమానం తీరేది..


ఏం లేదు తాతా రోజూ నువ్వు కుళాయి నీళ్లతో స్నానం చేస్తున్నావ్ కదా! మరి ఆ చేస్తున్నప్పుడు నువ్వు ' ॥ ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి  నర్మదా సింధు కావేరీ - జలేస్మిన్ సన్నిధిం కురు॥ అని ఎందుకు చదువుతావు ? నువ్వేమి గంగ నీటి తోనో గోదావరి నీటి తోనో స్నానం చెయ్యడం లేదు కదా?


మంచి ప్రశ్న వేశావు. సరే జవాబు విను.


మన పూర్వీకులు ఏ పని చేసినా ఒక ఆశావహ దృక్పధం అంటే పాజిటివ్ ఆలోచనతో చేస్తే ఆ పని ఫలితం కూడా పాజిటివ్ గా వుండే అవకాశం మెరుగుపడుతుంది అని తెలుసుకొని  మన రోజూ వారీ జీవనవిధానంలో కూడా అలా పాజిటివ్ గా ఆలోచించే విధంగా కార్యక్రమాలులో  లేదా అలవాట్లులో  చొప్పించారు. 

మీ మామ్మ చూడు..

బియ్యం అయిపోయాయి అని చెప్పదు. నిండుకున్నాయి అని అంటుంది.

అలాగే దీపం ఆరిపోయింది అనదు, ఘనం అయింది లేదా దీపం కొండెక్కింది అంటుంది

నల్ల పూసల గొలుసు లేదా మంగళ సూత్రం  తెగితే.. గొలుసు పెరిగింది అంటుంది. కానీ తెగింది అని అనదు.

ఇలా ప్రతీదీ పాజిటివ్ గానే చెపుతుంది తప్ప నెగటివ్ గా చెప్పదు.


ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న తీసుకుంటే..

మనకి గంగ యమునా గోదావరి వంటి నదులను పవిత్రంగా భావిస్తాం వాటిని దైవాలుగా కూడా కొలుస్తాం వాటి నీరు వాడుక కూడా ఆరోగ్యంగా భావిస్తాం. కానీ అన్ని ప్రదేశాల్లో ఆ పవిత్ర నదులు ఉండవు కదా! అందుకే అసలు నీటికే గంగమ్మ అని పేరు పెట్టేసుకున్నాం. అలాగే నీటితో జీవితాలు పెనవేసుకున్న బెస్తవారిని గంగపుత్రులు అంటాం. అంటే గంగ వంటి పవిత్ర నదులు మన జీవితాల్లో ఎంతగా పెనవేసుకున్నాయో చూశావు కదా! 


నేను కుళాయి నీళ్ల తోనో, చేరువులోనో, యేటి నీళ్ల తోనో స్నానం చేస్తున్నప్పుడు కూడా ఈ శ్లోకం పఠించో లేక ఒక దండం పెట్టో ఆ నీటిని పవిత్ర గంగజాలంగా భావించి స్నానం చేస్తున్నాను అన్న మాట. అలా భావించడం వల్ల మనం మానసికంగా ఒక పాజిటివ్ థాట్ ని శరీరానికి ఇస్తున్నాం. అంటే ఈ నీరు పవిత్ర గంగాజలంతో సమానం. నా ఆరోగ్యానికి హాని కలుగకుండు గాక అని.


అంటే అలా అనేసుకుంటే అవి నిజంగా గంగ, గోదావరి నీళ్ళు అయిపోతాయా తాతా అని నువ్వు అడగవచ్చు.. దీనికి నేను ఉదాహరణ చెపుతాను.


మా చిన్నప్పుడు రైల్లో వెళుతున్నప్పుడు తాగడానికి నీరు ఇలా మినరల్ వాటర్ బాటిల్స్ లో దొరికేది కాదు..ప్లాట్ ఫామ్స్ మీద కుండలతో ఆ తరువాత కుళాయిలు ఆ తరువాత కూలర్స్ లో అందించేవారు. అదే నీరు భయపడకుండా తాగేవారం.  ఇప్పుడు (చేతిలో కాస్త డబ్బు ఉంటే) ఆ నీరు తాగడానికి భయపడుతున్నాం. అందుకని ₹20 పెట్టి ఒక లీటర్ నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. మరి ఆ సీసాలో దొరికే నీళ్లు నువ్వు ప్రతీ సారీ టెస్ట్ చేసి తాగవు కదా! ఆ సీసా మూత సీల్ సరిగ్గా ఉంటే ఏ అనుమానం లేకుండా తాగేస్తున్నావ్. మరి ఆ కంపనీ వాడు ఆ సీసాల్లో ఏ బోర్ నీళ్ళో, చెరువు నీళ్ళో పోసి ఉండచ్చు కదా! అలాగే ఈ మధ్య వింటున్నాం ప్లేట్ ఫార్మ్ మీద దొరికే ఆ ఖాళీ బాటిల్స్ లో సాధారణ కుళాయి నీరు పోసి దొంగ సీల్ వేసి ట్రైన్స్ లో అమ్ముతున్నారు అని. అయినా మనం అనుమానం పడకుండా తగుతున్నాం. అంటే దానికి కారణం ఆ సీసా మీద ఉన్న బ్రాండ్ పేరు. అంటే ఆ నీటికి కంపనీ వాడు ఒక బ్రాండింగ్ చేసాడు. నిజంగా టెస్ట్ చేయకపోయినా ఆ పేరు చూసే మనం ఆ నీటి క్వాలిటీ నమ్ముతున్నాం. అంటే మనసుకి ఒక ధైర్య వచనం చెపుతున్నాం. నేను తాగుతున్న నీరు ఫలానా కంపెనీ స్వచ్ఛమైన నీరు. ఈ నీరు తాగినా నాకు అనారోగ్యం రాదు అని. ఒక వేళ ప్రయాణంలో కానీ ప్రయాణం అయ్యాక గాని సుస్తీ చేసినా ఈ నీటి వల్ల అని అనుమానించం.

అంటే అక్కడ నువ్వు ప్రతీసారీ టెస్ట్ చేయకపోయినా నమ్ముతున్నావ్. అంటే ఇక్కడ ఆ బ్రాండింగ్ నీకు ఒక పాజిటివ్ ఆలోచనని ఇస్తోంది అన్నమాట.


అంటే ఈ శ్లోకం చదవడం ద్వారా లేదా ఒక నమస్కారం పెట్టడం ద్వారా ఆ సాధారణ నీటికి మనం మానసికంగా బ్రాండింగ్ చేస్తున్నాం అన్న మాట

       *SO BE POSITIVE*. 

*GANDHIJI ALWAYS HAS*

 *POSITIVE THOUGHTS*


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: